Khammam

News April 19, 2024

ఖమ్మం: ఎండిపోతున్న చెరువులు..

image

వర్షాభావానికి తోడు ఎండల తీవ్రతతో జిల్లాలో పలు చెరువుల్లో నీరు అడుగంటి నెర్రెలు బారుతున్నాయి. సాగునీటి కొరతతో రైతులు ఇప్పటికే ఆశలు వదిలేసుకున్నారు. చెరువులో ఉన్న కొద్దోగొప్ప నీటితో చేపలు బతుకుతాయని ఆశిస్తున్న మత్స్యకారులకు నిరాశే ఎదురవుతోంది. చెరువులు ఎండి లక్షల్లో చేపలు మృత్యువాత పడుతుండడంతో ఉపాది లేదని వారు ఆందోళన చెందుతున్నారు.

News April 19, 2024

గ్యాస్ సబ్సిడీ డబ్బు బ్యాంకు ఖాతాలో జమ కాలేదా..?

image

రూ.500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులను పౌరసరఫరాల శాఖ ఇప్పటికే చాలా మంది అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నా.. ఖమ్మం జిల్లాలో కొంత మందికి ఇంకా గ్యాస్ డబ్బులు జమ కాలేదు. దీనికి లబ్దిదారులు LPG గ్యాస్ కనెక్షన్ కోసం e-KYC చేయకపోవడమే కారణమని తాజాగా పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. గ్యాస్ కనెక్షన్లు కలిగిన 30% మంది మాత్రమే e-KYC చేసుకున్నారని, మిగత వారు వెంటనే e-KYC చేసుకోవాలని సూచించింది.

News April 19, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఖమ్మంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం
∆} సత్తుపల్లి మండలంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం
∆} బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద రావు నామినేషన్ ర్యాలీ
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News April 19, 2024

ఖమ్మంలో ఒకటే నామినేషన్

image

లోక్‌సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఖమ్మంలో తొలి రోజు ఒకటే నామినేషన్ దాఖలైంది. అలయెన్స్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఆదార్‌) అభ్యర్థిగా కుక్కల నాగయ్య గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఇక బీఆర్ఎస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు కేసీఆర్ బీ-ఫాం అందుజేశారు.

News April 19, 2024

ఖమ్మం: ‘ఎన్నికల వ్యయ పరిశీలన పారదర్శకంగా జరగాలి’

image

ఎన్నికల వ్యయ పరిశీలన పారదర్శకంగా చేపట్టాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు అరుణ్ ప్రసాత్ కృష్ణస్వామి, శంకర నంద్ మిశ్రాలు అన్నారు. ఈ సందర్భంగా వ్యయ పరిశీలకులు, ఖమ్మం ఎన్నికల అధికారి కలెక్టర్ గౌతమ్ తో కలిసి లోకసభ ఎన్నికలను పురస్కరించుకుని కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం, మీడియా సర్టిఫికేషన్ & మీడియా మానిటరింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. కేంద్రంలో చేపడుతున్న చర్యలపై వారు ఆరా తీసారు.

News April 18, 2024

రాత్రి 11 గంటలలోపు దుకాణాలు మూసివేయాలి:సీపీ

image

ఖమ్మం కమిషనరేట్ పరిధిలో రాత్రి 10:30 నుండి 11 గంటలలోపు ఖచ్చితంగా వ్యాపార, వాణిజ్య దుకాణాలు మూసివేయాలని సీపీ సునీల్ దత్ తెలిపారు. అదేవిధంగా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, పబ్లిక్ న్యూసెన్స్, సమయానికి మించి షాపులు తెరవడం, పుట్టినరోజు పేరుతో నడిరోడ్డుపై వాహనాలు అడ్డం పెట్టి న్యూసెన్స్ చేస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగించే వారిపై కేసులు నమోదు చేయాలని ఇప్పటికే పోలీస్ అధికారులకు ఆదేశించామని తెలిపారు.

News April 18, 2024

భద్రాచలం: ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఎస్సై, కానిస్టేబుల్

image

భద్రాచలంలో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పోలీస్ అధికారులు చిక్కారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం.. భద్రాచలం టౌన్ ఎస్ఐ శ్రీనివాస్, కానిస్టేబుల్ శంకర్, నవీన్‌లు ఒకే విషయంలో 20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 18, 2024

ఖమ్మంలో తొలిరోజు ఒక నామినేషన్ దాఖలు

image

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో తొలి రోజు ఒక నామినేషన్ స్వీకరించినట్లు ఖమ్మం రిటర్నింగ్ అధికారి వీపీ గౌతమ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 17- ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఆధార్ పార్టీ తరఫున కుక్కల నాగయ్య ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారని ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఖమ్మం జిల్లా కలెక్టర్ ప్రకటించారు.

News April 18, 2024

 KCR చేతుల మీదుగా B- ఫారమ్ అందుకున్న నామా 

image

ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావుకు ఆపార్టీ అధ్యక్షుడు కేసీఆర్ B-ఫారమ్ అందించారు. హైద్రాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో నామాకు B-ఫారమ్ అందుకున్నారు. మరోసారి గెలిచి రావాలని కేసీఆర్ పార్టీ నాయకులకు సూచించారు. B-ఫారమ్‌తో పాటు రూ.95లక్షల విలువచేసే చెక్కును ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ, ఎంపీ వద్దిరాజు తదితరులున్నారు.

News April 18, 2024

మాజీ సీఎం కేసీఆర్‌ కలలు కంటున్నారు : మంత్రి

image

సీఎం కేసీఆర్‌ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలలు ఉండదని ఆరు నెలల్లో పడిపోద్దని కలలు కంటున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంపు కార్యాలయంలో మంత్రి మాట్లాడారు. మహబూబాబాద్ పార్లమెంట్‌ అభ్యర్థి బలరాం నాయక్‌ను భారీమెజార్టీతో గెలిపించాలన్నారు. రేపు మహబూబాబాద్‌లో జరిగే బలరాం నామినేషన్ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు హాజరుకావాలని తుమ్మల పిలుపునిచ్చారు.