Khammam

News March 26, 2024

సీసీ కెమెరాల ధ్వంసం.. పదో తరగతి విద్యార్థులు ఇంటికి..

image

ఖమ్మం జిల్లా నాయకన్‌గూడెంలోని మహాత్మ జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ బాలుర గురుకుల విద్యాలయంలో పదో తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులను పాఠశాల యజమాన్యం తమ ఇళ్లకు పంపించిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఏడుగురు సోమవారం అర్ధరాత్రి విద్యాలయలోని సీసీ కెమెరాల ధ్వంసానికి పాల్పడ్డారు. బయటి వారు చేశారని తొలుత పోలీసులను ఆశ్రయించామని, విద్యార్థులే అని తేలడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నామన్నారు.

News March 26, 2024

అర్హులందరికీ… ఉచిత విద్యుత్ దక్కేనా..?

image

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ‘గృహజ్యోతి’కి అర్హులైన వేలాది మందికి ప్రస్తుతం జీరో బిల్లులు రావడం లేదు. ఇలాంటి వారంతా స్థానిక పురపాలక, ఎంపీడీఓ కార్యాలయాల్లో ఆధార్‌, రేషన్‌, విద్యుత్తు బిల్లుకు సంబంధించి పత్రాలు అందజేస్తే పథకం వర్తింపజేస్తామని అధికారులు వెల్లడించారు. భద్రాద్రి జిల్లాలో 4,942, ఖమ్మం జిల్లాలో 3,568 మంది పథకానికి నోచుకోవడం లేదని తెలుస్తోంది.

News March 25, 2024

సి-విజిల్ బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తోంది: కలెక్టర్

image

ఖమ్మం: ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సి- విజిల్ చురుకైన బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తోందని జిల్లా కలెక్టర్ పి. వి. గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను నివేదించడానికి పౌరుల కోసం సి-విజిల్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభించిందన్నారు. సి- విజిల్ అనేది యూజర్ ఫ్రెండ్లీ యాప్, పౌరులు గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

News March 25, 2024

ఈనెల 27 పర్ణశాల,28 భద్రాచలంలో హుండీల లెక్కింపు

image

దుమ్ముగూడెం మండలం పర్ణశాల రామాలయంలో ఈనెల 27న, భద్రాచలం దేవస్థానంలో ఈనెల 28న హుండీ లెక్కింపు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రమాదేవి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా రోజుల్లో ఉదయం 9 గంటల నుండి హుండీ, లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు, ఈ విషయాన్ని ఆలయ కమిటీ సభ్యులు, దేవస్థాన అధికారులు, పోలీస్ శాఖ అధికారులు గమనించాలని తెలియజేశారు.

News March 25, 2024

రేపు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పునఃప్రారంభం

image

మూడు రోజుల విరామం అనంతరం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ మంగళవారం పున ప్రారంభం కానుంది. మొన్న, నిన్న వారాంతపు సెలవులు, నేడు హోలీ పర్వదినం సందర్భంగా మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

News March 25, 2024

అడుగంటిన పాలేరు రిజర్వాయర్

image

పాలేరు రిజర్వాయర్లో ప్రస్తుతం 7.45అడుగుల నీరు మాత్రమే ఉంది. ప్రతిరోజు మూడు జిల్లాలకు కలిపి 15 టీఎంసీల నీటిని నాలుగు స్కీముల ద్వారా మిషన్ భగీరథకు వినియోగిస్తున్నారు. కాగా, ప్రస్తుతం నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని సంబంధిత అధికారులను పాలేరు రిజర్వాయర్ అధికారులు కోరారు. ఈ నెలాఖరులోగా పాలేరు రిజర్వాయర్‌కు నీరు వచ్చే అవకాశం ఉంది.

News March 25, 2024

మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావుతో ఎంపీ అభ్యర్థి వినోద్ రావు భేటీ

image

ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి వినోద్ రావు మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజాసేవలో నిమగ్నమైన వినోద్ రావు ఖమ్మం బరిలో ఘన విజయం సాధిస్తారని విద్యాసాగర్ రావు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ.. వినోద్ రావు విజయం కోసం కృషి చేస్తామన్నారు. ఈ సారి ఖమ్మం స్థానం బీజేపీ కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

News March 25, 2024

చింతకాని : అది పెద్ద పులి కాదు నక్క..!

image

ఖమ్మం జిల్లా చింతకాని మండలం వందనం గ్రామంలో గాలిబ్ సాహెబ్ అనే రైతు మొక్కజొన్న పొలంలో పంటకు నీళ్లు పెడుతుండగా పెద్దపులి కానబడిందని అక్కడి నుంచి పరుగు పెట్టి గ్రామానికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశాడు. గ్రామస్తులు పోలీసులకు, అటవిశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడకు వచ్చిన అటవీశాఖ అధికారులు పెద్దపులి కాదు అని హైనా జాతికి చెందిన నక్కగా గుర్తించారు.

News March 25, 2024

కిషన్ రెడ్డితో ఖమ్మం ఎంపీ అభ్యర్థి వినోద్ రావు భేటీ

image

ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని సోమవారం హైదరాబాద్లో కలిశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ఆయనను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం ఉందనీ, ఖమ్మంలో వినోద్ రావును భారీ మోజార్టీతో గెలిపించాలని కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలకు విస్తృత సేవ చేసేలా తనకు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు వినోద్ రావు కృతఙ్ఞతలు తెలిపారు.

News March 25, 2024

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై తెరపడని ఉత్కంఠ!

image

కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం ఎంపీ అభ్యర్థి ఎంపిక అయోమయంగా మారింది. రోజుకో పేరును తెరపైకి వస్తుండడం.. అధిష్ఠానం ఎవరి పేరునూ ఖరారు చేయకపోవడంతో నేతలు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. అభ్యర్థి ఎంపిక ప్రహసనంగా మారడంతో పార్టీలో చర్చకు దారి తీసింది. సీటు కోసం ఎవరికివారు అధిష్ఠానం వద్ద గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. ఈ నేపథ్యంలో కార్యకర్తల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.