Khammam

News March 24, 2024

ఈతకు వెళ్లి పదవ తరగతి విద్యార్థి మృతి

image

పదవ తరగతి పరీక్షలు రాస్తున్న పాత సూరారం గ్రామానికి చెందిన జక్కుల సంపత్ అనే విద్యార్థి ఆదివారం ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వారి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచించారు.

News March 24, 2024

అశ్వారావుపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

image

అశ్వరావుపేట మండలం రామచంద్రపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్నగొలుసుపాటి అంజిమూర్తిని గుర్తుతెలియని వాహనం ఢీకోట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిది ఏలూరు జిల్లా తడికలపూడి మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పొలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 24, 2024

పొంగులేటికి అభిమానంతో..

image

పొంగులేటిపై అభిమానాన్ని ఓ వ్యక్తి వినూత్నంగా చాటారు. ఎర్రుపాలెం మండలం తక్కెళ్ళపాడుకు చెందిన గంధసిరి సత్తయ్య తన కుమారుడి పెళ్లి పత్రికపై పొంగులేటి దంపతుల ఫొటోను ముద్రించారు. దీంతో ఈ వెడ్డింగ్ కార్డు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

News March 24, 2024

ఖమ్మంలో తల్లిని హత్య చేసిన కొడుకు

image

ఖమ్మం రామన్నపేట కాలనీలో దారుణం జరిగింది. గంజాయి, మద్యం మత్తుకు బానిసైన కొడుకు తల్లిని కిరాతకంగా హతమార్చాడు. మృతురాలు గౌరీపెద్ది రామలక్ష్మి(మీరాబి) వికలాంగురాలు. ఆమెకు ఓ కొడుకు, ఓ కూతురు ఉన్నారు. తల్లిని కర్రతో తలపై బాధడంతో మృతిచెందినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

News March 24, 2024

ఖమ్మం: బైక్ ఢీకొని వ్యక్తి మృతి

image

గాంధీనగర్ కాలనీ వద్ద శనివారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఏపీలోని వత్సవాయికి చెందిన గుర్రం శేషగిరిరావు బైక్‌పై ఖమ్మం నుంచి వత్సవాయికి వెళ్తున్నాడు. అదే సమయాన బోనకల్ మండలం మోటమర్రి చెందిన వెంకటరావు ఖమ్మం వైపు వెళుతుండగా గాంధీనగర్ కాలనీ వద్ద ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో శేషగిరిరావు మృతి చెందాడు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

News March 24, 2024

మీరు హోలీ ఆడుతున్నారా.. జాగ్రత్త..!

image

ప్రజలు రేపు హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసులు సూచిస్తున్నారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో గుర్తుతెలియని వ్యక్తులు, వాహనాలపై రంగులు చల్లకూడదని పేర్కొన్నారు. న్యూసెన్స్ చేస్తే సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే వైన్స్, బార్లు, పబ్లు, కల్లు కంపౌండ్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. >>>SHARE IT

News March 24, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} భద్రాచలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాయం పర్యటన
∆} సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన

News March 24, 2024

KTDM: ప్రేమ వివాహం చేసుకుందని బ్లేడుతో దాడి

image

కులాంతర వివాహం చేసుకున్న కుమార్తెపై తండ్రి దాడి చేసిన ఘటనపై బూర్గంపాడు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతి అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించి ఈనెల 11న కులాంతర వివాహం చేసుకుంది. ఈ క్రమంలో యువతి తండ్రి కుమార్తెను చూడడానికి వెళ్లి ఒక్కసారిగా తనతో తెచ్చుకున్న బ్లేడుతో దాడి చేశాడు. గాయపడిన బాధితురాలు పోలీసుల ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేశారు.

News March 24, 2024

పంట దిగుబడులపై రైతన్నల దిగాలు!

image

యాసంగిలో పంటలు సాగు చేసిన రైతులకు గుబులు పట్టుకుంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఖమ్మం జిల్లాలో నానాటికీ భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఈ ప్రభావం బోర్లు, బావుల కింద సాగు చేసిన పంటలపై పడింది. సాగు చేసిన పంటల్లో చాలావరకు ఇప్పటికే ఎండిపోగా… మిగతావి వడబడుతున్నాయి . పెట్టుబడి వచ్చే స్థాయిలోనూ దిగుబడి సాధించే పరిస్థితి కానరావడం లేదు. వేల ఎకరాల్లో వరి, మొక్కజొన్న ఎండిపోగా రైతులకు కన్నీరే మిగులుతోంది.

News March 24, 2024

కూసుమంచి , ఖమ్మం మీదుగా కొత్త రైల్వే లైన్

image

డోర్నకల్‌ నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాల వరకు నూతనంగా రైల్వేలైన్‌ మంజూరు కాగా.. నిర్మాణానికి సర్వే పూర్తికావడంతో మార్కింగ్‌ ఇస్తున్నారు. ఈ రైల్వేలైన్‌ పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్‌, తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల మీదుగా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో మార్కింగ్‌ చేస్తుండగా తాము భూములు కోల్పోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.