India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆళ్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి శుక్రవారం పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల వివరాలిలా.. వెంకటేశ్కి వరుసకు కొడుకయ్యే ప్రవీణ్ ఇటీవల మృతిచెందాడు. ప్రవీణ్ సమాధి వద్దకు వెళ్లిన వెంకటేశ్ మనస్తాపంతో పురుగు మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. గమనించిన బంధువులు అతణ్ని కొత్తగూడెం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం అర్హులైన ఉపాధ్యాయులు నవంబర్ 6 లోపు ఫారం19 ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. గతంలో ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్న ఉపాధ్యాయులు సైతం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

ఖమ్మం జిల్లా బీఆర్ఎస్లో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ సైలెంట్ అయ్యారనే చర్చ నడుస్తొంది. జిల్లాలో జరిగే పార్టీ కార్యక్రమాలకు హాజరవడం లేదని, ఏదో అడపాదడపా HYDలో జరిగే ప్రెస్ మీట్లకు హాజరవుతున్నారని శ్రేణులు చర్చించుకుంటున్నాయి. పువ్వాడ ఎందుకు సైలెంట్ అయ్యారనే విషయం తమకు తెలియదని, తిరిగి పువ్వాడ జిల్లాలో యాక్టివ్ పాలిటిక్స్ చేసి, జోష్ పెంచాలని పలువురు నేతలు అంటున్నారు. దీనిపై మీ కామెంట్?

దసరా సందర్భంగా నేలకొండపల్లిలో యువకులు విచిత్రమైన బంపర్ ఆఫర్ ఏర్పాటు చేశారు. వంద రూపాయలు పెట్టి కూపన్ కొనుగోలు చేస్తే మొదటి బహుమతి 10కిలోల మేక, రెండు, మూడు, నాలుగు బహుమతులు మద్యం బాటిళ్లు, నాటు కోళ్లు లక్కీ డ్రా ద్వారా అందించనున్నట్లు యువకులు పేర్కొన్నారు. ఈ నెల 10న నేలకొండపల్లిలో లక్కీ డ్రా ఉంటుందని తెలిపారు. ఈ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఖమ్మం జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లాలో ఉన్న గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ళ నిర్వహణపై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రతి హాస్టల్లో విద్యార్థులతో ఫుడ్ కమిటీ ఏర్పాటు చేయాలని, ఆహార పదార్థాల డెలివరీ, స్టోరేజిలో వీరిని భాగస్వామ్యం చేయాలన్నారు.

సమాజంలో పెరిగిపోతున్న నేర ప్రవృత్తి నేపథ్యంలో ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణే ధ్యేయంగా ఏర్పాటైన డయల్-100కు పోలీస్ కమిషనరేట్ పరిధిలో 5,511 కాల్స్ వచ్చినట్లు CP సునీల్ దత్ తెలిపారు. వీటిపై 81 FIRలు నమోదు చేశామని, వీటిలో మహిళలపై వేధింపులు-2, దొంగతనాలు-9, సాధారణ ఘాతాలు-26, యాక్సిడెంట్లు-11, అనుమానాస్పద మరణాలు-10, ఇతర కేసులు-23 అన్నారు. ఫేక్ కాల్స్ చేయవద్దని, అత్యవసర సమయంలో మాత్రమే ఫోన్ చేయాలన్నారు.

డీఎస్సీ-2024 అభ్యర్థుల ద్రువపత్రాల పరిశీలన సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. స్థానిక సింగరేణి ఉన్నత పాఠశాలలో డీఎస్సీ 2024 కు 1:3 నిష్పత్తిలో ఎన్నికైన అభ్యర్థుల ద్రువపత్రాల పరిశీలన సరళిని కలెక్టర్ పరిశీలించారు. అభ్యర్థులకు ఎటువంటి సందేహాలు ఉన్న తక్షణమే నివృత్తి చేస్తూ సానుకూల వాతావరణంలో పరిశీలన పూర్తి చేయాలని అధికారులను సూచించారు.

ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న పూల పండుగ(బతుకమ్మ) సంబురాలు రానే వచ్చాయి. దీంతో గ్రామాలు సందడిగా మారాయి. తొమ్మిది రోజుల పాటు నిర్వహించుకునే బతుకమ్మ సంబరాల్లో భాగంగా తీరొక్క పూలతో బతుకమ్మలను భక్తిశ్రద్ధలతో పేర్చి రోజుకో నైవేద్యాన్ని బతుకమ్మకు సమర్పిస్తారు. బతుకమ్మ సంబరాలు దుమ్ముగూడెం మండలంలో మొదటిరోజు ఎంగిలిపువ్వు బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో అట్టహాసంగా ముగుస్తాయి.

ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు చనిపోయారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆళ్లపల్లి మండలం లక్ష్మిపురానికి చెందిన ప్రవీణ్, ప్రణయ్ కలిసి బుధవారం బైక్పై అనంతొగుకి వెళ్లారు. మర్కోడు నుంచి కొత్తగూడెం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికులు 108కు సమాచారం ఇవ్వడంతో వెంటనే కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు చనిపోయారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బుధవారం భారీ వర్షాలు కురిశాయి. సాయంత్రం మొదలైన వాన రాత్రి వరకూ కురిసింది. గాలి బీభత్సానికి కొన్ని చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నేలకొండపల్లి మండలం బైరంపల్లిలో పెద్ద గాలికి చెట్టు విరిగి గేదెపై పడింది. అనాసాగరం- పమ్మి శివారులో భారీ వృక్షం పడటంతో రాకపోకలు నిలిచిపోయాయి. వైర్లు తెగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
Sorry, no posts matched your criteria.