Khammam

News March 27, 2024

ఖమ్మం: ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి

image

జూలూరుపాడు మండలం పడమట నర్సాపురానికి చెందిన బాదావత్ రాందాస్ ఆర్టీసీలో బస్సులో ప్రయాణిస్తూ మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. రాందాస్ ఇటీవల అనారోగ్యానికి గురవడంతో తన భార్యతో కలిసి చికిత్స నిమిత్తం బస్సులో హైదరాబాద్‌కు బయల్దేరాడు. మార్గమధ్యలో బస్సు చిట్యాల శివారులో రాందాస్‌కు గుండెనొప్పి వచ్చింది. సీపీఆర్ చేసినా ప్రాణాలు దక్కలేదని ప్రయాణికులు చెప్పారు.

News March 27, 2024

BJP అడ్డుకునేది కమ్యూనిస్టులే: ఎమ్మెల్యే కూనంనేని

image

దేశంలో మతోన్మాద పోకడలు అవలంబిస్తున్న బీజేపీని నిలువరించే శక్తి, సామర్థ్యం కేవలం కమ్యూనిస్టులకు మాత్రమే ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. బుధవారం పాల్వంచ సీపీఐ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. దేశంలో మోదీని గద్దె దింపేందుకు కార్యకర్తలు కృషి చేయాలని, సార్వత్రిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

News March 27, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ.19,900 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,400 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈ రోజు మిర్చి ధర రూ.100 పెరగగా, పత్తి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్ కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.

News March 27, 2024

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి

image

ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన కూనవరం మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండాయిగూడెం గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడటంతో సోయం సాంబయ్య ఉపాధ్యాయుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 27, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

∆} ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} దుమ్ముగూడెం పర్ణశాలలో హుండీ లెక్కింపు
∆} మధిర మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఓటు నమోదుపై అవగాహన కార్యక్రమాలు
∆} అశ్వాపురంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన
∆} కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూనంనేని పర్యటన
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు

News March 27, 2024

పది పరీక్షలు.. 77 మంది గైర్హాజరు

image

ఎస్సెస్సీ పరీక్షకు మంగళవారం 77మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఖమ్మం జిల్లా డీఈఓ సోమశేఖరశర్మ తెలిపారు. మొత్తం 16,779 మంది విద్యార్థులకు గాను 16,702 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్‌, జిల్లా పరిశీలకుడు , అసిస్టెంట్‌ కమిషనర్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను పలు కేంద్రాలను తనిఖీ చేశాయని ఆయన తెలిపారు.

News March 27, 2024

KMM: అడుగంటిన జలాలు.. ఎండుతున్న పంటలు

image

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రైతన్నలు గగ్గోలు పెడుతున్నారు. 2,3 బోర్లు వేయిస్తున్నా ఫలితం ఉండట్లేదని, తడి లేక పంట ఎండిపోతోందని రైతులు వాపోతున్నారు. అనేక ప్రాంతాల్లో 500 అడుగుల మేర తవ్వినా నీటి జాడ లభించకపోవడం గమనార్హం. దీంతో ఆరు తడులతో ఎలాగో నెట్టుకొస్తున్నామని రైతన్నలు చెబుతున్నారు. ఎండల తీవ్రతతో మున్ముందు పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి.

News March 27, 2024

ఆన్ లైన్‌లో సీతారాముల కల్యాణ మహోత్సవ టికెట్లు

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఏప్రిల్ 17న జరగనున్న సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకం సెక్టార్ టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్లు ఈవో రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఉభయ దాతల కళ్యాణోత్సవ టికెట్ల ధరలు రూ.7500, 2500, 2000, 1000, 300, 150, పట్టాభిషేకానికి టికెట్ల ధరలు రూ.1500, రూ.500 నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఆయా టికెట్లను భక్తులు ఆన్లైన్ లో పొందవచ్చు అని చెప్పారు.

News March 27, 2024

‘పోలింగ్ కేంద్రాలకు సంబంధించి జాబితా సిద్ధం చేయాలి’

image

ఖమ్మం: రానున్న లోకసభ ఎన్నికల నిర్వహణకై పోలింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్ ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లాలోని 1459 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పీవో, ఏపీవో, ఎంవోల జాబితా సిద్ధం చేయాలన్నారు. వాస్తవ సిబ్బంది ఆవశ్యకతతో పాటు, రిజర్వ్ సిబ్బంది జాబితాలో ఉండాలని అధికారులను సూచించారు.

News March 26, 2024

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తుమ్మల తనయుడు

image

ఖమ్మం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగేందర్ మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కలయికలో యుగేందర్ పలు అంశాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. కాగా రేపు కాంగ్రెస్ పార్టీ సీఈసీ మీటింగ్ ఢిల్లీలో జరుగుతున్న నేపథ్యంలో తనను పార్టీ అభ్యర్థిగా ఖరారు చేయాలని యుగేందర్ సీఎంను కోరినట్లు సమాచారం.