Khammam

News April 18, 2024

KTDM: గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడి మృతి

image

గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
కొత్తగూడెం జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని వీఆర్కేపురం ఎంపీపీ పాఠశాలలో హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్న శేషాచలం బుధవారం చాతిలో నొప్పితో ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. శేషాచలం మృతికి పలువురు సంతాపం తెలిపారు.

News April 18, 2024

అంతా సిద్ధం.. నేడు నామినేషన్ల స్వీకరణ

image

లోక్‌సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ గురువారం మొదలుకానుంది. ఖమ్మం కలెక్టరేట్లోని ఆర్ఓ కార్యాలయంలో గురువారం నుంచి ఈనెల 25వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారు. కాగా, ఈనెల 26న స్క్రూటినీ చేయనుండగా, 29 వరకు ఉపసంహరించుకునే వీలుంది. ఆపై మే 13న పోలింగ్ నిర్వహంచి జూన్ 4న ఫలితం వెల్లడిస్తారు. దీంతో నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

News April 18, 2024

ఈనెల 25న తుది ఓటర్ల జాబితా విడుదల

image

ఈనెల 16న ప్రకటించిన ఓటర్ల జాబితా ఆధారంగా ఖమ్మం లోక్ సభ నియోజకవర్గ పరిధిలో 16,26,427 మంది ఓటర్లు ఉన్నారు. అయితే, ఈనెల 25న వెలువరించే తుది జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహించనుండగా ఈ సంఖ్య పెరిగే అవకాశముంది. ప్రస్తుతం ఓటర్లలో 18 నుంచి 19 ఏళ్లలోపు ఉన్న యువత 49,393 మంది ఉండగా, వీరు ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇదే వయస్సు వారి నుంచి అందిన దరఖాస్తులు మరో 1,465 పెండింగ్ ఉన్నాయి.

News April 18, 2024

ఖమ్మం: రేషన్ కార్డుదారులకు అలర్ట్

image

ప్రభుత్వం పథకాలు అందించడంలో భాగంగా రేషన్ కార్డులకు e-KYCని తప్పనిసరి చేసింది. ఇప్పటికే FEB 29తో గడువు ముగియగా మరోసారి పొడిగించింది. మొత్తం లబ్ధిదారుల్లో ఇప్పటివరకు 74% మందే KYC నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దగ్గరలోని రేషన్ దుకాణాలకు వెళ్లి త్వరగా ఈ-కేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి గడువు తేదీ ప్రకటించనప్పటికీ.. మరోసారి గడువు పొడిగించే అవకాశం లేదని అధికారులు తెలిపారు.

News April 18, 2024

KMM: మంచి ఫలితం రాకపోతే ఆందోళన వద్దు !

image

త్వరలో టెన్త్, ఇంటర్ వార్షిక ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో విద్యార్థులకు తల్లిదండ్రులు, సమాజం అండగా నిలవాలని నిపుణులు అంటున్నారు. మార్కులు తక్కువ వచ్చాయని, ఫెయిల్ అయ్యారనే కారణంతో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా వారిని ఓ కంట కనిపెట్టాలన్నారు. వారిలో ఆత్మస్థైర్యం పెంపొందించాలని ఒకవేళ ఫెయిల్ అయితే వృత్తి నైపుణ్య కోర్సుల వైపు ప్రోత్సహిస్తూ.. సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేస్తూ భరోసా కల్పించాలన్నారు.

News April 18, 2024

ఖమ్మం: రాములోరి కళ్యాణానికి ముస్లిం పట్టు వస్త్రాల సమర్పణ

image

శ్రీ రామ నవమి సందర్భంగా ముస్లిం దంపతులు మత సామరస్యాన్ని చాటారు. సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రాపురంలో కరీముల్లా దంపతులు చేసిన పనిని పలువురు మెచ్చుకుంటున్నారు. 

News April 18, 2024

ఖమ్మం: గుర్తింపు లేదని మాజీ ఎమ్మెల్యే మనస్తాపం..!

image

వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ఇంటికి బుధవారం రాత్రి బీఆర్ఎస్ నాయకులు వెళ్లారు. పార్టీలో తనకు గుర్తింపు ఇవ్వడం లేదనే అసంతృప్తితో ఉన్నట్లు తెలియడంతో ఖమ్మంలోని ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. పార్టీలో తగిన ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ నామా, ఎమ్మెల్సీ తాతా మధు, వైరా ఏఎంసీ మోహనరావు ఉన్నారు.

News April 18, 2024

నేడు భద్రాద్రిలో రాముడి పట్టాభిషేకం

image

భద్రాద్రిలో బుధవారం సీతారాముల కళ్యాణం కమనీయంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈ పట్టాభిషేక సమయాన సకల లోకాల దేవతలు, భక్తులు నేత్రపర్వంగా తిలకించి పులకితులవుతారట. ఈ వేడుకను తిలకించేందుకు తెలంగాణ గవర్నర్‌ సీపీ. రాధాకృష్ణన్ రానున్నారు. ఇప్పటికే పట్టాభిషేకానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

News April 18, 2024

నేడు భద్రాద్రికి గవర్నర్

image

నేడు భద్రాద్రిలో మహా పట్టాభిషేకం కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ రానున్నారు. ఈ సందర్భంగా విధులు కేటాయించిన అధికారులు ఉదయం 6 గంటలకే హాజరుకావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. గవర్నర్ పర్యటనపై బుధవారం ఐటీసీ విశ్రాంతి భవనంలో రెవెన్యూ, డీఆర్డీఎ, జడ్పీ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో సమీక్షించారు. గవర్నర్ పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకొవాలని అధికారులను ఆదేశించారు.

News April 17, 2024

చర్ల: మావోయిస్టుల సమాచారం ఇస్తే రూ. 5లక్షలు బహుమతి

image

చర్ల సరిహద్దు ప్రాంతమైన ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టులకు సంబంధించిన సమాచారం ఇస్తే రూ. 5లక్షలు బహుమతిగా ఇస్తామని ఛత్తీస్‌గఢ్ పోలీస్ విభాగం ప్రకటించింది. “సూచనా దో.. ఇనామ్ పావో” అంటూ ప్రచురించిన కరపత్రాలను జిల్లా మొత్తం పంపిణీ చేస్తున్నారు. గత కొంతకాలం నుండి ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరుగుతున్న విషయం తెలిసీందే. ఈ కాల్పుల్లో చాలామంది మావోయిస్టులు మరణించారు.