India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కారేపల్లి మండలం గిద్ద వారిగూడెం ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం క్షుద్ర పూజల కలకలం రేపింది. సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల ఆవరణలో ముగ్గులు వేసి కోళ్లతో పూజలు చేసినట్టు గ్రామస్తులు గుర్తించారు. ఉదయం పిల్లలను పాఠశాలకు తీసుకువచ్చిన తల్లిదండ్రులు పరిస్థితిని చూసి భయాందోళనకు గురైయ్యారు. ఇలా ఉంటే పిల్లలను పాఠశాలకు ఎలా పంపించాలి అంటూ అసహనం వ్యక్తం చేశారు.
అశ్వరావుపేట మండలం నందమూరి కాలనీలో ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ నెలకొంది. రంజాన్, చిన్నా అనే ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ చెలరేగి రంజాన్ గొడ్డలి తీసుకువచ్చి చిన్నాపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. దాడిని అడ్డుకున్న స్థానికులు గాయపడ్డారు. చిన్నాను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
భద్రాద్రి ఆలయ ఆఫీసులో మృతదేహం కలకలం సృష్టించింది. రామాలయం సీఆర్ఓ కార్యాలయం పైఅంతస్తులోని బాత్రూంలో ఆఫీస్ సిబ్బంది మృతదేహాన్ని మంగళవారం ఉదయం గుర్తించారు. మృతుడు ఖమ్మంకి చెందిన జాఫర్గా గుర్తించారు. ఆయన రామాలయం ఆధ్వర్యంలో కొత్తగా నిర్మిస్తున్న వసతి భవనాల్లో టైల్స్ పనికి వచ్చినట్టు చెబుతున్నారు. కార్యాలయ సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సత్తుపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ చాంద్ పాషాపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. సంఘటనను తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మంగళవారం చాంద్ పాషాకు ఫోన్ చేసి పరామర్శించారు. అధైర్యపడవద్దని, అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దాడి చేసిన అధికార పార్టీ నేతలు, కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
ఖమ్మం జిల్లాలో పొత్తు కోసం సీపీఎం, సీపీఐ పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు కోసం వేచి చూస్తున్నాయి. బీఆర్ఎస్ తో వెళ్లేది లేదని చెబుతూనే కాంగ్రెస్ స్నేహ హస్తం కోసం ఎదురుచూస్తున్నాయి. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగైదు స్థానాల్లో పోటీకి సిద్దమైన సీపీఐ కొత్తగూడెం స్థానానికే పరిమితమైంది. సీపీఐ కోరుతున్న స్థానాల్లో ఖమ్మం పార్లమెంట్ కూడా ఉంది. నాలుగైదు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధర భారీగా తగ్గింది. క్వింటా మిర్చి ధర రూ.19,800 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,400 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజు కంటే ఈ రోజు మిర్చి ధర రూ.400 తగ్గగా, పత్తి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్ కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 25 నుంచి జరగనున్నాయని డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి , ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు తెలిపారు. ఏప్రిల్ 25 నుంచి మే2వ తేదీ వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు.
హోలీ ఆడిన తర్వాత రంగులు కడుక్కునేందుకు వాగులో దిగగా నీట మునిగి ఓ యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. లక్ష్మీదేవిపల్లి మండలం సాటివారిగూడేనికి చెందిన రాంబాబు, మరో ముగ్గురు యువకులు హోలీ సందర్భంగా రంగులు పూసుకున్నారు. అనంతరం రంగులు కడుక్కునేందుకు వాగులో దిగారు. రాంబాబు కాళ్లు జారి వాగులో మునిగి మృతి చెందాడు. లక్ష్మీదేవిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హోలీ జరుపుకున్న ఆ కుటుంబంలో గంటల వ్యవధిలోనే విషాదం నెలకొంది. సింగరాయపాలెంకు చెందిన రాజశేఖర్, గీత(25) దంపతులు ఖమ్మంలో నివాసముంటున్నారు. కొద్ది రోజులుగా రాజశేఖర్ తల్లి ఆరోగ్యం బాగా లేకపోవడంతో వారు ఇద్దరు పిల్లలతో కలిసి ఆదివారం సింగరాయపాలెం వచ్చారు. ఈ క్రమంలో ఉతికిన బట్టలను గీత దండెంపై ఆరవేస్తుండగా తీగకు కరెంట్ సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురై చనిపోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
✓ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓నేలకొండపల్లిలో రైతు నేస్తం కార్యక్రమం
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభo
✓మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
✓అశ్వరావుపేటలో ఎమ్మెల్యే పర్యటన
✓సత్తుపల్లిలో ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ పర్యటన
Sorry, no posts matched your criteria.