Khammam

News October 1, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రేపు సెలవు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం అమావాస్య సందర్భంగా సెలవు ప్రకటించడం జరిగిందని చెప్పారు. తిరిగి ఈనెల 3 నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని అన్నారు. కావున ఈ విషయాన్ని రైతులు గమనించి రేపు మార్కెట్ కు పంటను తీసుకురావద్దని సూచించారు.

News October 1, 2024

డీఎస్సీ ఫలితాలలో సత్తాచాటిన ఖమ్మం జిల్లా

image

నిన్న వెల్లడైన డీఎస్సీ ఫలితాలలో ఖమ్మం జిల్లా వాసులు సత్తా చాటారు. నీల శ్రీనివాసరావు (సత్తుపల్లి) SAసోషల్‌ 1వ ర్యాంక్, రెడ్డి మాధురి (కల్లూరు చిన్నకొరుకొండి)SGT 1వర్యాంక్, వలసాల ఉమా (కల్లూరు) SGT 2వ ర్యాంక్, ఈలప్రోలు సునీత (పోద్దుటూరు)3వ ర్యాంక్ SGT(SPL), చిల్లపల్లి రాధాకృష్ణ (కందుకూరు) SGT 7వర్యాంక్, మండవ ప్రియాంక (జీళ్లచెరువు)SGT 11వ ర్యాంక్, గొకేనెపల్లి పవిత్ర SGT 14వ ర్యాంక్ సాధించారు.

News October 1, 2024

డీఎస్సీ ఫలితాలలో సత్తాచాటిన భద్రాద్రి జిల్లా

image

ప్రభుత్వం నిన్న డీఎస్సీ ఫలితాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలలో భద్రాద్రి జిల్లా వాసులు సత్తా చాటారు. దమ్మపేటకి చెందిన మిద్దే హరికిరణ్‌కి ఎస్ఎ ఫిజీకల్ సైన్స్‌లో మెుదటి ర్యాంక్, భద్రాచలం ఎంపీకాలనీకి చెందిన పావురాల వినోద్ కృష్ణ ఎస్‌ఎ సోషల్‌లో 2వ ర్యాంక్, అశ్వారావుపేట మండలం వినాయకపురంకి చెందిన రొయ్యల గణేష్‌ ఎస్జీటీలో 3వ ర్యాంక్ సాధించాడు. దీంతో వారి గ్రామస్థులు వారిని అభినందించారు.

News October 1, 2024

ఖమ్మం గ్రీవెన్స్‌కు భారీగా వినతులు

image

ఖమ్మం గ్రీవెన్స్‌లో వివిధ సమస్యలపై ప్రజలు వినతులు అందించేందుకు భారీగా తరలివచ్చారు. కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుండి ఎక్కువగా భూ సంబంధిత సమస్యలే వచ్చాయని వాటిని క్షేత్రస్థాయిలో వెళ్లి విచారించి న్యాయం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

News September 30, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

• విద్యార్థుల చదువులకు ఆటంకం కలగొద్దు: జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్
• ఆపరేషన్ చేసి గడ్డను తొలగించిన భద్రాచలం ఎమ్మెల్యే
• ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి: భద్రాద్రి జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్
• పాలడుగు జడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ సస్పెండ్
• కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న గిరిజన సంఘాలు
• భద్రాచలం వద్ద స్వల్పంగా పెరిగిన గోదావరి నీటిమట్టం

News September 30, 2024

ఖమ్మం: విద్యార్థుల చదువుకు ఆటంకం కలగొద్దు: కలెక్టర్

image

విద్యార్థులకు విద్య అభివృద్ధి, ఉద్యోగుల పదవీ విరమణ సన్మానం, కలెక్టరేట్లో మౌళిక వసతులపై అధికారులతో ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సమావేశం అయ్యారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మంచి వాతావరణం కల్పించాలని సూచించారు. విద్యార్థులకు అమలు అవుతున్న భోజనాన్ని పరిశీలించి తనకు ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని అన్నారు. రిటైర్డ్ అవుతున్నా ఉద్యోగులను ఘనంగా సత్కరించుకుందామన్నారు.

News September 30, 2024

ఆపరేషన్ చేసి గడ్డను తొలగించిన ఎమ్మెల్యే

image

భద్రాచలం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు శస్త్ర చికిత్స చేశారు. ఏపీ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం జగ్గవరంకి చెందిన కుంజ రత్తమ్మ(51) తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరారు. స్కానింగ్ చేసి గడ్డ ఉందని వైద్యులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆపరేషన్ చేసి గడ్డను తొలగించారు.

News September 30, 2024

పాలడుగు జడ్పీ హైస్కూల్ హెచ్ఎం సస్పెండ్

image

వైరా మండలం పాలడుగు జడ్పీ హైస్కూల్ హెచ్ఎం చావా శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ సోమవారం వరంగల్ ఆర్జేడీ ఉత్తర్వులు జారీ చేశారు. హెడ్ మాస్టర్ శ్రీనివాసరావు తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పాఠశాలలో బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు సస్పెన్షన్ వేటు పడింది. హెడ్మాస్టర్ శ్రీనివాసరావుపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News September 30, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,000 జెండా పాట పలకగా, క్వింటా పాత పత్తి ధర రూ.7,600 జెండా పాట పలికింది. అలాగే, క్వింటా కొత్త పత్తి ధర రూ.7,011 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజు కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర,కొత్త పత్తి ధర స్థిరంగా ఉండగా, పాత పత్తి ధర మాత్రం రూ.100 పెరిగినట్లు వ్యాపారస్థులు తెలిపారు.

News September 30, 2024

క్వింటా పత్తికి రూ.500 మద్దతు ధర పెంపు: మంత్రి తుమ్మల

image

రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ల సీజన్ ప్రారంభానికి ముందే కేంద్రాలు, జిన్నింగ్ మిల్లులు సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. HYDలో RR, KMM,VKB, MDCL సహా ఇతర జిల్లాలకు చెందిన అధికారులతో CCI సమావేశంలో పలు సూచనలు చేశారు. వారానికి 6 రోజులు కేంద్రాలు పని చేయనున్నాయని పేర్కొన్నారు. ఈసారి మద్దతు ధర రూ.500 పెరిగినందున కొనుగోలు కేంద్రాలకు ఎక్కువ పత్తి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.