Khammam

News September 24, 2024

మూడు రోజుల్లో పంట నష్టపరిహారం: మంత్రి పొంగులేటి

image

రైతులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులకు మూడు రోజుల్లో నష్ట పరిహారం చెల్లిస్తామన్నారు. BRS హయాంలో నెలలు గడిచినా పంట నష్ట పరిహారం ఇవ్వలేదని.. రుణమాఫీ చేయకుండా మోసం చేశారని విమర్శించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరుతో BRS నేతల్లా తాము దోచుకోలేదని అన్నారు.

News September 24, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

☆ నేడు వెంకటాపురం మండలంలో విద్యుత్ సరఫరా
☆ ఖమ్మం జిల్లాలో నేడు మంత్రి పొంగులేటి పర్యటన
☆ అశ్వారావుపేట నియోజకవర్గంలో నేడు ఎమ్మెల్యే జారే పర్యటన
☆ ఉమ్మడి జిల్లాలో నేడు మోస్తారు వర్షాలు
☆ భద్రాద్రి రామాలయంలో నేడు ప్రత్యేక పూజలు
☆ అన్నపురెడ్డిపల్లిలో నేడు జోనల్ స్థాయి క్రీడా పోటీలు
☆ ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న బిజెపి, కాంగ్రెస్ సభ్యత్వ నమోదు
☆ ఖమ్మం జిల్లాలో నేడు జిల్లా కలెక్టర్ పర్యటన

News September 24, 2024

రేషన్ కార్డు లేకపోయినా రుణమాఫీ జరుగుతుంది: మంత్రి తుమ్మల

image

తెల్లరేషన్ కార్డులు లేని వారికి కూడా త్వరలో రుణమాఫీ వర్తింపజేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక ప్రకటన చేశారు. ప్రీమియం ప్రభుత్వమే కడుతుందని తెలిపారు. పంటలకు బీమా కుడా అమలు చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం రైతు బంధు ఎగ్గొట్టిందని మంత్రి విమర్శించారు. గత ఐదేళ్లు రుణమాఫీ గురించి మాట్లాడలేదని గుర్తు చేశారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా రూ.31 వేల కోట్ల రుణమాఫీ కాలేదని మంత్రి అన్నారు.

News September 24, 2024

తాగునీటి ఇబ్బందులు రానివ్వొద్దు: మంత్రి తుమ్మల

image

ఖమ్మం నగరంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్యలను ఆదేశించారు. సోమవారం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో నీటి ఎద్దడి సమస్య పరిష్కారం, తదితర సమస్యలపై పలు సూచనలు చేశారు. ఇటీవల వచ్చిన వరదల వల్ల మోటర్లు కాలిపోవడంతో త్రాగునీటి సమస్య అధికారులు మంత్రికి వివరించారు.

News September 23, 2024

స్వల్పంగా పెరిగిన గోదావరి నీటిమట్టం

image

గత కొద్ది రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఆదివారం రాత్రి 10 గంటలకు 16.2 అడుగుల వద్ద నిలకడగా ప్రవహించింది. సోమవారం ఉదయం స్వల్పంగా పెరిగిందని సీడబ్ల్యూసీ అధికారులు ప్రకటించారు. ఉదయం 6 గంటలకు 16.8 అడుగులు కాగా 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటలకు 16.9 అడుగుల వద్ద నిలకడగా ప్రవహిస్తోందని తెలిపారు.

News September 23, 2024

KMM: తిరుమల లడ్డూ ప్రసాదంలో పొగాకు ప్యాకెట్

image

తిరుమల లడ్డూ కల్తీపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మరోసారి అపవిత్రమైందంటూ ఖమ్మంలో జరిగిన ఘటన హాట్ టాపిక్‌గా మారింది. గొల్లగూడెం శివారులో కార్తికేయ టౌన్ షిప్‌కు చెందిన దొంతు పద్మావతి 19న తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి వచ్చింది. ప్రసాదాన్ని వారి బంధువులకు, ఇరుగు పోరుగు వాళ్లకు పంచేందుకు చూడగా పొగాకు వంటి పదార్థం కనిపించిందని ఆరోపించారు. ఆ దృశ్యాలు ఇప్పుడు స్థానిక మధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

News September 23, 2024

కిన్నెరసానిలో పర్యాటకుల సందడి

image

పాల్వంచలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానికి ఆదివారం పర్యాటకులు భారీగా తరలివచ్చారు. కిన్నెరసాని జలాశయాన్ని, డీర్ పార్క్‌లోని దుప్పులను పర్యాటకులు వీక్షించారు. 420 మంది పర్యాటకులు కిన్నెరసానికి వెళ్లగా.. వాహనాల ప్రవేశ రుసుం ద్వారా వైల్డ్ లైఫ్ శాఖకు రూ.12,350 ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు. 190 మంది బోటు షికారు, టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.9,200 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.

News September 23, 2024

ప్రజావాణి కార్యక్రమం రద్దు

image

ఇవాళ జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రకటించారు. జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉండరని చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గ్రహించి ప్రజావాణిలో ఫిర్యాదు సమర్పించడానికి కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు.

News September 23, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు CRIME NEWS

image

∆} కొత్తగూడెం: గుండెపోటుతో అటవీ శాఖ అధికారి మృతి
∆} పాల్వంచ: అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు పట్టివేత
∆}అశ్వారావుపేట: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు
∆} నాచేపల్లి సొసైటీ కార్యదర్శి కోటయ్య మృతి
∆} మణుగూరు గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి
∆} గార్ల: విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి
∆} అశ్వాపురం: మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో వాహనాల తనిఖీలు

News September 22, 2024

కొత్తగూడెం: గుండెపోటుతో అటవీ శాఖ అధికారి మృతి

image

కొత్తగూడెం డివిజన్ చాతకొండ అటవీ డిప్యూటీ రేంజ్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న చందావత్ సురేశ్ ఆదివారం గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. మంచి కంటి నగర్లో నివాసం ఉంటున్న ఆయనకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. డీఆర్ఓ సురేష్ మృతితో అటవీ శాఖ అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా సురేశ్ కారేపల్లి మండల వాసిగా కుటుంబ సభ్యులు తెలిపారు.