Khammam

News April 20, 2024

ఖమ్మంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు

image

ఖమ్మం ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చంద్రబాబు అభిమానులు 74 కిలోల కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. అభివృద్ధిపై అవగాహన ఉన్న నాయకుడు చంద్రబాబు అన్నారు. టీడీపీ నాయకులు వాసిరెడ్డి రామనాథం, కేతినేని హరిచంద్ర ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.

News April 20, 2024

లొంగిపోయిన మావోయిస్టులు

image

ఎలాంటి భయాందోళనకు గురికాకుండా మావోయిస్టులు ధైర్యంగా లొంగిపోతే సంరక్షణ బాధ్యత తీసుకుంటామని ఎస్పీ శబరీష్ తెలిపారు. ఈ సందర్భంగా మావోయిస్టులైన నాగరాజు, సంజు ఎస్పీ ముందు లొంగిపోయారు. ఎస్పీ మాట్లాడుతూ.. లొంగిపోయిన CPI (మావోయిస్ట్) వారి పునరావాసం, సంక్షేమం కోసం ప్రభుత్వం ద్వారా అందించబడిన రివార్డ్ మొత్తాన్ని DDల రూపంలో మంజూరు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

News April 20, 2024

తాండ్ర వినోద్‌రావు ఆస్తులు, అప్పులివే..

image

ఖమ్మం బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావుకు రూ.16.25 కోట్ల చర, స్థిరాస్తులున్నాయి. పలు సంస్థల్లో పెట్టుబడులు, వినోద్‌రావు దంపతులకు కలిపి మొత్తం 6.8 కిలోల బంగారు, 61.3 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి. కొత్తగూడెం, మేడ్చల్‌, వికారాబాద్‌ జిల్లాల్లో విలువైన వ్యవసాయ భూములు, మేడ్చల్‌లో వ్యవసాయేతర భూములు ఉన్నాయి. చరాస్తుల విలువ రూ.9.95 కోట్లు. స్థిరాస్తుల విలువ రూ.6.30 కోట్లు. రూ.3.42 లక్షల అప్పులున్నాయి.

News April 20, 2024

లొంగిపోయిన మావోయిస్టులు

image

ఎలాంటి భయాందోళనకు గురికాకుండా మావోయిస్టులు ధైర్యంగా లొంగిపోతే సంరక్షణ బాధ్యత తీసుకుంటామని ఎస్పీ శబరీష్ తెలిపారు. ఈ సందర్భంగా మావోయిస్టులైన నాగరాజు, సంజు ఎస్పీ ముందు లొంగిపోయారు. ఎస్పీ మాట్లాడుతూ.. లొంగిపోయిన CPI (మావోయిస్ట్) వారి పునరావాసం, సంక్షేమం కోసం ప్రభుత్వం ద్వారా అందించబడిన రివార్డ్ మొత్తాన్ని DDల రూపంలో మంజూరు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

News April 20, 2024

నోట్ రాసి మహిళ సూసైడ్ అటెంప్ట్ 

image

అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు యత్నించిన ఘటన బోనకల్ మండలంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బోనకల్‌కు చెందిన బండి రచన తన భర్త బండి సురేష్ ఇటీవల ట్రైన్ ప్రమాదంలో మరణించాడు. అయితే గత కొద్ది రోజులుగా అత్తమామలు, బావ కలిసి తనను వేధిస్తున్నారంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతుంది.

News April 20, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓పలు శాఖలపై ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
✓ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
✓ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓సత్తుపల్లి నియోజకవర్గంలో డాక్టర్ ఎమ్మెల్యే రాగమయి పర్యటన
….

News April 20, 2024

ఖమ్మం: పెరిగిన బీర్ల అమ్మకాలు

image

ఖమ్మం జిల్లాలో బీర్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. 4 నెలల్లోనే రూ.104 కోట్ల మేర విక్రయాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే అదనంగా రూ.20 కోట్ల మేర ఆదాయం సమకూరింది. ఎండవేడితో గిరాకీ పెరుగుతున్నట్లు వైన్స్ యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇదే అదనుగా వైన్స్ యజమానులు సిండికేట్‌గా మారి బీర్ల ఎమ్మార్పీ రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

News April 20, 2024

‘నిఘా బృందాలు పటిష్ట కార్యాచరణ చేయాలి’

image

లోక్‌‌సభ ఎన్నికల సందర్భంగా డబ్బు, మద్యం, ప్రలోభాల నియంత్రణకు నిఘా బృందాలు పటిష్ట కార్యాచరణ చేయాలని ఖమ్మం వ్యయ పరిశీలకులు అరుణ్ ప్రశాంత్ కృష్ణస్వామి, శంకర నంద్ మిశ్రా సూచించారు. శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్‌‌లోని సమావేశ మందిరంలో జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ సునీల్ దత్‌లతో కలిసి ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ నిఘా అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.

News April 20, 2024

మున్నేరుపై బ్రిడ్జ్ నిర్మాణ ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమీక్ష

image

ఖమ్మం మున్నేరుపై బ్రిడ్జ్, కాంక్రీట్ వాల్ నిర్మాణ ప్రతినిధులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. ఈసందర్భంగా వారికి సలహాలు సూచనలు చేసారు. కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం చేసి పురాతన బ్రిడ్జ్ ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుని రాకపోకలకు ఇబ్బంది ఏర్పడకుండా చూసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు మంత్రి సూచించారు.

News April 19, 2024

రాజ్‌నాథ్ సింగ్ హెలికాప్టర్‌లో ఎన్నికల అధికారుల తనిఖీలు

image

ఖమ్మంలో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు తరపున ఎన్నికల ప్రచారం కోసం కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ హెలికాప్టర్లో వచ్చారు. దీంతో ఎన్నికల సిబ్బంది, ఫ్లయింగ్ స్కాడ్ హెలికాప్టర్‌ను తనిఖీ చేశారు. జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కె. సత్యనారాయణ, శిక్షణ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠలు తనిఖీ చేశారు. 10నిమిషాల పాటు ఈ తనిఖీలు జరిగాయి. ఈ సోదాల్లో ఎలాంటి నగదు, వస్తువులు లభించలేదని అధికారులు వెల్లడించారు.