India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కాజేసిన కేసులో పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సహాయకుడిగా పనిచేస్తున్న వంశీ ను గురువారం జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకోవడానికి రాని వారి పేర్లతో ఉండే నకిలీ వ్యక్తులతో మోసానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
ఈ గడ్డ బిడ్డగా తాను 30 ఏళ్ల పాటు వ్యాపార, సాంకేతిక, సేవా రంగాల్లో గడించిన అనుభవంతో సేవ చేయాలన్న స్పష్టమైన విజన్తో ఉన్నట్లు బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు చెప్పారు. గురువారం కొత్తగూడెం బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తానని, తద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. కొత్తగూడెం ప్రజలకు ఇళ్ల పట్టాల క్రమబద్ధీకరణ చేస్తానన్నారు.
మధిర మండలం నిదానపురానికి చెందిన నర్సిరెడ్డి అనే రైతు తన వ్యవసాయ పొలంలో మిర్చి పంటను సాగు చేశాడు. మిర్చి పంట పూర్తి కాగా వ్యర్థాలను తొలగించడానికి రైతు ట్రాక్టర్ రోటవేటర్తో దున్నుతున్నాడు. రోటవేటర్లో చెత్త ఇరుక్కుపోయి ఆగిపోవడంతో చెత్తను తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు రోటవేటర్లో పడిపోయాడు. తల నుజ్జు నుజ్జు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
కొత్తగూడెం జిల్లాలో కోతులను తరిమికొట్టేందుకు అనేక ప్రయత్నాలు విఫలం కావడంతో గ్రామస్థులు.. గ్రామపంచాయతీ కార్యదర్శి భవానీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె ఆన్లైన్లో గొరిల్లా దుస్తులు కొనుక్కుని రెండుసార్లు గ్రామం, వ్యవసాయ పొలాల్లో తిరిగింది. కోతులు ‘గొరిల్లా’కు భయపడి సమీపంలోని అడవుల్లోకి పారిపోయాయి. గత వారం రోజులుగా ఈ ఆలోచనను అమలు చేస్తున్నామని, చాలా వరకు కోతులు గ్రామాన్ని వదిలి వెళ్లాయన్నారు.
భద్రాచలం-విశాఖపట్నంకి లహరి నాన్ ఏసీ బస్సులను ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు భద్రాచలం DM రామారావు తెలిపారు. శనివారం భద్రాచలం నుంచి ఉదయం 9 గంటలకు, రాత్రి 9 గంటలకు లహరి బస్సు బయలుదేరుతుందన్నారు. విశాఖపట్నం-భద్రాచలానికి ఉదయం 8 గంటలకు, రాత్రి 8:45 గంటలకు బస్సు ఉంటుందన్నారు.
నేటి నుంచి భద్రాచలం-ఖమ్మం మధ్య త్రీ స్టాప్ డీలక్స్ బస్సులను నడపనున్నట్లు భద్రాచలం డీఎం రామారావు తెలిపారు. ఈ బస్సులు భద్రాచలం-ఖమ్మం మధ్య పాల్వంచ, కొత్తగూడెం, ఏన్కూరు స్టాప్ల్లో మాత్రమే ఆగుతాయని తెలిపారు. ఈ బస్సుల్లో ఆధార్ కార్డుతో మహిళల ఉచిత ప్రయాణానికి అనుమతి లేదని స్పష్టం చేశారు.
మద్యం తాగి విధులకు హాజరైన చర్ల మండలం జీపీ పల్లి పాఠశాల <<12938027>>ప్రధానోపాధ్యాయుడు <<>>బానోత్ కృష్ణను సస్పెండ్ చేస్తూ డీఈఓ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారని ఎంఈఓ తెలిపారు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్, మద్యం తాగి పాఠశాలకు రావడమే కాకుండా, విద్యార్థులను కొట్టాడు. దీంతో విద్యార్థులు ప్రధానోపాధ్యాయుడిని నిర్బంధించిన విషయం తెలిసింది. విచారణ చేపట్టిన డీఈఓ సస్పెండ్ చేశారు.
భార్యను వేధిస్తున్న భర్త, అతని కుటుంబ సభ్యులపై పాల్వంచ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల వివరాలు ప్రకారం.. కేశవాపురం గ్రామానికి చెందిన రమ్యకు శివకృష్ణతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మూడో సంతానం ఆడపిల్ల పుట్టిందని భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ రమ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఎస్ఐ కేసు నమోదు చేశారు.
మణుగూరు మండలం సమితిసింగారం రహదారిపై పాత సమ్మయ్య ఆసుపత్రి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాంబమూర్తి(55) అనే సింగరేణి ఉద్యోగి మృతి చెందాడు. మణుగూరు నుంచి పీవీ కాలనీకి బైక్పై వెళ్తున్న క్రమంలో వాహనం అదుపు తప్పింది. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సాంబమూర్తి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
> పినపాకలో ఎమ్మెల్యే పాయం పర్యటన
> భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలపై సమీక్ష సమావేశం
> ఖమ్మం జిల్లాలో బార్ అసోసియేషన్ ఎన్నికలు
> కొత్తగూడెంలో BJPఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు పర్యటన
> ఎంపీ ఎన్నికలపై ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష
> అశ్వరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన
> కల్లూరులో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
> కామేపల్లి మండలం తాళ్ల గూడెంలో తిరుపతమ్మ తల్లి అమ్మవారి కళ్యాణ మహోత్సవం
Sorry, no posts matched your criteria.