India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీసీతారాముల కల్యాణ తలంబ్రాలు టిఎస్ ఆర్టిసి కార్గో ద్వారా ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో రూ.151 చెల్లిస్తే భక్తుల ఇండ్ల వద్దకు చేరుస్తామని ఖమ్మం జిల్లా రీజినల్ మేనేజర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ బుకింగ్స్ ఈనెల 25 వరకు పొడిగించడం జరిగిందని.. కావున భక్తులు తలంబ్రాలను బుక్ చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు
పాల్వంచ మున్సిపాలిటీ కార్యాలయంలో ఓ వ్యక్తి నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటూ గురువారం టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రమణి, అసిస్టెంట్ ప్రసన్న ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ పని నిమిత్తం ఓ వ్యక్తి నుంచి అధికారులు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కాగా బాధితుడి ఫిర్యాదు మేరకు అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అధికారులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఆడుకుంటుండగా.. ప్రమాదవశాత్తు కనుగుడ్డుకు పిన్నీసు గుచ్చుకున్న ఘటన గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నేలకొండపల్లి మండల పరిధిలోని నాచేపల్లికి చెందిన పూజిత అనే చిన్నారి ఆడుకుంటుండగా కను గుడ్డుకు పిన్నిసు గుచ్చుకుంది . గమనించిన తల్లిదండ్రులు దగ్గరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
ఖమ్మం లోక్సభకు సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని తొలి నామినేషన్ పడింది. 17-ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి ఆధార్ పార్టీ అభ్యర్థిగా కుక్కల నాగయ్య గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం పార్లమెంట్ నియోజక వర్గ ప్రజలు తమ పార్టీని బలపరిచి ఓటు వేయాలని కోరారు.
భద్రాద్రిలో గోదావరి ఎడారిని తలపిస్తోంది. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా చుక్క నీరు కూడా కనిపించడం లేదు. నిన్న జరిగిన శ్రీరామ నవమి వేడుకలలో ఉమ్మడి తెలుగు రాష్ట్రల నుంచి వేలాది మంది భక్తులు వచ్చారు. వారి కోసం మోటార్లు ద్వారా తాత్కలికంగా ఏర్పాటు చేసిన వాటి కింద భక్తులు స్థానాలు చేశారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటల ధరల వివరాలను మార్కెట్ శాఖ అధికారులు గురువారం ఉదయం వెల్లడించారు. మిర్చి క్వింటా జండా పాట రూ.20,000, పత్తి జెండా పాట క్వింటా రూ.7200 పలికినట్లు అధికారులు వెల్లడించారు. పత్తి, మిర్చికి మంచి ధర పలుకుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం సెలవు ఉండడంతో ఈరోజు పంట మార్కెట్ కు పెద్ద ఎత్తున వచ్చింది.
బయ్యారం మండలంలో బుధవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు బలంగా వీచాయి. చిన్నపాటి వర్షం పడింది. కొయ్యగూడెం గ్రామ పంచాయతీలోని చుంచు బంధంతండాలో ఉరుములకు కొబ్బరి చెట్టుపై పిడుగు పడి కాలిపోయింది. పిడుగు పడిన ప్రాంతంలో ఆ సమయాన ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గురువారం జరగనున్న రామయ్య మహా పట్టాభిషేకం
మహోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన గవర్నర్ సిపి రాధాకృష్ణన్ బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటిసి విశ్రాంతి భవనానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు పోలీస్ గౌరవ వందనం సమర్పించారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం చేరుకున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండల వల్ల తీవ్రతరం అయ్యాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరాయి. కాగా వాతావరణశాఖ ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. మధ్యాహ్నం 12 గంటలు దాటితే ప్రధాన రహదారులు, కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. అవసరం అయితేనే తప్ప బయటకు రావద్దని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
జిల్లాలో ఎండ తీవ్రత పెరుగుతోంది. బుధవారం ఏకంగా 44.2 డిగ్రీలకు చేరింది. జిల్లాలోని ముదిగొండ మండలం పమ్మిలో గరిష్టంగా 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 8గంటలకే ఎండ మొదలై పది గంటల తర్వాత బయటకు రాలేని పరిస్థితి ఉంటోంది. కాగా, ఖమ్మంలో 43.9, కూసుమంచిలో 43.7, కల్లూరులో 43.6, నేలకొండపల్లిలో 43.5, తల్లాడ, తిరుమలాయపాలెంల్లో 43.3, తిమ్మారావుపేటలో 43.2, చింతకాని 43.1, సత్తుపల్లిలో 42డిగ్రీల మేర నమోదైంది.
Sorry, no posts matched your criteria.