India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చర్ల సరిహద్దు చతిస్గడ్ కోసూరు పోలీస్ స్టేషన్ పరిధి నంబి అటవీ ప్రాంతంలో కర్రి గుట్టపై మావోయిస్టులకు భద్రతా దళాలకు శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఎస్. జెడ్పీ సభ్యుడు సాగర్ అలియాస్ సంతోష్, మనీ రామ్ తోపాటు మరో మావోయిస్టు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి ఒక LMG, ఒక AK 47, సహా 12 బోరు తుపాకులు అనేక ఆయుధాలు, నిత్యవసర సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ ధ్రువీకరించారు.
దమ్మపేట మండలం మందలపల్లి రోడ్డు ప్రమాద బాధితుల వివరాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం చీమలపాడు గ్రామానికి చెందిన రామకృష్ణ(35) చీపు లక్ష్మీ(32), ఇద్దరు కూతుళ్లు శరణ్య(8), శాన్విక(6) అశ్వారావుపేటలోని కోళ్ల ఫారంలో పని చేయడానికి వెళ్తుండగా ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తల్లీ, ఇద్దరు కూతుళ్లు మృతి చెందగా.. భర్త రామకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి.
భద్రాద్రి జిల్లాలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. దమ్మపేట వద్ద గుర్తుతెలియని వాహనం ఓ బైక్ను ఢీకొట్టడంతో తల్లి సహా ఇద్దరు పిల్లలు మృతి చెందారు. ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
‘ఆరుగాలం కష్టించి సాగు చేస్తున్న పంటలు ఎండిపోయి రైతులు ఏడుస్తుంటే నీవు క్రికెట్ చూస్తూ ఎంజాయ్ చేస్తావా..!’ అంటూ మాజీ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డి పై ధ్వజమెత్తారు. రైతు సమస్యలపై స్థానిక కార్యాలయ ప్రాంగణంలో శనివారం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఎండిన పంటలకు పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసారు.
ఖమ్మం జిల్లాలో మహిళలు, బాలికలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఖమ్మం పోలీసు కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు. మహిళలను వేధింపుల నుంచి రక్షించేందుకు కమిషనరేట్ పరిధిలో షీ టీమ్లతో భరోసా కల్పిస్తామన్నారు. ఫిర్యాదు దారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసానిచ్చారు. మహిళలు ఎప్పుడైతే అభద్రతకు లోనవుతారో డయిల్ -100, షీటీమ్ నంబర్ 87126 59222కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొద్ది రోజుల్లో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బడుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. చాలా వరకు ప్రభుత్వ పాఠశాలల్లో వాచ్మెన్లు లేరు. గతంలో ఉన్న వారు పదవీ విరమణ పొందగా కొత్తవారి నియామకం జరగలేదు. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల పాఠశాలల పరిసరాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొద్ది రోజుల్లో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బడుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. చాలా వరకు ప్రభుత్వ పాఠశాలల్లో వాచ్మెన్లు లేరు. గతంలో ఉన్న వారు పదవీ విరమణ పొందగా, వీరి స్థానంలో కొత్త వారిని గత ప్రభుత్వం నియమించలేదు. వీటన్నింటి నేపథ్యంలో కొన్ని చోట్ల పాఠశాలల పరిసరాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి.
ఖమ్మం జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి శుక్రవారం వరకు 361మందిపై 287 కేసులు నమోదు చేయగా.. రూ.28,44,242 విలువైన సొత్తు
స్వాధీనం చేసుకున్నట్లు వ్యయ పరిశీలన అధికారి మురళీధర్ రావు తెలిపారు. రూ.50,400 విలువైన PDS బియ్యం
స్వాధీనం చేసుకున్నామని, పోలీస్, ఎక్సైజ్ శాఖలకు సంబంధించి రూ.5,25,10,090 విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
కుటుంబ సభ్యులు మందలించారని ఓ బాలుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కామేపల్లి మండలంలో జరిగింది. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. గోవింద్రాల గ్రామానికి చెందిన బాలుడు ఇటీవలే 10 తరగతి పరీక్షలు రాసి ఇంటి వద్ద ఉంటున్నాడు. అయితే, ఏదైనా పని చేయాలంటూ కుటుంబీకులు సూచించడంతో మనస్తాపానికి గురైన బాలుడు శుక్రవారం చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఎస్సై ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ నెల 9 నుంచి 28 వరకు ఎక్కువమంది పెళ్లిళ్లకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి సామాగ్రిని సమకూర్చుకోవడానికి వివిధ ఖర్చుల నిమిత్తం షాపింగ్ చేసుకుంటున్నారు. ఆన్లైన్ చెల్లింపులకు ఆదాయపు పన్ను శాఖ ఆంక్షలు ఉండడం, ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో రూ.50 వేలకు మించి నగదు తీసుకువెళ్తే పోలీసులు తనిఖీలు చేస్తుండడంతో.. వారు ఇబ్బందులు పడుతున్నారు.
Sorry, no posts matched your criteria.