Khammam

News March 23, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

✓ పలు శాఖలపై ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఓటు నమోదుపై ప్రత్యేక కార్యక్రమం
✓చర్ల మండలంలో సంత వేలం పాట
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు
✓మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓అన్నపురెడ్డిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
✓పినపాక మండలంలో ఎమ్మెల్యే పాయం పర్యటన

News March 23, 2024

శిశు మరణాలను నివారించాలి: డీఎంహెచ్ఓ

image

భద్రాద్రి జిల్లాలో ఐదు సంవత్సరాలలోపు పిల్లల మరణాల నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జేవీఎల్.శిరీష అన్నారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో సంభవించిన ఐదు సంవత్సరాలలోపు పిల్లల మరణాలకు కారణాలు అడిగి తెలుసుకున్నారు. వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.

News March 23, 2024

డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గురుకుల డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు కల్పించేందుకు విద్యార్థినీ, విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్‌జైన్‌ తెలిపారు. మణుగూరులోని బాలుర డిగ్రీ కళాశాలతో పాటు కొత్తగూడెం, దమ్మపేట, ఖమ్మం బాలికల కళాశాలల్లో చేరేందుకు అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఈనెల 28 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలన్నారు.

News March 23, 2024

ఖమ్మం: మట్టికుండ.. చల్లగుండ

image

ఖమ్మం జిల్లాలో ఎండలు దంచుతున్నాయి. బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. వేసవిలో తాగునీటి కోసం మట్టి కుండలను కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మట్టి కుండల్లో నిల్వ ఉంచిన నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సైతం సూచిస్తుండంతో పేద, ధనిక తేడా లేకుండా వీటిని కొంటున్నారు. సైజును బట్టి రూ.80 నుంచి రూ.300 వరకు ధరలు పలుకుతున్నాయి. పట్టణంలో పలు ప్రాంతాల్లో మట్టి కుండలను విక్రయిస్తున్నారు.

News March 23, 2024

రెండు రోజుల్లో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన!

image

రెండు రోజుల్లో ఖమ్మం కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థిపై స్పష్టత రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా ఈ స్థానానికి ఇద్దరు ప్రముఖ నాయకులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఇక్కడ BRS అభ్యర్థిగా నామా నాగేశ్వరరావును ప్రకటించగా.. కాంగ్రెస్, BJP పెండింగ్లో ఉంచాయి. అయితే BJP అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు బరిలో ఉండనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరని ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.

News March 23, 2024

ఖమ్మం: ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు

image

కారేపల్లి బీసీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు పి.రామగోపిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ ఉత్తర్వులు జారీ చేశారని ఎంఈఓ జయరాజు తెలిపారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి విధులకు హాజరుకాకుండా, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా పాఠశాలలో విద్యావలంటీర్‌ను ఏర్పాటుచేసినట్లు తేలడంతో చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

News March 23, 2024

కవితా కడిగిన ముత్యంలా బయటకు వస్తుంది: ఎంపీలు

image

ఎమ్మెల్సీ కవితపై తప్పుడు కేసుపెట్టి అక్రంగా అరెస్ట్ చేసారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఢీల్లీలో ఎంపీలు నామా, కే.ఆర్ సురేష్‌‌లతో కలిసి మీడియాతో మాట్లాడారు. లిక్కర్ కేసులో కవితా బాధితురాలని, నిందితురాలు కాదని వారు పేర్కొన్నారు. ఇన్ని రోజులు సాగదీసి, లోక్ సభ ఎన్నికలకు ముందు కేసును తెరపైకి తేవడం రాజకీయ కోణమన్నారు . తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని కడిగిన ముత్యంలా కవిత బయటకు వస్తుందన్నారు

News March 22, 2024

‘లే-అవుట్ల అనుమతులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి’

image

ఖమ్మం: టిఎస్‌ బిపాస్‌ విధానం ద్వారా నిర్మాణ అనుమతులు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నిర్ణీత సమయంలోగా ఆమోదించడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నందు జిల్లా స్థాయి లే అవుట్‌ అప్రూవల్‌ కమిటీ సమావేశాన్ని మున్సిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభితో కలిసి, కలెక్టర్ నిర్వహించారు. లే-అవుట్ల అనుమతులను నిర్ణీత గడువులోగా, నిబంధనల మేరకు పూర్తి చేయాలని పేర్కొన్నారు.

News March 22, 2024

ఖమ్మం లోకసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రసాద్ రెడ్డి.!

image

ఖమ్మం లోకసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఖరారు అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా లోకసభ టికెట్ ను ఆశిస్తున్న పలువురికి అధిష్ఠానం నచ్చజెప్పి ప్రసాద్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. అధిష్ఠానం నిర్ణయానికి పోటీలో ఉన్న మరో ఇద్దరు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కాగా ఖమ్మం అభ్యర్థిగా ప్రసాద్ రెడ్డి పేరును అధిష్టానం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

News March 22, 2024

కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేనికి హైకోర్టు నోటీసులు

image

కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు ఈరోజు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చారని, వారిపై వేర్వేరుగా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. కాగా ఈరోజు విచారించిన కోర్టు ఆ మేరకు నోటీసులు జారీ చేసింది. దీనిపై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.