Khammam

News April 12, 2024

KMM: విధులు నిర్వర్తించే చోటే ఓటు

image

ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని వివిధ శాఖల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు ఇతర పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్నికల విధులు కేటాయించే అవకాశముంది. దీంతో వీరికి మాత్రం గతంలో మాదిరిగానే పోస్టల్ బ్యాలెట్లు ఇస్తారు. ఇతర జిల్లాల నుంచి ఇక్కడకు ఎవరైనా వస్తే వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. వీరు సంబంధిత ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటుచేసే బ్యాలెట్ బాక్స్‌లో ఓటు వేయాలి.

News April 12, 2024

KMM: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. మండలం నాచేపల్లి గ్రామానికి చెందిన సట్టు నాగరాజు(29) గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 12, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} పలు శాఖలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} పెనుబల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం
∆} దుమ్ముగూడెం మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} తల్లాడ మండలంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు

News April 12, 2024

ఖమ్మం: భర్త హత్య కేసులో భార్య అరెస్ట్‌

image

ఖమ్మంలోని చెరువుకట్ట బజార్‌కు చెందిన రాములు మంగళవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, విచారణలో ఆయనది హత్యేనని పోలీసులు తేల్చారు. రాములును ఆయన భార్య సత్యవతి కత్తిపీటతో ముఖంపై నరికి హత్య చేసినట్లు ఖమ్మం టూటౌన్‌ సీఐ బాలకృష్ణ తెలిపారు. దీంతో ఆమెను గురువారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

News April 12, 2024

శ్రీరామనవమికి గదులు ఆన్‌లైన్‌ బుకింగ్ : కలెక్టర్

image

భద్రాచలంలో ఈనెల 17, 18 తేదీలలో జరిగే శ్రీరామనవమి, మహా పట్టాభిషేక మహోత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఆన్‌లైన్‌లో గదులు బుక్ చేసుకునే సౌకర్యం కల్పించబడిందని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా ఒక ప్రకటన విడుదల చేశారు. https://book.bhadrachalamonline.com/book-hotel ఈ లింకు ద్వారా శ్రీరామ నవమి మహా పట్టాభిషేకానికి వచ్చే భక్తులు గదులు బుకింగ్ చేసుకోవాలని తెలిపారు. 

News April 11, 2024

భర్త ఆత్మహత్య మనోవేదనతో కుమారుడితో కలిసి భార్య బలవన్మరణం

image

కామేపల్లి మండలం గోవిందరాల గ్రామంలో ఆర్థిక సమస్యలు ఓ కుటుంబాన్ని చిదిమేశాయి. వ్యవసాయం చేస్తే లాభాలొస్తాయని అప్పులు తెచ్చిమరి సాగు చేస్తే చివరకు అప్పులే మిగిలాయి. ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక 2నెలల క్రితం ఇంటి యజమాని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తాళికట్టి అండగా నిలిచిన భర్త దూరం కావడంతో మనోవేదనకు గురైన అతడి భార్య తన కుమారుడితో కలిసి ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

News April 11, 2024

ఈతకు వెళ్లి యువకుడు మృతి

image

ఈతకు వెళ్లిన యువకుడు మృతి చెందిన ఘటన ఇల్లందు మండలం మామిడగుండాలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా రేషన్‌ డీలర్‌గా పని చేస్తున్న ఎర్రిపోతుల బిక్షపతి స్నేహితులతో ఈతకి వెళ్లి మునిగిపోయాడు. బావిలో నీటిని మోటార్ల సహాయంతో తోడి ఆతనిని బయటకు తీసుకువచ్చారు. కొంత సేపటికి అతను మృతి చెందాడు.

News April 11, 2024

KMM : మిగిలింది నాలుగు రోజులే

image

ఉమ్మడి జిల్లాలో లోక్ సభ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ స్థానాలకు లోక్ సభ ఎన్నికలు మే 13న జరగనున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో నూతన ఓటు నమోదు, జాబితాలో మార్పులకు ఎన్నికల సంఘం ఈ నెల 15 వరకు గడువు విధించింది. ఓటరుగా నమోదు చేసుకోవడానికి మరో 4రోజుల సమయం ఉంది. ఈ నెల 25న ఓటరు తుది జాబితా విడుదల కానుంది.

News April 11, 2024

కరకగూడెం: రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఇద్దరికి గాయాలు

image

కరకగూడెం మండలం బంగారు గూడెం గ్రామంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలు గ్రామంలోని ప్రధాన రహదారిపై ఎదురెదురుగా ఢీకొనడంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉంది. క్షతగాత్రులు తోగ్గూడెం గ్రామానికి చెందిన వారిగా స్థానికులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 11, 2024

భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఏడాది బాలుడు మృతి

image

భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఓ పసిబిడ్డ మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందిన సోమిడి – శుక్లాన్ దంపతుల ఏడాది కుమారుడికి జ్వరం, దగ్గు, ఆయాసం రావడంతో భద్రాచలం ఆస్పత్రికి తీసుకువచ్చారు. తీవ్ర అస్వస్థతకు గురై బాలుడు మృతి చెందాడు. బాలుడు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ మృతి చెందాడని ఆర్ఎంవో రాజశేఖర్ తెలిపారు.