Khammam

News September 19, 2024

KU: 26 వరకు డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు

image

KU పరిధిలో డిగ్రీ మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు. ఫీజు చెల్లించడానికి ఈ నెల 26 వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆలస్య రుసుముతో అక్టోబర్ 4 వరకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి సకాలంలో ఫీజు చెల్లించాలన్నారు.

News September 19, 2024

బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన జిల్లా కలెక్టర్

image

బూర్గంపహాడ్‌లోని ఆసుపత్రిని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వార్డులు పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులను వివరాలు, సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించారు. ఆసుపత్రి సిబ్బందికి తగు సూచనలు చేశారు. నూతనంగా నిర్మించిన టాయిలెట్లు డిజైన్ పరిశీలించారు. ఆయన వెంట తహశీల్దార్ ముజాహిద్, ఆస్పత్రి సూపర్డెంట్ ముక్తేశ్వరరావు ఉన్నారు.

News September 18, 2024

కొత్తగూడెం: ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన అధికారి

image

కొత్తగూడెం కలెక్టరేట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.1 లక్షా 14 వేలు లంచం తీసుకుంటున్న హార్టికల్చర్ అధికారి సూర్యనారాయణను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డ్రిప్ ఇరిగేషన్‌కు సంబంధించిన సబ్సిడీ పొందెందుకు సర్టిఫై కోసం లంచం తీసుకుండగా ఏసీబీ దాడులు నిర్వహించింది. సూర్యనారాయణను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ వెల్లడించారు.

News September 18, 2024

19.8 అడుగుల వద్ద నిలకడగా ప్రవహిస్తున్న గోదావరి

image

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 19.8 అడుగుల వద్ద నిలకడగా ప్రవహిస్తోందని సీడబ్ల్యుసీ అధికారులు ప్రకటించారు. కొద్ది రోజులుగా వర్షాలు లేకపోవడంతో గోదావరి వద్ద నీటి మట్టం తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం భద్రాచలం గోదావరిలో పటిష్ఠ బందోబస్తు నడుమ వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి.

News September 18, 2024

MSME పాలసీ పటిష్ఠం చేయాలని నిర్ణయం: డిప్యూటీ సీఎం భట్టి

image

రాష్ట్రంలో MSME పాలసీ పటిష్ఠం చేయాలని నిర్ణయించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా తెలంగాణలో MSME పాలసీ తీసుకొచ్చామని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ MSME పాలసీ లేదన్నారు. ఆర్థిక వ్యవస్థకు చిన్న, సూక్ష్మ పరిశ్రమలు కీలకమని చెప్పారు. భారీ పరిశ్రమలతో పాటు MSMEలకు తమ సర్కారు అనుకూల వాతావరణం కల్పిస్తామని పేర్కొన్నారు.

News September 18, 2024

ఖమ్మం: మిర్చి @ రూ.20,000

image

వరుస సెలవుల అనంతరం బుధవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. బుధవారం మార్కెట్లో మిర్చి ధర క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,000 జెండా పాట పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. రైతులు తమ సరుకులు మార్కెట్ కు తరలించే సమయంలో పలు జాగ్రత్తలు పాటించి క్రయవిక్రయాలు జరుపుకోవాలని మార్కెట్ అధికారులు తెలిపారు.

News September 18, 2024

కరకగూడెం:భార్యతో గొడవ.. భర్త సూసైడ్

image

భార్యతో గొడవపడి పురుగులు మందు తాగి ఓ వ్యక్తి సూసైడ్ చేసుకొని మృతిచెందిన ఘటన కరకగూడెం మండలంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరకగూడెం మండలం అశ్వాపురంపాడు గ్రామానికి చెందిన కోవాసి సురేశ్ తన భార్యతో గొడవపడి మనస్తాపం చెంది మంగళవారం రాత్రి పురుగుల మందు తాగాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు తెలిపారు.

News September 18, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్య అంశాలు

image

>ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు
>ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత: అదనపు కలెక్టర్
>ప్రజా పాలన దినోత్సవంలో మంత్రి పొంగులేటి
> ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తోంది: మంత్రి తుమ్మల
>దళితబంధు చెక్కులను పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం భట్టి
> పాల్వంచ:గణేశ్ నిమజ్జన వేడుకల్లో ఎమ్మెల్యే కూనంనేని
> వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ

News September 17, 2024

కొత్తగూడెం: అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన మంత్రి తుమ్మల

image

ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేశ్ వి పార్టీ, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News September 17, 2024

మధిర: ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మధిర మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన దాల్ గోపి (30) గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన గోపి ఇంటి వెనుక ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు పరిశీలిస్తున్నారు.