India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బోనకల్ మండలం మోటమర్రి గ్రామ రైల్వే స్టేషన్ నుంచి పల్నాడు, విష్ణుపురం గ్రామాల మధ్య డబ్లింగ్ రైల్వే లైన్ భూసేకరణ పనుల కోసం నోటిఫికేషన్ విడుదలైనట్లు సంబంధిత రైల్వే అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నోటిఫికేషన్పై అభ్యంతరాలు ఉన్న వారు ఖమ్మం, నందిగామ ఆర్డీఓ కార్యాలయంలో సంప్రదించవలసిందిగా తెలిపారు.

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా తగ్గుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి గోదావరి నీటిమట్టం 34.9 అడుగులకు చేరిందని సీడబ్ల్యూసీ అధికారులు ప్రకటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రెండవ ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహించిన గోదావరి క్రమేపి తగ్గుతూ వచ్చింది. గణేష్ నిమజ్జనం కోసం వెళ్లే భక్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

చింతకాని మండలం వందనంలోని గంగమ్మ తల్లి దేవాలయంలో ఉరి వేసుకుని యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో వంశీ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు చెబుతున్నారు. చింతకాని పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడు కొనిజర్ల మండలం అనంతారానికి చెందిన యువకుడని ఎస్సై నాగుల్ మీరా తెలిపారు.

∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గణేశ్ నిమజ్జన ఏర్పాట్లు పూర్తి
∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} పాల్వంచలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} ఖమ్మం ముంపు ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు
∆} భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పర్యటన

సీఎం రేవంత్ స్వగ్రామం కొండారెడ్డిపల్లితో పాటు మధిరలోని సిరిపురం సహా మరో 20 గ్రామాల్లోని వ్యవసాయ పంపుసెట్లు, గ్రామాల్లోని ఇళ్లకు సంపూర్ణంగా సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయాలని డిప్యూటీ CM భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. కాగా దీనికి సంబంధించి ఇప్పటికే సర్వే పూర్తైంది. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా సిరిపురం ఎంపిక కావడంతో గ్రామానికి అరుదైన అవకాశం దక్కినట్లైంది.

ప్రజల ఆకాంక్షలను చట్టాలుగా మార్చే ప్రభుత్వం తమదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. 2029-30 వరకు రాష్ట్రంలో 20వేల మెగావాట్ల గ్రీన్ పవర్ను ఉత్పత్తి చేస్తామని, విద్యుత్ విషయంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తామని చెప్పారు. గత పాలకుల లాగా రాష్ట్ర సంపదను దోపిడీ చేసేందుకు సిద్ధంగా లేమని, కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదన్న వాళ్లకు చంప దెబ్బ కొట్టేలా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు.

గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో ఈనెల 16 సోమవారం నాడు ఖమ్మం నగరంలో వాహనదారులు గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర జరిగే రూట్లు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. అటు నగరంలో శోభాయాత్ర జరిగే మార్గాలు, వాహనదారుల ప్రత్యామ్నాయ మార్గాల మ్యాపును సీపీ విడుదల చేశారు.

చర్ల సరిహద్దులోని అడవుల్లో మరోసారి కాల్పుల మోత మోగింది. పూర్వాతి గ్రామంలో పోలీసుల బేస్ క్యాంపుపై మావోయిస్టులు దాడులు చేశారు. భద్రతా బలగాలపై మావోయిస్టులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. దీన్ని భద్రతా బలగాలు గట్టిగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అన్నపురెడ్డిపల్లిలోని గణేశ్ విగ్రహానికి భక్తుల నుంచి సేకరించిన మూడు లక్షల రూపాయలతో అలంకరణలు చేశారు. లక్ష్మీ గణపతి అవతారంలో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం లక్ష్మీ గణపతి విశిష్టతను పూజారి భక్తులకు తెలిపారు. ఉత్సవ కమిటీ పర్యవేక్షణలో పూజలు నిర్వహించారు.

>ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
>ఉమ్మడి జిల్లాలో ఓటరు జాబితాపై అభ్యంతరాలు స్వీకరణ
>ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు
>ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
>సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
>జిల్లా వ్యాప్తంగా పంట నష్టంపై సర్వే
>ఇల్లెందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన
>భద్రాచలంలో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులు
>పాల్వంచలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
Sorry, no posts matched your criteria.