Khammam

News April 5, 2024

ఖమ్మం: అడుగంటుతున్న భూగర్భ జలాలు 

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. చెరువులు, కుంటలు, వ్యవసాయ బావులు, ప్రాజెక్టుల్లో నీరు ఇంకిపోతుండగా బీళ్లను తలపిస్తున్నాయి. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం భూగర్భ నీటిమట్టం మరింత లోతుకు పోయింది. గతేడాది జిల్లాలో భూగర్భ నీటిమట్టం 9.47 మీటర్లు ఉండగా ఈ ఏడాది మార్చి వరకు 9.91 మీటర్ల లోతుకు వెళ్లిందని భూగర్భ జల శాఖ అధికారులు తెలిపారు.

News April 5, 2024

కొత్తగూడెం: ‘తెలంగాణ ప్రజల పక్షాన పోరాడేది BRS పార్టీ ఒక్కటే’

image

పార్లమెంట్ ఎన్నికల్లో తన గెలుపు కోసం BRS నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని ఎంపి నామా నాగేశ్వరరావు కోరారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎంపీ నామా మాట్లాడారు. 100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో వైఫల్యం చెందిందని, ఆటో డ్రైవర్లు, రైతులు, ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజల పక్షాన పోరాడేది BRS పార్టీ ఒక్కటే అని చెప్పారు.

News April 4, 2024

ఖమ్మం: కుక్కల దాడిలో 38 మేకలు మృతి

image

తిరుమలయపాలెం మండలం కాకరవాయి గ్రామానికి చెందిన కొమ్ము వెంకన్న అనే కాపరి మేకల మందపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 38 మేకలను మృత్యువాత పడ్డాయి. వాటి విలువ రూ. 3 లక్షలకు పైగా ఉంటాయని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. బతుకు తెరువు కోసం అప్పు చేసి మేకలను కొనుక్కొని జీవనం సాగిస్తున్నానని, ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని కోరారు.

News April 4, 2024

ఖమ్మం: మోడిఫైడ్ సైలెన్సర్లు ఉంటే అంతే సంగతులు

image

ద్విచక్ర వాహనాలకు మోడిఫైడ్ సైలెన్సర్లు అమర్చిన వారిపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. నగరంలో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ ద్వారా 79 మంది యువత వాహనాల నుంచి భారీ శబ్దం చేసే సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అనంతరం ఒక్కో వాహనదారుడికి రూ. 1,000 జరిమానా విధించామన్నారు. ఇకపై అలా చేస్తే చట్టపరంగా వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.

News April 4, 2024

KMM: రైలు కిందపడి వ్యక్తి మృతి

image

రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మధిర-మోటమర్రి రైల్వే స్టేషన్ల మధ్య ఆర్సీఎం చర్చి సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వాసుపత్రికి మృత దేహాన్ని తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712658589, 8712658607 నంబర్లు సంప్రదించాలన్నారు.

News April 4, 2024

ఖమ్మం: ఉన్నతాధికారుల కో-ఆర్డినేషన్ సమావేశం

image

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారుల కో-ఆర్డినేషన్ సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీ రావు, విజయవాడ సీపీ క్రాంతి రాణా టాటా, ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్, ఖమ్మం సీపీ సునీల్ దత్, అడిషనల్ కలెక్టర్ మధు సూధన్ నాయక్ రెండు సరిహద్దు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

News April 4, 2024

ఫోన్ ట్యాపింగ్ పై డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

image

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేసి పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించిందని మండిపడ్డారు. మంత్రులు, జడ్జిల ఫోన్లు సైతం ట్యాపింగ్‌కు గురయ్యాయంటే బీఆర్ఎస్ పాలనలో పరిస్థితి ఎలా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు అని అన్నారు.

News April 4, 2024

మాదిగ జేఏసీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులుగా రమేష్

image

పాల్వంచ మండలంలోని దంతేలబోర్ర గ్రామ మాజీ సర్పంచ్ గద్దల రమేష్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాదిగ జేఏసీ అధ్యక్షులుగా నియమితులయ్యారు. దీనికి సంబంధించిన నియామక పత్రాలను మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి చేతుల మీదగా గద్దల రమేష్ అందుకున్నారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. మాదిగల పక్షాన ప్రశ్నించే ప్రజా గొంతుకనై మాదిగ జాతి కోసం పోరాడుతానని పేర్కొన్నారు.

News April 4, 2024

భద్రాద్రిలో నిత్య కళ్యాణాలు నిలిపివేత

image

భద్రాచలం రామాలయంలో ఈనెల 9నుంచి 23వరకు శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు ఈవో రమాదేవి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఈనెల 9నుంచి నిత్య కల్యాణాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. 24నుంచి తిరిగి నిత్య కళ్యాణాలు ఉంటాయన్నారు. 9న ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు.

News April 4, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు 5 రోజులు సెలవు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రేపటి నుంచి ఐదు రోజులు సెలవు ఉన్నట్లు మార్కెట్ శాఖ కార్యదర్శి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం బాబు జగ్జీవన్ రావ్ జయంతి, శనివారం వారంతపు సెలవు, ఆదివారం సాధారణ సెలవు, 8న అమావాస్య, 9న ఉగాది పర్వదినం ఉన్న నేపథ్యంలో సెలవులు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. తిరిగి బుధవారం పదో తారీఖున మార్కెట్ ప్రారంభం అవుతుందని చెప్పారు.