Khammam

News April 1, 2024

పోడు వివాదం.. 19 మంది మహిళలు రిమాండ్

image

సత్తుపల్లి మండలం బుగ్గపాడు సమీపంలోని చంద్రాయపాలెం పోడు వివాదంలో సీఐ టి.కిరణ్, పోలీసులపై దాడి ఘటనలో 19 మంది మహిళలను అరెస్ట్ చేసి ఆదివారం రాత్రి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే, మరికొందరు పరారీలో ఉండగా గాలిస్తున్నట్లు చెప్పారు. వివాదంలో ముఖ్య భూమిక పోషించిన మద్దిశెట్టి సామేలు, కూరం మహేంద్ర కోసం గాలింపు ముమ్మరం చేశామని ఏసీపీ రఘు తెలిపారు. వీరి కోసం పలువురి ఇళ్లలోనూ సోదా చేశారు.

News April 1, 2024

కరువు పరిస్థితులను రాజకీయం కోసం వాడుకుంటారా..?

image

కరువు పరిస్థితులను రాజకీయం కోసం వాడుకుంటారా ..? అని మాజీ సీఎం కేసీఆర్ ను మంత్రి తుమ్మల నాగేశ్వర రావు నిలదీశారు. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావ పరిస్థితులను ప్రభుత్వ వైఫల్యంగా చూపాలని ప్రయత్నిస్తున్నారని ఒక ప్రకటనలో మండిపడ్డారు. నీటి నిర్వహణపై దృష్టి పెట్టకుండా మంచినీటి కోసం పక్క రాష్ట్రాలను అభ్యర్థించాల్సిన అధోగతికి మీరు కారణం కాదా అని ప్రశ్నించారు.

News April 1, 2024

పొంగులేటికి ఖమ్మం, తుమ్మలకు మహబూబాబాద్

image

పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవాలనుకుంటున్న అధికార కాంగ్రెస్ దూకుడు పెంచింది. లోకసభ స్థానాల వారీగా ఇన్‌ఛార్జీలను నియమించింది. ఖమ్మం పార్లమెంట్ ఇన్‌ఛార్జీగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహబూబాబాద్ పార్లమెంట్ ఇన్‌ఛార్జీగా తుమ్మల నాగేశ్వరరావు వ్యవహరించనున్నారని ఏఐసీసీ కార్యాలయం నుంచి ఆదివారం రాత్రి ప్రకటన విడుదల చేశారు.

News April 1, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లా లో TODAY HEADLINES

image

∆} వివిధ శాఖలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} భద్రాద్రి జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం రద్దు
∆} మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} సత్తుపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం

News April 1, 2024

పాల్వంచ: టెక్నాలజీ సాయంతో బంగారు నగల పట్టివేత

image

టెక్నాలజీ సాయంతో ఓ ప్రయాణికుడు ఆటోలో పోగొట్టుకున్న బంగారాన్ని పాల్వంచ పోలీసులు పట్టుకున్నారు. కొత్తగూడెం ఎంజీ రోడ్ కు చెందిన సూరిబాబు పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయంలో మొక్కులు తీర్చుకోవడానికి వచ్చాడు. తిరిగి ఆటోలో వెళుతున్న క్రమంలో 8 తులాల బంగారు నగలు, సెల్ ఫోన్ ఉన్న బ్యాగును ఆటోలోనే మర్చిపోయాడు. బాధితుడి మొబైల్ లోకేషన్ ఆధారంగా బ్యాగును గుర్తించారు.

News April 1, 2024

ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయాలి: కలెక్టర్

image

సీ విజిల్ యాప్ ద్వారా ప్రజలు తమ దృష్టికి వచ్చిన ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్లను మభ్య పెట్టేందుకు ఎవరైనా అక్రమంగా నగదు, మద్యం, ఇతర వస్తువులను పంపిణీ చేయడం, ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడే వాటిని లైవ్ ఫోటోలు, వీడియోలను సీ విజిల్ యాప్ ద్వారా తీసి పంపాలని కోరారు.

News March 31, 2024

 మణుగూరు: ఇంటి దూలం కూలి బాలుడు మృతి

image

మణుగూరు మండలంలోని ఖమ్మంతోగూ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బండ్ల చంద్రయ్య, లక్ష్మీకాంత దంపతుల బాలుడు ప్రమాదవశాత్తు ఇంటి దూలం కూలి గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు మణుగూరు ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News March 31, 2024

మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిపై కేసు నమోదు

image

మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ తోపాటు ఆయన అనుచరులపై భద్రాచల పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. శనివారం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన సీతారాం నాయక్ నిబంధనలకు విరుద్ధంగా ఆలయంలోని గర్భగుడిలో ఫోటోలు దిగారు. అప్పటితో ఆగకుండా సోషల్ మీడియాలో గర్భగుడి ఫొటోలతో ప్రచురించటం పట్ల భక్తులు ఆగ్రహానికి గురయ్యారు. దీంతో ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు.

News March 31, 2024

అత్యధికంగా ఖమ్మం నుంచే రు.108.65 కోట్ల ఆదాయం

image

జిల్లాలో ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌తో పాటు ఖమ్మంరూరల్, కూసుమంచి, మధిర, సత్తుపల్లి, వైరా, కల్లూరు, కొత్తగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, ఇల్లెందులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. వీటి పరిధిలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి 47,102 డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేయగా రూ.227.34కోట్ల ఆదాయం వచ్చింది. ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోనే అత్యధికంగా రూ.108.65 కోట్ల ఆదాయం సమకూరడం విశేషం.

News March 31, 2024

భద్రాచలం ఆలయంలో మూలవిరాట్ చిత్రాలు వైరల్

image

భద్రాచలం రాములవారి దేవస్థానంలో ఫొటోలపై నిషేధం ఉండగా భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఓ వ్యక్తి ఫొటోలు తీసి వైరల్ చేయడంపై కేసు నమోదైంది. రాములవారిని బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాంనాయక్ కార్యకర్తలతో కలిసి దర్శించుకున్నారు. ఓ వ్యక్తి తన ఫోన్లో ఫొటోలు తీశారు. అనంతరం వీటిని షేర్ చేశారు. రామాలయం వాట్సప్ గ్రూప్‌తో పాటు పలు గ్రూపుల్లో అవి షేర్ అయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.