India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సాగునీరు అందిస్తామని, రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. కూసుమంచి మండలం పాలేరు జలాశయం నుంచి ఎడమ కాల్వ నీటి విడుదల ప్రక్రియను గురువారం పరిశీలించారు. ఎడమ కాల్వ కట్ట వైపు ఊట నీటిని 100 హెచ్.పీ. సామర్థ్యం గల 11 మోటార్ల ద్వారా సుమారు 200 క్యూసెక్కుల నీటిని కాలువలోకి ఎత్తి పోసే ప్రక్రియను ఈసందర్భంగా కలెక్టర్ పరిశీలించారు.

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

విద్యుత్ మీటర్ కనెక్షన్ లేని వారికి రూ.938తో నూతన విద్యుత్ మీటర్ కనెక్షన్ ఇస్తునట్టు చెప్పారు. గ్రామపంచాయతీ ధ్రువీకరణ పత్రం, ఇంటి పన్ను, ఆధార్ కార్డు, రేషన్ కార్డు పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. కూసుమంచి ADE – 9440811530, కూసుమంచి AE – 9440811544, పాలేరు AE- 7901678189, రాజేశ్వరపురం AE – 9491058653, నేలకొండపల్లి AE – 9440811511, బచ్చోడు AE – 9440814150కు ఫోన్ చేయాలన్నారు.

అమెరికా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన స్టైల్ మార్చారు. ఎప్పుడూ తెల్లటి షర్టు, పంచా ధరించి తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించే భట్టి.. అమెరికా పర్యటనలో సూట్ ధరించి భిన్నంగా కనిపిస్తున్నారు. కొన్ని సందర్భాలలో ఆయన జీన్స్ ప్యాంట్, కలర్స్ షర్ట్స్ ధరిస్తున్నారు. విదేశీ పర్యటనలో తమ అభిమాన నేత స్టైలిష్ దుస్తుల్లో కనిపించడంతో వారు ఖుషీ అవుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీలకు స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ క్రింద రూ.162.13 కోట్ల నిధులు విడుదల చేసింది. అందులో ఖమ్మం జిల్లాకు రూ.8,50,45,281, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రూ.5,92,24,851 కేటాయించారు. ఈ మొత్తాన్ని మల్టి పర్పస్ వర్కర్స్ (MPW) పెండింగ్ జీతాలు, కరెంట్ చార్జీలు, గ్రామపంచాయతీ ట్రాక్టర్ మంత్లీ ఇన్స్టల్మెంట్, స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమానికి వినియోగించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.

భద్రాచలం రోడ్ రైల్వేస్టేషన్ నుంచి నడిచే రెండు రైళ్లli గురువారం నుంచి రద్దు చేస్తున్నట్టు చీఫ్ కమర్షియల్ అధికారి జేమ్స్పల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. తెల్లవారుజామున నడిచే సింగరేణి ఎక్స్ప్రెస్ అక్టోబర్ 8 వరకు, కాకతీయ ఎక్స్ప్రెస్ అక్టోబర్ 7 వరకు రద్దుచేశామని వెల్లడించారు. వరంగల్లో జరుగుతున్న మరమ్మతుల పనుల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.

✓ వివిధ శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
✓ నేడు అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన
✓ పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
✓ అశ్వాపురంలో కొనసాగుతున్న మిషన్ భగీరథ కార్మికుల సమ్మె
✓ నేడు సత్తుపల్లి లో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
✓ నేడు ఇల్లెందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన
✓మధిర పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

భద్రాద్రి జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 50 ఖాళీల ఉద్యోగాల భర్తీకి గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్ తెలిపారు. పదో తరగతి చదివి, 18 నుంచి 45 ఏళ్ల వయసు గల వారు అర్హులని చెప్పారు. ఈరోజు ఉదయం 10 గంటలకు హాజరు కావాలని కోరారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. దసరా నాటికి రాష్ట్రంలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్నిస్థాయిల్లో కమిటీల ఏర్పాటుకు ఒకట్రెండు రోజుల్లో విధివిధానాలు రూపొందించాలని సూచించారు.

భద్రాద్రి జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాలను నివారించి విలువైన ప్రాణాలు కాపాడేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం రోడ్డు భద్రతపై జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తో కలిసి జిల్లాస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఏ ఒక్కరూ వైకల్యం బారిన పడకుండా రోడ్డు భద్రత చర్యలు చేపట్టాలన్నారు.
Sorry, no posts matched your criteria.