Khammam

News April 17, 2024

దర్గాలో శ్రీరాముని కళ్యాణం

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని సత్యనారాయణపురంలోని హజరత్ నాగుల్ మీరా దర్గాలో శ్రీరామనవమి వేడుక కన్నుల పండుగగా జరిగింది. మతాలకు అతీతంగా దర్గాలో నిర్వహించిన సీతారాముల కళ్యాణంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దర్గాలోని మాలిక్ సర్వమతాలకు అతీతంగా రాములవారి కళ్యాణం జరిపించడం పై భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.

News April 17, 2024

అత్తమామల వేధింపులు.. ఇంటి ముందు మహిళ దీక్ష

image

అత్తమామల వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ మండుటెండలో ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టింది. ఈ సంఘటన బోనకల్ మండల కేంద్రంలో జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న మహిళ తన అత్తమామలు మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని అంతేకాకుండా తలపై దిండుపెట్టి హత్యాయత్నం చేశారని ఆరోపిస్తూ నిరసన చేపట్టింది. న్యాయం జరగే వరకు ఇంటి ముందు నుంచి కదలనని ఆవేదన వ్యక్తం చేసింది.

News April 17, 2024

భద్రాచలంలో NTR ( REWIND)

image

టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్‌కు సంబంధించిన ఫొటోను ఆ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. నాడు CM హోదాలో ఎన్టీఆర్ తన సతీమణితో కలిసి భద్రాచల రామునికి ముత్యాల తలంబ్రాలు అందిస్తున్న చిత్రం అది. నేడు శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఈ ఫొటోను టీడీపీ పోస్ట్ చేసి.. తెలుగు వారందరికీ నవమి శుభాకాంక్షలు తెలిపింది.

News April 17, 2024

భక్తాద్రిగా మారిన భద్రగిరిలో ఎమ్మెల్యేల సందడి

image

భద్రాచలంలో సీతారాముల కల్యాణాన్ని
తిలకించిన భక్తజనకోటి పులకించింది. తమ ఆరాధ్య దైవమైన శ్రీరాముడు సీతమ్మ తల్లిని మనువాడిన ఘట్టాన్ని చూసిన భక్తులు తరించారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భద్రాచలానికి తరలివచ్చిన భక్తులు ఎమ్మెల్యే పాయం, ఎమ్మెల్యే తెల్ల వీక్షించి పులకించారు. భక్తుల జయ జయధ్వానాలు, వేద పండితుల మంత్రోచ్చారణలు కల్యాణతంతుతో మిథిలా స్టేడియం వైకుంఠాన్ని తలపించింది.

News April 17, 2024

రాములోరి కళ్యాణానికి పొంగులేటి బ్రదర్స్

image

భద్రాచలంలో జరుగుతున్న శ్రీ సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు ప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. సాంప్రదాయ దుస్తుల్లో పొంగులేటి బ్రదర్స్ అందరినీ ఆకర్షించారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఆలయ ఈవో రమాదేవి వారికి ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

News April 17, 2024

ఖమ్మం: ఇద్దరు ఉద్యోగుల సస్పెండ్

image

లోక్‌సభ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే కారణంతో ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ హఫ్జల్ హసన్, ప్రభుత్వ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఆర్.వీ.సాగర్ ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వ్యవహరించారని ఫిర్యాదు అందింది. దీంతో విచారణ అనంతరం వీరిద్దరిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ వీ.పీ.గౌతమ్ ఉత్తర్వులు జారీ చేశారు.

News April 17, 2024

భద్రాచలం చేరుకున్న డిప్యూటీ సీఎం

image

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో పాటు మంత్రి కొండా సురేఖ పట్టణానికి చేరుకున్నారు. ఐటిసి గెస్ట్ హౌస్ లో వారు సేద తీరుతున్నారు. కళ్యాణ తంతు ప్రారంభం అవుతున్న సమయానికి వారు మిథిలా స్టేడియానికి చేరుకుంటారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

News April 17, 2024

గుండెపోటుతో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి మృతి

image

లక్ష్మీదేవి పల్లి మండలం ప్రశాంతి నగర్ గ్రామానికి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి పూనం జగ్గయ్య(65) బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు తూము చౌదరి, BJP జిల్లా నాయకులు పోడియం బాలరాజు సందర్శించి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సెల్ కార్యదర్శి గౌస్ పాషా పాల్గొన్నారు.

News April 17, 2024

భద్రాచలం ఆలయంలో అర్జిత సేవలు రద్దు

image

సీతారాముల కళ్యాణానికి వచ్చే భక్తుల కోసం దేవస్థానంతో పాటు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. మిథిలా స్టేడియాన్ని సెక్టార్లుగా విభజించి వేరు వేరు ధరల్లో టికెట్లను ఇప్పటికే విక్రయించారు. శ్రీరామ నవమికి ఉండే రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయంలో అర్జిత సేవలు రద్దు చేశారు. బుధవారం తెల్లవారుజాము నుండి క్రమక్రమంగా భక్తుల పెరుగుతోంది. నవమి వేడుకల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా 238 బస్సులను నడిపిస్తోంది.

News April 17, 2024

సత్తుపల్లి చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సత్తుపల్లిలో ఈరోజు ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపి వివరాల ప్రకారం.. సత్తుపల్లిలోని తామర చెరువులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడాన్ని అటుగా వెళుతున్న స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.