India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నేలకొండపల్లి మండలంలోని గువ్వల గూడెం గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎల్లయ్య (50) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. ముదిగొండ మండలం లోని గోకినపల్లి నుంచి నేలకొండపల్లి వస్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టడంతో బైక్ మీద నుంచి కింద పడిపోయారు. ఎల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.
దుమ్ముగూడెం సరిహద్దు ఆనుకొని ఉన్న ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా చింతగుఫా పోలీస్ స్టేషన్ పరిధి దులేద్ – ముక్తాంజ్ గ్రామాల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పికప్ వాహనానికి నిప్పు పెట్టిన ఘటన శనివారం చోటుచేసుకుంది. దులేద్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన వాహనానికి నిప్పంటించిన ఘటనపై పోలీస్టేషన్లో కేసు నమోదైంది.
సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులకు ఆటంకం కలిగింది. తిరుమలాయపాలెం మండలంలో ఓపెన్ కాలువతోపాటు సొరంగ మార్గం ఏర్పాటు చేస్తున్న క్రమంలో సమీపంలో వాగు ఉండటంతో భూగర్భ జలాలు పెద్ద మొత్తంలో నిర్మాణ కాలువలోకి ఉబికి వస్తున్నాయి. ఆ నీటితో టన్నెల్ నిండింది. దీంతో పనులకు ఆంటంకం కలుగుతోంది.
✓వివిధ శాఖలపై ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓ఖమ్మం నగరంలో బిఆర్ఎస్ పార్టీ సమావేశం
✓నేలకొండపల్లి మండలంలో ఎంపీ నామా పర్యటన
✓ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈస్టర్ వేడుకలు
✓పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
✓భద్రాచలంలో ఎమ్మెల్యే వెంకటరావు పర్యటన
✓సత్తుపల్లి విద్యుత్ సరఫరాలో అంతరాయం
ఓ వివాహ విందులో చోటుచేసుకున్న ఘర్షణ కారణంగా బాల్య వివాహ వ్యవహారం శనివారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికకు ఈనెల 27వ తేదీన యువకుడితో పెళ్లి జరిగింది. శుక్రవారం రిసెప్షన్ జరుగుతుండగా విందుకు హాజరైన ఓ యువకుడు మాంసం వేయలేదని గొడవకు దిగాడు. ఈ గొడవలో పెళ్లి కుమార్తె మైనర్ అని తేలడంతో ఐసీడీఎస్ సూపర్వైజర్ ఫిర్యాదుతో ఏఎస్సై రెహమాన్ కేసు నమోదు చేశారు.
ఏసుక్రీస్తు పునరుత్థానానికి గుర్తుగా జరుపుకునే ఈస్టర్ వేడుకలకు క్రైస్తవులు సిద్ధమయ్యారు. గుడ్ ఫ్రైడే తర్వాత మూడో రోజైన ఆదివారం ఈ పండుగ జరగనుండగా.. వేడుకలకు చర్చిలు, మందిరాలను ముస్తాబుచేశారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చర్చిలను విద్యుత్ దీపాలతో అలంకరించగా.. ఆదివారం ప్రార్థనలకు పెద్దసంఖ్యలో హాజరయ్యే భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
రంజాన్ పండుగ అంటే మొదట గుర్తుకొచ్చేది ముస్లింల ఉపవాసం.. సాయంత్రమైతే కులమతాలకతీతంగా అందరినీ నోరూరించే హలీమ్! ఇక రంజాన్ పండుగ రోజు ముస్లింలు బంధుమిత్రులను ఆహ్వానించి సేమియాతో నోరు తీపి చేయడం ఆనవాయితీ. అయితే, మార్కెట్లో రకరకాల కంపెనీల సేమియాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఇప్పటికీ కొందరు సొంతంగా ఇళ్లలో సేమియా తయారుచేయడంపై ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఈనెలంతా ముస్లింల ఇళ్లలో సందడి కనిపిస్తోంది.
ఖమ్మం జిల్లాలోని రేషన్ కార్డుదారులకు ప్రతినెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రమే బియ్యం పంపిణీ ఉంటుందని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్కుమార్ తెలిపారు. ఏప్రిల్ నెలకు సంబంధించి 4,11,283కార్డులకు గాను లబ్ధిదారులకు అవసరమైన 7,280.271మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇప్పటికే రేషన్షాపులకు చేరవేశామని పేర్కొన్నారు. లబ్ధిదారులు సకాలంలో బియ్యం తీసుకోవాలని ఆయన సూచించారు.
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ఏఆర్టీ సెంటర్లో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ భర్తీకి శనివారం రాత పరీక్ష నిర్వహించారు. ఒక పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా దరఖాస్తు చేసుకున్న 84 మందిలో 71 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షను పర్యవేక్షించిన డిప్యూటీ సూపరిండెంట్ బి.కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతిభ ఆధారంగా అర్హత ఉన్న వ్యక్తిని ఎంపిక చేస్తామని తెలిపారు.
ఇంటి పన్ను వడ్డీపై రాయితీకి నేటితోగడువు ముగియనుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంకా ఇంటి పన్ను కట్టాల్సిన వాళ్ళు ఉంటే ఈరోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నగర వ్యాప్తంగా ఏర్పాటుచేసిన కౌంటర్లలో బిల్ కలెక్టర్లకు చెల్లించాలని తెలిపారు.
Sorry, no posts matched your criteria.