Khammam

News September 17, 2024

కమనీయం భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో మంగళవారం స్వామివారికి మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 4 గంటలకే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

News September 17, 2024

కొత్తగూడెం: గోదావరి వద్ద గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పవిత్ర గోదావరిలో నిర్వహిస్తున్న వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. వాహనంపై నుంచి విగ్రహం కిందకి దింపుతుండగా విగ్రహం జారీ కింద పడింది. ఈ ఘటనలో స్విమ్మర్ రాజేశ్‌కు గాయాలయ్యాయి. అధికారులు వెంటనే స్పందించి అంబులెన్సులో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

News September 17, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవం వేడుకలు
> ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా గణేశుని నిమజ్జనాలు
> నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం
> నేడు సత్తుపల్లి మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే
> నేడు అశ్వారావుపేట మండలంలో ఎమ్మెల్యే జారే పర్యటన
> నేడు కారేపల్లిలో పర్యటించనున్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్
> భద్రాద్రి రామయ్య, పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు

News September 17, 2024

గత ప్రభుత్వం ఇచ్చింది 49 వేలు కార్డులు మాత్రమే: పొంగులేటి

image

ఖమ్మం: గత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చింది కేవలం 49 వేల రేషన్ కార్డులు మాత్రమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు, హెల్త్ కార్డులను మంజూరు చేస్తుందని చెప్పారు. దాదాపు 90 లక్షల కార్డులు ఇప్పుడు ఉన్నాయని, వాటిని బైఫరికేషన్ చేసి, స్మార్ట్ కార్డులు ఇస్తామని, ప్రతీ పేదవాడికి కార్డులు అందించాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

News September 17, 2024

2035 నాటికి 40 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యం: భట్టి

image

2035 నాటికి తెలంగాణ రాష్ట్రం 40,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంతో ముందుకు వెళుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నేటి ప్రపంచంలో ఆర్థిక, సామాజిక శ్రేయస్సుకు రిలయబుల్ ఎనర్జీ పునాది లాంటిదని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సిటీ, ఫోర్త్ సిటీ, మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్‌ను ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందన్నారు.

News September 16, 2024

దారుణం.. 12 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం

image

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే బాలికతో కలిసి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

News September 16, 2024

సీతారామ ప్రాజెక్ట్ కాలువలో పడి ఇద్దరూ చిన్నారులు మృతి

image

ప్రమాదవశాత్తు సీతారామ ప్రాజెక్ట్ కాలువలో పడి ఇద్దరూ చిన్నారులు మృతి చెందిన ఘటన సత్తుపల్లి మండలంలో చోటుచేసుకుంది. బుగ్గపాడు సమీపంలోని సీతారామ ప్రాజెక్టు కాలువ వద్దకు ఈతకు వెళ్లిన జితేంద్ర సాయి (4వ తరగతి), శశాంక్ (3వ తరగతి) ప్రమాదవశాత్తు కాలువలో పడి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News September 16, 2024

మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపిన తుమ్మల

image

మిలాద్-ఉన్-నబీ పర్వదినం సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త బోధనలైన కరుణ, సహనం, సమైక్యత, సామరస్యం, విశ్వ మానవ సోదర భావం.. నిత్యం మనందరిలో స్ఫూర్తిని నింపుతూ ఉంటాయని, అందరి మేలు కోసం పని చేసేలా ప్రోత్సహిస్తాయని పేర్కొన్నారు. మహ్మద్ ప్రవక్త జన్మదినోత్సవమైన మిలాద్ ఉన్ నబీ ముస్లింలకు అత్యంత పవిత్రమైన రోజని పేర్కొన్నారు.

News September 16, 2024

KMM: వాకింగ్ చేస్తూ గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి

image

గుండెపోటుతో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన ముదిగొండ మండలంలో ఈ ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాణాపురం గ్రామానికి చెందిన వట్టికూటి రమేష్ బాబు ఉదయం వాకింగ్ చేస్తూ ఒకసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు ఆసుపత్రి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. రమేష్ మృతికి పలువురు సంతాపం ప్రకటించారు.

News September 16, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గణేశుని నిమర్జన వేడుకలు
>ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
>ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
>వైరాలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
>భద్రాచలం వద్ద తగ్గిన గోదావరి
>అన్నపురెడ్డిపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు
>ఓటరు జాబితాపై అభ్యంతరాలు స్వీకరణ
>సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన