India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొత్తగూడెం జిల్లా గుండాల మండలం నాగారం గ్రామంలోని మండల పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో MEO కృష్ణయ్య షోకాజ్ నోటీసులు జారీ చేశారు. శనివారం ఆయన పాఠశాలను తనిఖీ చేయగా ఉపాధ్యాయుడు గైర్హాజరు కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుడు వారానికి ఒకటి రెండు రోజులు మాత్రమే పాఠశాలకు వస్తున్నాడని విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
> సత్తుపల్లికి ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి రాక
> ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు
> కల్లూరు, వైరాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన
> ఎర్రుపాలెంలో కరెంటు కోత
> వైరా: గన్నవరంలో తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం
> పినపాకలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన
> భద్రాచలంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
> ఖమ్మంలో ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రచారం
విజయవాడ- భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం), భద్రాచలం రోడ్డు- విజయవాడ మధ్య ప్యాసింజర్ రైలును దక్షిణ మధ్య రైల్వే అధికారులు శనివారం పునఃప్రారంభించారు. ఈ రైళ్లను 21 వరకు నడిపిస్తామని ప్రకటించారు. విజయవాడలో మొదలుకానున్న ప్యాసింజర్ రైలు ఖమ్మం, డోర్నకల్, కారేపల్లి మీదుగా కొత్తగూడెం(భద్రాచలం రోడ్డు) వరకు నడుస్తుంది. తిరిగి కొత్తగూడెంలో మొదలై ఇదే మార్గం ద్వారా విజయవాడ చేరుకుంటుంది.
ఈనెల 17న జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం, పట్టాభిషేకం తిలకించడానికి వచ్చే ఉభయ దాతలు వివిఐపి, వీఐపీ, సామాన్య భక్తులకు టికెట్ల వివరాలు అలాగే వసతి కోసం గదులను కూడా ఆన్లైన్లో ఉంచామని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా అన్నారు. ఉభయ దాతల టికెట్లు రూ. 7500, వివిఐపి టికెట్లు రూ. 2500, విఐపి టికెట్లు రూ. 2000, సామాన్య భక్తులకు రూ. 1000, రూ. 300, రూ. 150 రేట్ల ప్రకారం అందుబాటులో ఉంచామన్నారు.
తనను ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిగా చేసిన పాలేరు ప్రజల కోసం అనునిత్యం అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నిస్తానని మంత్రి పొంగులేటి అన్నారు. నాలుగు మండలాలకు ఇద్దరు వ్యక్తి గత సిబ్బందిని నియమించుకుని వారి కోసం ఓ ఫోన్ నెంబర్ ను ఏర్పాటు చేస్తానని ఏ సమస్య ఉన్నా ఫోన్ చేయొచ్చన్నారు. ఈ సందర్భంగా కూసుమంచి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నాయకులతో పొంగులేటి మాట్లాడారు.
చంద్రాయపాలెం ఘటనతో అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఆక్రమణలు తొలగించేందుకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఆయుధాలు, ప్రత్యేక సిబ్బంది ఉన్న పోలీసులపైనే దాడి జరగటంతో ఆయుధాలు లేని తమపై దాడిని తిప్పికొట్టలేమంటూ అటవీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఆగస్టులో అటవీశాఖ సిబ్బందిపై దాడి జరిగింది. అప్పటి నుంచి పోలీసుల సహకారం లేకుండా అటవీశాఖాధికారులు పోడు వివాదం జోలికి వెళ్లాలంటే జంకుతున్నారు.
ఇల్లెందు మాజీ MLA గుమ్మడి నర్సయ్య చిత్రపటాన్ని తన రక్తంలో గీయించి ఫ్రేమ్ కట్టిచాడు ఓ వీరాభిమాని. సెలబ్రేటీలకే వీభిమానులు ఉన్న ఈ రోజుల్లో 5సార్లు MLAగా చేసి నేటికీ సాధారణ జీవితం గడుపుతున్న గుమ్మడికి తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలుకు చెందిన వెంకటేశ్ వీరాభిమానిగా మారాడు. ఆ అభిమానంతోనే అలాంటి నేత కోసం తన రక్తంతో చిత్రపటం గీయించి ఆయన ఆదర్శాలను అందరికీ చాటిచెప్పాలని భావించినట్లు వెంకటేశ్ చెప్పారు.
ఖమ్మం జిల్లా చింతకాని మండలం బస్వాపురం గ్రామంలో భార్యపై భర్త గొడ్డలి, వేట కొడవలితో శుక్రవారం అర్ధరాత్రి దాడికి పాల్పడ్డాడు. ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చింతూరు : మావోయిస్టు బంద్ నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా మూడు రోజులపాటు చట్టి – భద్రాచలం, చట్టి – కుంట మార్గంలో రాత్రిపూట వాహన రాకపోకలను నిలిపివేస్తున్నట్లు స్థానిక ఎస్సై శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 13 నుంచి 15 వరకు మావోయిస్టులు బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ రెండు మార్గాల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
ఈనెల 17న జరగనున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను శనివారం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా సంబంధిత శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీరామనవమి ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. కళ్యాణ మహోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రాద్రిలో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎండల దృష్ట్యా భక్తులకు సకలసౌకర్యాలు కల్పించాలన్నారు.
Sorry, no posts matched your criteria.