Khammam

News March 30, 2024

KMM: భార్యను కాపాడబోయి భర్త మృతి

image

విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పెనుబల్లి మండలంలో శుక్రవారం జరిగింది. స్థానికులు కథనం ప్రకారం.. కుప్పెనకుంట్లకి చెందిన వల్లవరపు రవి(43) భార్య ప్రమాదవశాత్తు విద్యుత్ తీగను తాకడంతో షాక్‌కు గురైంది. రవి ఆమెను కాపాడే క్రమంలో షాక్‌కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News March 30, 2024

ఖమ్మంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

image

ఖమ్మం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. శుక్రవారం కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో అత్యధికంగా 43.3 డిగ్రీలుగా నమోదైంది. ఇది రాష్ట్రంలోనే అత్యధికం. జిల్లాలోని మరో 12 ప్రాంతాల్లో 40 డిగ్రీల నుంచి 41.5 డిగ్రీల వరకు నమోదుకాగా.. ఎండలకు తోడు వడగాలులు మొదలవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే 2 నెలలు ఎలా ఉంటుందో అని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

News March 30, 2024

‘ఖమ్మం జిల్లాలో మతోన్మాదానికి చోటు లేదు’

image

ఖమ్మం జిల్లాలో రాజకీయాలు కలుషితమయ్యాయని, జిల్లాలోని ప్రజాస్వామ్యవాదులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు యర్రా శ్రీకాంత్ అన్నారు. ఖమ్మంలో మతోన్మాదానికి చోటు లేదని తెలిపారు. జిల్లాలో కులమత తారతమ్యాలు లేకుండా జీవించే వాతావరణాన్ని కమ్యూనిస్టులు కల్పించారన్నారు. అటువంటి వాతావరణాన్ని విచ్ఛిన్నం చేసే చర్యలకు బీజేపీ దిగుతోందని ఆయన విమర్శించారు.

News March 29, 2024

ఖమ్మం: రైతుబంధు నిధుల విడుదలపై మంత్రి కీలక వ్యాఖ్యలు

image

తెలంగాణలో 2023-24 యాసంగికి సంబంధించి ఈరోజు వరకు 64,75,819 మంది రైతులకు రైతుబంధు నిధులు విడుదల చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇప్పటికే 92.68 శాతం మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ అయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క ఏడాది రైతుబంధు నిధులు 3 నెలల కంటే తక్కువ రోజులలోనే జమ చేయడం జరగలేదన్నారు. వ్యవసాయ పురోగతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

News March 29, 2024

కొత్తగూడెం: చోరీ చేస్తుండగా పట్టుకొని దేహశుద్ధి

image

బూర్గంపహడ్ మండల కేంద్రంలోని క్లస్టర్ మిల్లు సమీపంలో గురువారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. గ్రామ చివర ఉన్న క్లస్టర్ మిల్లు వద్ద నలుగురు దొంగలు ట్రాలీ వాహనంలోకి దొంగతనంగా హెవీ జనరేటర్ ఎక్కిస్తున్న క్రమంలో స్థానిక రైతులు ఇద్దరు దొంగలను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. గతంలో చోరీకి గురైన మోటర్లు, పలు పరికరాలు వీళ్లే ఎత్తుకెళ్లినట్లు రైతులు భావిస్తున్నారు.

News March 29, 2024

ఖమ్మంలో అక్రమ నిర్మాణాల తొలగింపు

image

ఖమ్మం ఖానాపురం పరిధిలోని వైఎస్సార్ కాలనీ సమీపంలో మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చిన స్థలాల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు శుక్రవారం తొలగించారు. సర్వేనెంబర్ 37లో సుమారు 35 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, 2004, 2009 సంవత్సరాల్లో 300 మంది మాజీ సైనికులకు, 139మంది స్వాతంత్య్ర సమరయోధులకు మొత్తం 439మందికి 144 గజాల వంతున అప్పటి కలెక్టర్లు అందజేసి, వారికి అసైన్డ్ పట్టాలు ఇచ్చారు.

News March 29, 2024

ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వానికి మావోయిస్టుల లేఖ

image

తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పేరుతో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీతో చేతులు కలిపిందని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ శుక్రవారం ఒక లేఖలో పేర్కొన్నారు. దుమ్ముగూడెంలో అరెస్టు చేసి మాయం చేసిన ఛత్తీస్‌గఢ్ ఆదివాసి యువకులను ఏం చేశారో ప్రభుత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. విప్లవ ప్రతిఘాతుక కగార్ (అంతిమ దశ) ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయన్నారు.

News March 29, 2024

KTDM: ‘నేను పార్టీ మారడం లేదు’

image

మహబూబాబాద్ ఎంపీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను బీఆర్ఎస్‌ను వీడుతున్నట్లు రాజకీయ ప్రత్యర్థులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను పార్టీ మారడం లేదు. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తా. నాపై నమ్మకంతోనే మళ్లీ మహబూబాబాద్ ఎంపీ సీటు కేసీఆర్ ఇచ్చారు. బీఆర్ఎస్ గెలిచే ఎంపీ స్థానాల్లో మహబూబాబాద్ ఒకటి’ అని చెప్పారు.

News March 29, 2024

మార్చిలోనే మండుతున్న ఖమ్మం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. శుక్రవారం మధిర, బోనకల్, ఎర్రుపాలెం, సత్తుపల్లిలో అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు ఖమ్మం, కొణిజర్ల, భద్రాచలం, చర్ల, బూర్గంపాడులో 39, పెనుబల్లిలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భానుడి ప్రతాపానికి మధ్యాహ్నం రోడ్లని నిర్మానుష్యంగా మారాయి. రాబోయే రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

News March 29, 2024

ఖమ్మం: ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు

image

ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌తో కలిసి రూరల్ మండలం పొన్నెకల్‌లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న ఖమ్మం లోకసభ ఎన్నికల కౌంటింగ్ పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఏడు సెగ్మెంట్లకు కౌంటింగ్ హాళ్లు, స్ట్రాంగ్ రూంలు, కేంద్రీకృత రిసెప్సన్ కేంద్రం ఏర్పాటుపై అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు.