India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

∆}మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఓటర్ సర్వే
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు
∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} భద్రాచలంలో ఎమ్మెల్యే వెంకట్రావు పర్యటన
∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం

ఖమ్మం జిల్లాలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు మాత్రమే కాదు, నాలాలను ఆక్రమించారని స్థానికులు అంటున్నారు. దీంతో కొన్ని కాలువలు ఆనవాళ్లు కోల్పోగా, మరికొన్నింటికి ఇరువైపుల కట్టడాలు పూర్తయ్యాయి. దీంతో వరద చెరువుల్లోకి వెళ్లడం లేదు. దీంతో పలు ప్రాంతాలు కుంటల్లా మారుతున్నాయి. చెరువుల్లో నీళ్లు లేకపోవడంతో అవి కబ్జాకు గురయ్యే అవకాశం ఉంది. అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

ఇందిర మహిళా శక్తి పథకం క్రింద చేపట్టిన వివిధ యూనిట్లను లబ్దిదారులకు అందజేసేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులతో ఇందిర మహిళా శక్తి యూనిట్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ మండల వారిగా మహిళ శక్తి పథకం కార్యచరణ చేపట్టాలన్నారు.

ఖమ్మం జిల్లాలో సెప్టెంబర్ నెలకు సంబంధించి సదరం స్లాట్ బుకింగ్ ను ఓపెన్ చేసినట్లు జిల్లా అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కాగా దివ్యాంగులు మీసేవ సెంటర్ వద్దకు వెళ్లి సదరం క్యాంపు కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని దివ్యాంగులు గమనించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

నీటిపారుదల ప్రాజెక్టులో ఏకంగా రూ.14 వేల కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నాయని రెవెన్యూ మంత్రి పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబం కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టులు కట్టి, వేల కోట్లు దోచుకుందని ఆరోపించారు. పెండింగ్ బిల్లుల్లో పారదర్శకంగా ఉన్నవాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తామన్నారు. దేవాదుల ప్రాజెక్టుపై తమ ప్రభుత్వం పూర్తి దృష్టి పెట్టిందని పేర్కొన్నారు.

కొడుకు మరణ వార్త విని ఆ బాధను తట్టుకోలేక తల్లి మరణించిన సంఘటన శుక్రవారం చండ్రుగొండ మండలం తుంగారం గ్రామపంచాయతీ వెంగళరావు కాలనీలో చోటుచేసుకుంది. గూగుల్ సాగర్ (21) పురుగుల మందు తాగి గురువారం మరణించారు. ఈ వార్త విన్న తల్లి తట్టుకోలేక శుక్రవారం హఠాన్మరణం చెందారు. తల్లి కొడుకుల మృతి పట్ల ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

7 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు చైర్ పర్సన్లను, వైస్ చైర్ పర్సన్లను, నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మహబూబ్ నగర్, వెలగటూరు, గాంధరి , సదాశివనగర్, ఎల్లారెడ్డి, నేలకొండపల్లి, మద్దులపల్లి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు.

సింగరేణి కార్మికులకు యాజమాన్యం శుభవార్త చెప్పింది. సంస్థలో పనిచేస్తున్న 2,364 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దాూర్లుగా (శాశ్వత ఉద్యోగులు) క్రమబద్ధీకరిస్తున్నట్టు సంస్థ ఎండీ ఎన్.బలరామ్ తెలిపారు. సెప్టెంబరు 1వ తేదీ నుంచి వారిని జనరల్ మజూర్లుగా గుర్తించబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు రానున్నాయి.

ఉమ్మడి ఖమ్మం జిల్లా అన్ని డిపోల పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి డయల్ యువర్ DM కార్యక్రమం రేపు నిర్వహించాల్సిందిగా రీజినల్ మేనేజర్ సరిరామ్ ఆదేశించారు. రేపు సాయింత్రం 3 నుంచి 4 గంటల వరకు స్థానిక డిపో మేనేజర్లకు కాల్ చేసి సమస్యలను దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరారు…
ఖమ్మం: 9959225958
మధిర: 9959225961
సత్తుపల్లి: 9959225962
భద్రాచలం: 9959225960
కొత్తగూడెం: 9959225959
మణుగూరు: 9959225963

చింతూరు మండలం లక్కవరం అటవీ ప్రాంతం నుంచి వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 378 తాబేళ్లను అటవీ అధికారులు పట్టుకొన్నారు. శుక్రవారం తెల్లవారు జామున పెట్రోలింగ్ చేస్తుండగా పట్టుకున్నట్లు సుకుమామిడి రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణరావు తెలిపారు. అనంతరం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.