Khammam

News April 17, 2024

భద్రాచలం సీతమ్మకే మూడు సూత్రాల తాళి

image

భద్రాచలం సీతమ్మ తల్లికి ప్రత్యేకమైన మూడు సూత్రాల తాళితో కళ్యాణం నవమి నాడు నిర్వహించనున్నారు. పుట్టింటి సూత్రం, మెట్టినింటి సూత్రంతో పాటు రాముని పరమ భక్తుడు భక్తరామదాసు భక్తుల తరఫున ఏర్పాటు చేసిన మూడో సూత్రం కలిపి దేవాలయ అర్చకులు శ్రీరామ నవమి నాడు రాములోరి కళ్యాణం నిర్వహిస్తారు. భద్రాచలంలో ఆలయానికి మాత్రమే ఈ తంతు ప్రత్యేకం.

News April 17, 2024

18 నుంచి నామినేషన్ల స్వీకరణ

image

లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 18న రానుందని ఖమ్మం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. నామినేషన్ల స్వీకరణ ఈ నెల 18 నుంచి 25 వరకు ఉదయం 11 గంటల నుంచి మ.3 గంటల వరకు చేపడతామని చెప్పారు. కలెక్టరేట్‌కు దరఖాస్తుల సమర్పణకు వచ్చే ప్రజలు దీనిని గమనించాలని, పై తేదీల్లో సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రమే కలెక్టరేట్‌కు దరఖాస్తుదారులు రావాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

News April 16, 2024

భద్రాద్రి రామయ్య ఎదురుకోలు ఉత్సవం

image

భద్రాద్రి రామయ్య ఎదురుకోలు ఉత్సవం ఈరోజు సాయంత్రం భద్రాచలం లో కన్నుల పండుగగా అట్టహాసంగా జరిగింది. కల్యాణానికి కొద్ది ఘడియలు ముందు అత్యంత ఘనంగా ఎదుర్కోలు వేడుక ఉంటుంది. సీతారాములవారి గుణాలను వివరించే తీరు మంత్రముగ్ధులను చేస్తుంది. సీతమ్మవారి వైపు ఒకరు, రామయ్య తండ్రి వైపు ఇంకొకరు ఉండి ఇరు వంశాల గొప్పలు సుభాషించే తీరు ఆద్యంతం సంతోషాలను పంచుతుంది. ఈ ఉత్సవం తర్వాత స్వామివారి తిరువీధి సేవ చేసారు.

News April 16, 2024

ఎన్నికల విధుల పట్ల అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్

image

ఎన్నికల విధుల పట్ల పూర్తి అవగాహన కలిగివుండాలని ఖమ్మం ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారులకు ఏర్పాటుచేసిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ అవగాహన కల్పించారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

News April 16, 2024

రాములోరి కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పణ

image

భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణానికి సగర వంశస్తులైన మంగళవారం పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, వడి బియ్యం స్వామివారికి అందజేశారు. భాగ్యనగరం నుంచి భద్రాచలం వరకు పాదయాత్రతో తరలివచ్చిన ఆలయంలో సమర్పించారు. ఈ సందర్భంగా సగర సంగం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ మాట్లాడుతూ.. ప్రతి ఏడాది స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తామని చెప్పారు.

News April 16, 2024

శ్రీరామనవమి విధులపై సూచనలు చేసిన ఎస్పీ

image

శ్రీరామనవమి నిర్వహణపై మంగళవారం ఎస్పీ రోహిత్ రాజు పోలీసులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. తమకు కేటాయించిన విధులను గురించి వివరించారు. పోలీసు అధికారులు సిబ్బంది తమకు కేటాయించిన ప్రదేశాల్లో బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. విధుల పట్ల ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని చెప్పారు. ఎవరికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సమన్వయంతో డ్యూటీ చేయాలన్నారు.

News April 16, 2024

ఖమ్మం: హెడ్ కానిస్టేబుల్ కుమార్తెకు సివిల్స్ ర్యాంక్

image

బోనకల్ మండల పరిధిలోని గోవిందాపురం (ఎల్) గ్రామానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ రావూరి ప్రకాషరావు కుమార్తె రావూరి సాయి అలేఖ్య ఈరోజు ప్రకటించిన సివిల్స్ ఫలితాలలో ఆల్ ఇండియా 938వ ర్యాంకు సాధించారు. సాయి అలేఖ్యకు మధిర టౌన్ ఎస్ఐ సంధ్య, పోలీస్ స్టేషన్ సిబ్బంది, గ్రామస్థులు శుభాకాంక్షలు తెలిపారు.

News April 16, 2024

భద్రాచలం సీతమ్మకే మూడు సూత్రాల తాళి

image

భద్రాచలం సీతమ్మ తల్లికి
ప్రత్యేకమైన మూడు సూత్రాల తాళితో కళ్యాణం నవమి నాడు నిర్వహించనున్నారు. పుట్టింటి సూత్రం, మెట్టినింటి సూత్రంతో పాటు రాముని పరమ భక్తుడు భక్తరామదాసు భక్తుల తరఫున ఏర్పాటు చేసిన మూడో సూత్రం కలిపి దేవాలయ అర్చకులు శ్రీరామ నవమి నాడు రాములోరి కళ్యాణం నిర్వహిస్తారు. భద్రాచలంలో ఆలయానికి మాత్రమే ఈ తంతు ప్రత్యేకం.

News April 16, 2024

రైతులకు ఆయిల్ పామ్ మొక్కలు పంపిణీ చేయాలి: మంత్రి తుమ్మల

image

రైతులకు పెద్దమొత్తంలో ఆయిల్ పామ్ మొక్కలను పంపిణీ చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. ఆయిల్ పామ్, కొబ్బరి, కోకో, మామిడి పంటల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై అధికారులతో మంత్రి చర్చించారు. ఆయిల్ పామ్ కంపెనీల ప్లాంటేషన్ వేగవంతం చేయాలని సూచించారు. ఫుడ్ పార్కులలో మౌళిక సదుపాయాలు కల్పించాలన్నారు. వేసవి సందర్భంగా మార్కెట్ యార్డుల్లో రైతులకు కావాల్సిన వసతులు ఏర్పాటు చేయాలని తెలిపారు.

News April 16, 2024

రామయ్య కళ్యాణంలో ఎర్రటి తలంబ్రాలు.. కారణమిదే..

image

భద్రాచల రామయ్య కళ్యాణానికి వాస్తవంగా శ్వేత అక్షింతలు వాడాలి. కాని శుభ సూచకంగా కొద్దిగా పసుపు కలుపుతారు. కాగా తానీషా ప్రభుత్వం తరపున రామయ్య కళ్యాణానికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలతో పాటు గులాం పొడి తీసుకుని వచ్చేవారు. తానీషా ప్రభువు తీసుకుని వచ్చిన గులాం పొడి కూడా తలంబ్రాలతో కలపడం వల్ల భద్రాద్రిలో తలంబ్రాలు ఎర్రగా ఉంటాయి. ఈ తలంబ్రాలను పంచ ద్రవ్యాలతో కలిపి తయారు చేస్తారు.