Khammam

News April 11, 2024

ఖమ్మం: అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

image

అనుమానంతో కట్టుకున్న భార్యని హతమార్చిన ఘటన కూసుమంచి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. నర్సింహలగూడెం గ్రామానికి చెందిన మల్లమ్మ, మల్లయ్య దంపతులు వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా వీరి మధ్యగొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెట్టుకున్న మల్లయ్య భార్యను పొడిచి హత్య చేశాడు అని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 11, 2024

తిరుమలాయపాలెం: భార్యను హతమార్చిన భర్త

image

భార్యకు ఉరివేసి హత్య చేసిన సంఘటన తిరుమలయపాలెం మండలంలో బుధవారం జరిగింది. సుబ్లేడ్‌కు చెందిన పోలెపొంగు ఇస్తారి, ఆయన భార్య సరోజన (63) కుమారుడు సుమంత్‌తో కలిసి జీవిస్తున్నారు. సుమంత్ మంగళవారం ఉగాది పండుగకు భార్యతో కలిసి అత్తగారింటికి వెళ్లారు. అయితే మద్యం మత్తులో ఉన్న ఇస్తారి భార్యతో గొడవ పడి మెడకు ఉరివేశాడు. కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 11, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> జిల్లావ్యాప్తంగా రంజాన్ వేడుకలు
> సత్తుపల్లిలో ఎమ్మెల్యే మట్టా రాగమయి పర్యటన
> కారేపల్లిలో కోట మైసమ్మ తల్లి జాతర
> ఖమ్మంలో ఎంపీలు నామా నాగేశ్వర రావు, వద్దిరాజు రవిచంద్ర పర్యటన
> మధిరలో సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం
> ఎర్రుపాలెం మండలం అయ్యవారిపల్లి లో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు
> భద్రాచలం రామాలయంలో బ్రహ్మోత్సవాలు
> ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు
> జ్యోతిరావు పూలే జయంతి

News April 11, 2024

నాకు MP టికెట్ రాకుండా భట్టి అడ్డుకుంటున్నారు: వీహెచ్

image

కాంగ్రెస్ పార్టీలో మరోసారి గ్రూపు గొడవలు బయటపడ్డాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీహెచ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ తనకు రాకుండా భట్టి విక్రమార్క అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఆయన సతీమణికి ఎంపీ టికెట్ కోసం భట్టి ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

News April 11, 2024

ఖమ్మం: వడ దెబ్బతో జాగ్రత్త: కలెక్టర్ గౌతమ్

image

వడ దెబ్బ ప్రమాదకరమని జాగ్రత్తలతోనే నివారణ సాధ్యమని ఖమ్మం కలెక్టర్ గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో “వడదెబ్బ నుంచి రక్షించుకుందాం” అనే ప్రచార పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. వేసవి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ పేర్కొన్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎండ వేడి నుంచి రక్షణ పొందాలన్నారు. కనీస జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News April 10, 2024

తాగునీటి ఇబ్బందులు ఉండొద్దు: సీఎస్

image

త్రాగునీటి సరఫరాలో వచ్చే ఇబ్బందులను సత్వరమే పరిష్కరించాలని, ప్రజలకు ఎక్కడా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సంద్భంగా హైద్రాబాద్ నుండి రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి అధికారులతో కలిసి ఆమె వేసవిలో త్రాగునీటి సరఫరాపై ఖమ్మం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. నీటి సమస్యలపై సీఎస్ తెలుసుకున్నారు.

News April 10, 2024

రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేసిన రేణుకా చౌదరి

image

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి రాజ్యసభ సభ్యురాలిగా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ కార్యాలయంలో ఆమె ప్రమాణం చేశారు. రేణుకా చౌదరి వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అధికారిక ప్రక్రియ పూర్తవ్వడంతో ఎంపీగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. కాగా మూడోసారి రాజ్యసభ ఎంపీగా ఆమె పనిచేస్తున్నారు.

News April 10, 2024

బీఆర్‌ఎస్ నేతలకు భద్రాచలం ఎమ్మెల్యే హెచ్చరిక

image

బీఆర్‌ఎస్ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడితే భద్రాచలంలో అడుగుపెట్టనివ్వమని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హెచ్చరించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.. రాజకీయ అనుభవం లేని MLC తాతా మధుకు తనను విమర్శించే స్థాయిలేదన్నారు. భద్రాచలం అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరానని స్పష్టం చేశారు. ఇటీవల వెంకట్రావు BRS నుంచి కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. పార్టీ మారిన వెంకట్రావుపై BRSనేతలు ఫైర్ అవుతున్నారు.

News April 10, 2024

ఫారెస్ట్ బీట్ అధికారి‌పై దాడి..

image

ములకలపల్లి మండల పరిధిలోని గుండాలపాడు పంచాయతీ చలమన్న నగర్‌లో ఫారెస్ట్ బీట్ అధికారిపై దాడి జరిగిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పోడుభూములకు ఆనుకొని ఉన్న ఫారెస్ట్ భూములను చదును చేస్తున్నారని సమాచారం మేరకు బీట్ అధికారి వెంకన్న అక్కడికి చేరుకున్నారు. అక్కడే ఉన్న 15 మంది అతనిపై ముకుమ్మడి దాడి చేసినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అధికారికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.

News April 10, 2024

తల్లంపాడు, పొన్నెకల్లులో భారీగా దోపిడీ..?

image

తల్లంపాడు, పొన్నెకల్లు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాల్లో నాణ్యత సాకు చూపి దోపిడీకి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్వింటాకు 5-10 కిలోల తరుగు తీసినట్లు రైతులు చెబుతున్నారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ కోసం రూ.1,000-2,000 చొప్పున దండుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మార్కెటింగ్‌ శాఖ, సీసీఐ అధికారులు ఈ అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం.