Khammam

News September 11, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

> వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన > భద్రాచలం వద్ద కొనసాగుతున్న గోదావరి ఉధృతి > కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం > సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద పర్యటన > మధిర మండలంలో మంచినీటి సరఫరా బంద్ > పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు >ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల పర్యటన >మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న చర్యలు

News September 11, 2024

నిలకడగా భద్రాచలం గోదావరి నది ప్రవాహం

image

భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం గడిచిన గంట నుంచి నిలకడగా కొనసాగుతోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 5 గంటలకు 50.5 అడుగుల వద్ద ఉన్న గోదావరి నీటిమట్టం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇక గోదావరి ప్రవాహం పెరిగే అవకాశం లేదని, ఒకవేళ పెరిగినా స్వల్పంగా పెరిగి, అనంతరం తగ్గుముఖం పడుతుందని విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

News September 11, 2024

ఖమ్మంలో ఈ నెల 12న జాబ్ మేళా…!

image

ఖమ్మం నగరంలోని టేకులపల్లి ప్రభుత్వ ఐటిఐ కళాశాల మోడల్ కెరీర్ నందు ఈనెల 12న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మాధవి తెలిపారు. స్పందన స్పీహూర్తి ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ నందు ఖాళీగా ఉన్న 100 పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 18-29 ఏళ్ళు కలిగి, ఇంటర్ విద్యార్హత కలిగిన వారు అర్హులు అన్నారు. ఉ.10 గంటలకు జరిగే జాబ్ మేళాలో విద్యార్హత పత్రాలతో హాజరు కావాలన్నారు.

News September 11, 2024

KMM: గోదావరి శాంతించాలని ప్రత్యేక పూజలు

image

గోదావరి శాంతించాలని జాలర్లు దక్షిణ గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నదికి చీర, జాకెట్, పసుపు, కుంకుమ సమర్పించారు. ఇదిలా ఉండగా మ.2 గంటలకు 47.1 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరుకుంది. 48 అడుగుల చేరుకుంటే రెండో ప్రమాద హెచ్చరిక అమలు చేశారు. సాయంత్రం 48 అడుగులకు దాటడంతో ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరిక అమలులో ఉంది.

News September 10, 2024

KMM: రూ.5 వేల కోట్లతో యంగ్ ఇండియా స్కూళ్లు: డిప్యూటీ సీఎం

image

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో అక్షరాస్యత పెంపునకు రూ.5 వేల కోట్లతో యంగ్ ఇండియా స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీటిని 4వ తరగతి నుంచి ఇంటర్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో తీసుకొస్తామని చెప్పారు. టాటా కంపెనీ సహకారంతో 65 ITIలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అలాగే రాష్ట్రంలో ఏటా రూ.20 వేల కోట్లు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామన్నారు.

News September 10, 2024

KMM: పోలీస్ జాగిలానికి ఏఎస్పీ ఘన నివాళి

image

అనారోగ్యంతో మరణించిన పోలీస్ జాగిలం షైనీకి ఘనంగా అంతిమ వీడ్కోలు పలికారు. జిల్లా పోలీస్ శాఖకు పోలీస్ జాగిలం షైనీ అందించిన సేవలు మరువలేనివని అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ పరితోష్ పంకజ్ అన్నారు. ఈ రోజు జిల్లా పోలీస్ డాగ్ స్క్వాడ్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ జాగిలం అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. గత నెల రోజులుగా బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఈ రోజు తుది శ్వాస విడిచింది.

News September 10, 2024

ఖమ్మం: జిల్లాలో 76 కి.మీ.మేర దెబ్బతిన్న రహదారులు

image

ఖమ్మం జిల్లాలో వరదల కారణంగా 76 కి.మీ.మేర రహదారులు దెబ్బతిన్నాయి. పలు చోట్ల కోతకు గురికాగా, మరికొన్ని చోట్ల పూర్తిగా తెగిపోయాయి. ఈ మొత్తం నష్టం విలువ రూ.180.37 కోట్లుగా ఉందని అధికారులు పేర్కొన్నారు. అలాగే జిల్లావ్యాప్తంగా నీటిపారుదల శాఖ పరిధిలో రూ.60 కోట్ల మేర నష్టం జరిగిందని నివేదికల్లో పొందుపర్చారు. 45 చెరువులకు పలు ప్రాంతాల్లో గండ్లు పడ్డాయి. మొత్తంగా 103 ప్రాంతాల్లో ఈ శాఖకు నష్టం వాటిల్లింది.

News September 10, 2024

KMM: అతిథి అధ్యాపక పోస్టులకు ఇంటర్వ్యూ

image

ఖమ్మం జిల్లాలో SR&BGNR కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల పోస్టులకు మంగళవారం సాయంత్రం 5:00 గంటలకు దరఖాస్తు ముగిసింది. ఇంటర్వ్యూకి తేదీలు ప్రకటించారు. 11న జరగనున్న ఇంగ్లిష్-1,హిస్టరీ-3,ఎకనామిక్స్-1 గణితం-3, బోటనీ-1,కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్-3,BCA-1,డేటా సైన్స్-1,బయో టెక్నాలజీ-1,12తేదీన జరగనున్న ఇంటర్వ్యూ కామర్స్-2, పొలిటికల్ సైన్స్-2,BBA-2 ఓ ప్రకటనలో ప్రిన్సిపల్ జాకీరుల్లా తెలిపారు.

News September 10, 2024

భద్రాచలం: జిల్లా కలెక్టర్‌తో ఎమ్మెల్యే సమావేశం

image

వరద ప్రభావిత ప్రాంతాల గురించి జిల్లా కలెక్టర్తో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సమావేశం నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించిన వరద ప్రభావిత ప్రాంతాల గురించి మాట్లాడారు. 2వ ప్రమాద హెచ్చరికకు గోదావరి వరద ప్రవాహం దగ్గర్లో ఉండడంతో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు.

News September 10, 2024

భద్రాచలం: గోదావరి నీటిమట్టం 47.1 అడుగులు

image

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోందని సీడబ్ల్యుసీ అధికారులు ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయం నాటికి గోదావరి నీటి మట్టం 47.1 అడుగులకు చేరిందని వెల్లడించారు. మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 47.1 అడుగులుగా ఉంది. రెండో ప్రమాద హెచ్చరిక 48 అడుగులు కావడంతో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.