India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పారిశ్రామిక దిగ్గజం, టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా 1983లో ఖమ్మం వచ్చారు. గాంధీచౌక్లో వ్యాపారవేత్త కాళ్ల వెంకట రామారావు తెలంగాణ ఏజెన్సీస్ను నెలకొల్పగా, నేషనల్ రేడియో ఎలక్ట్రానిక్స్ కంపెనీ డీలర్ షిప్ తీసుకున్నారు. అంతేకాక ఈ కంపెనీ డీలర్ల రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈమేరకు నేషనల్ రేడియో ఎలక్ట్రానిక్స్ కంపెనీ డీలర్షిప్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించగా రతన్ టాటా హాజరయ్యారు.

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే అధికారులు ఓటర్ జాబితా పనిలో నిమగ్నమవగా పోటీ చేయాలనుకునేవారు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే తాము ఎన్నికల్లో గెలవాలంటే ఎలాంటి మేనిఫెస్టో రెడీ చేయాలనే దానిపై వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకు ప్రత్యేక చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం. ఇక మరికొందరు తమ గ్రామంలో ఓటర్ల వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

> బోనకల్ మండలం లక్ష్మీపురానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాక
> రఘునాథపాలెంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
> ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన
> సత్తుపల్లిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
> పెనుబల్లిలో సీపీఎం మండల కమిటీ సమావేశం
> అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన
> ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు
> నవరాత్రుల్లో భాగంగా వీరలక్ష్మి అవతారంలో అమ్మవారు

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తీసుకురాబోతున్న ఇంటిగ్రేటెడ్ విద్యావిధానంలో భాగంగా జిల్లాలో మూడు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శుక్రవారం శంకుస్థాపన జరగనుంది. ఒక్కో విద్యాలయానికి రూ.100 కోట్ల చొప్పున ముగ్గురు మంత్రుల నియోజకవర్గాల్లో రూ.300 కోట్లతో విద్యాలయాల నిర్మాణం కాబోతున్నాయి. హైస్కూళ్లతో పాటు ఇంటర్ విద్యాబోధనతో అన్నికులాల విద్యార్థులకు ఒకే చోట, ఒకే తరహా విద్యాబోధన అందనుంది.

రాష్ట్ర వార్షిక లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయ పెంపు మార్గాలపై దృష్టిని సారించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదాయం సమకూర్చే శాఖల లక్ష్యాలపై సీఎం, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. వార్షిక లక్ష్యాలను చేరుకోవడంలో శాఖల పనితీరును మెరుగు పరుచుకోవాలని చెప్పారు. సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉన్నారు.

కూసుమంచి మండలం పెరిక సింగారం గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకల్లో రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి కోలాటం ఆడుతూ బతుకమ్మ వేడుకల్లో సందడి చేశారు. మంత్రి మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని, 9 రోజులు తీరొక్క పూలతో గౌరమ్మను ఘనంగా పూజించి, సమైక్య స్పూర్తిని చాటే సద్దుల బతుకమ్మ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

దసరా పండుగ లోపు ప్రకాశ్ నగర్ బ్రిడ్జి దగ్గర పాత లోలెవల్ కాజ్ వే డైవర్షన్ రోడ్డు పనులు పూర్తి చేసి, రాకపోకలు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలోని 28వ డివిజన్ ప్రకాశ్ నగర్లో పర్యటించి టీ.యూ.ఎఫ్.ఐ.డి.సి. నిధులు రూ.కోటి 90 లక్షలతో చేపట్టిన స్టార్మ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులు ప్రారంభించారు.

భారత పారిశ్రామిక చరిత్రలో రతన్ టాటా ఓ శకం అని ఆయన మృతి ప్రపంచానికే తీరని లోటని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ రోజు దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందన్నారు. వారి నిష్క్రమణ పారిశ్రామిక రంగం, యావత్ దేశానికే కాకుండా ప్రపంచానికి కూడా తీరని లోటని పేర్కొన్నారు.

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. కూసుమంచి మండలం పరిధిలోని పెరిక సింగారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు ఆధ్వర్యంలో తయారుచేసిన 51 అడుగుల భారీ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రతి ఏటా ఈ గ్రామంలో బతుకమ్మ సంబరాలు అట్టహాసంగా జరుగుతాయి. గురువారం సాయంత్రం జరగబోయే బతుకమ్మ వేడుకలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరవుతారని జూకూరి గోపాలరావు తెలిపారు.

సద్దుల బతుకమ్మ పండుగను ఈరోజు ఉమ్మడి జిల్లాలోని ప్రధాన సెంటర్లు, కాలనీలు, ఆలయాల్లో మహిళలు ఘనంగా జరుపుకోనున్నారు. ఇందు కోసం మున్సిపల్ శాఖ ఏర్పాట్లు చేసింది. బతుకమ్మ ఆడే కూడళ్ల వద్ద విద్యుత్ లైట్లను అమర్చారు. ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు బుధవారం సర్దార్ పటేల్ స్టేడియంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.