India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి.శ్రీజ శుక్రవారం పంచాయతీ విధులపై సమీక్ష నిర్వహించారు. గ్రామ పంచాయతీలలో ఓటరు జాబితా అభ్యంతరాలు, నమోదు, కార్యదర్శుల బదిలీ, రిలీవింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. నిమజ్జనానికి ఏర్పాట్లు, పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం పెంపుదలపై శ్రద్ధపెట్టాలని, వరద ప్రభావిత గ్రామాల్లో పారిశుద్ధ్యం నిర్వహణకు ప్రాధాన్యం ఇచ్చి, సీసీ చార్జీల వంటి అంశాలను సమీక్షించాలన్నారు.

ఖమ్మం జిల్లాలో వరదల సమయంలో సిబ్బంది ప్రజలకు అమూల్యమైన సేవలు అందించారని సి.పి సునీల్ దత్ తెలిపారు. పారిశుధ్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, హోంగార్డులు మొదలైన వారు మానవతా దృక్పథంతో, కలసికట్టుగా విపత్కర పరిస్థితుల్లో సేవలు అందించారని ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు సిద్ధార్థ విక్రంసింగ్, ట్రైనీ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, డిఆర్వో రాజేశ్వరి, మునిసిపల్ కమిషనర్లు సమావేశంలో పాల్గొన్నారు.

ఈనెల 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా పరేడ్ గ్రౌండ్లో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ పి.శ్రీజ, డి.మధుసూదన్ నాయక్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు చెప్పారు.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు 4 రోజుల సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 14, 15 తేదీల్లో వారంతపు సెలవులు కాగా, 16న వినాయక నిమజ్జనం, 17న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా వరుసగా 4 రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. తిరిగి ఈనెల 18వ తేదీ బుధవారం నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని అన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజనల్ మేనేజర్ సరి రామ్ గురువారం రీజనల్ కార్యాలయంలో అన్ని డిపోల మేనేజర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వర్షాల వల్ల క్యాన్సిల్ అయిన బస్సుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే దసరా స్పెషల్ ఆపరేషన్ గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో అన్ని డిపోలో ట్రాఫిక్ ఇన్ఛార్జ్లు, గ్యారేజ్ ఇన్ఛార్జ్లు పాల్గొన్నారు.

∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} భద్రాచలం వద్ద తగ్గుముఖం పడుతున్న గోదావరి
∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారే పర్యటన
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} నేలకొండపల్లి మండలంలో పంట నష్టంపై సర్వే

గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఈ నెల 16న మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. వైన్ షాపులతో పాటు రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లను మూసివేయాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాలు జారీ చేశారు. 16న ఉదయం 6 గంటల నుంచి 17 ఉదయం 6 గంటల ఆదేశాలు పాటించాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఖమ్మం: గణేష్ నిమజ్జన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఖచ్చితమైన ప్రణాళికతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సీపీ సునీల్ దత్ తెలిపారు. గణేష్ నిమజ్జనం, బందోబస్తు ఏర్పాట్లపై గురువారం పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏ చిన్న సంఘటనకు అస్కారం లేకుండా భక్తులు, సందర్శకులు క్షేమంగా తిరిగి వెళ్లేందుకు వీలుగా ఏర్పాటు చేయాలని, అటు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.

ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి రాజీవ్ గృహ కల్పలో వరద ముంపు ప్రాంతాలను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. జరిగిన నష్టాన్ని సంబంధిత అధికారులు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పునరావాస కేంద్రాల్లో అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. అన్ని శాఖల అధికారులు నివేదికను కోరారు. కేంద్ర బృందం అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఉన్నారు.

> నేడు కొత్తగూడెం నియోజకవర్గంలో ఎంపీ పర్యటన
> కూనవరంలో ఎమ్మెల్యే పాయం పర్యటన
> వైరాలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
> ప్రశాంతంగా జరుగుతున్న గణేశ్ ఉత్సవాలు
> మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు
> తగ్గుముఖం పట్టిన గోదావరి
> భద్రాద్రి రామయ్య, పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయాల్లో ప్రత్యేక పూజలు
Sorry, no posts matched your criteria.