Khammam

News March 22, 2024

వాహన తనిఖీల్లో భారీగా పట్టుబడ్డ గంజాయి

image

భద్రాచలం పట్టణంలోని వంతెన వద్ద స్థానిక పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో శుక్రవారం భారీగా గంజాయి పట్టుబడింది. అనుమానస్పదంగా ఉన్న వాహనాన్ని తనిఖీ చేయగా 67 కేజీల ఎండు గంజాయి దిండ్లు పట్టుబడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయిని, వాహనాన్ని పోలీసులు సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. గంజాయి విలువ సుమారు రూ.16.75లక్షలు ఉంటుందని తెలిపారు.

News March 22, 2024

ఖమ్మం: బీఆర్ఎస్ నుంచే నామా పోటీ

image

ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థిగా నాగేశ్వరరావు పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విషయం విదితమే. కాగా నామా పార్టీ మారతారని, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నుంచి బరిలో ఉంటారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దీనిపై నామా స్పందిస్తూ.. తాను బీఆర్ఎస్ నుంచే ఖమ్మం ఎన్నికల్లో బరిలో దిగుతానని పేర్కోన్నారు. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని నామా స్పష్టం చేశారు. రెండు రోజుల్లో నామా ఖమ్మం రానున్నారు.

News March 22, 2024

క్యాంప్ కార్యాలయం బోర్డు మార్చిన భద్రాచలం ఎమ్మెల్యే

image

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖాయం అయినట్లు తెలుస్తుంది. కాగా భద్రాచలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేసిఆర్‌తో ఉన్న బోర్డును తొలగించి, ఆయన ఒక్కరే ఉన్న ఫోటో ఫ్లెక్సీ బోర్డును అమర్చారు. బోర్డు మార్పుతో పార్టీ చేరిక ఖరారు అయినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డిని రెండుసార్లు కలిశారు.

News March 22, 2024

KMM: రూ.3,52,133 విలువైన సామగ్రి సీజ్‌

image

లోక్‌సభ ఎన్నికల షెడ్యుల్‌ విడుదలయ్యాక ఆధారాలు లేకుండా తరలిస్తున్న వివిధ రకాల సామగ్రిని సీజ్‌ చేసినట్లు నోడల్‌ అధికారి మురళీధర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో గురువారం నాటికి 56 కేసులు నమోదు కాగా రూ.3,52,133విలువైన సామగ్రి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఇందులో రూ.50,400 విలువైన పీడీఎస్‌ బియ్యం, రూ.72,464 విలువైన గంజాయి, రూ.2,29,269 విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

News March 22, 2024

ఖమ్మం: రైలు నుంచి పడి యువకుడు మృతి

image

ప్రమాదవశాత్తు రైలులో నుంచి కిందపడి ఓ గుర్తుతెలియని యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం మధిర రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. యువకుడి వయసు సుమారు 21 సంవత్సరాలు ఉంటుందని స్థానికులు తెలిపారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ సభ్యుల సహకారంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడి మృతదేహం వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లభించలేదని పోలీసులు తెలిపారు.

News March 22, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్రి, మిర్చి ధర

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ.20,200 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,400 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈ రోజు మిర్చి ధర రూ.100 పెరగగా, పత్తి ధర మాత్రం రూ.50 తగ్గినట్లు వ్యాపారస్తులు తెలిపారు. ప్రతి ఒక్కరూ మార్కెట్ నిబంధనలు పాటించాలని సూచించారు.

News March 22, 2024

ఖమ్మం: ఎలుకల మందుతాగి యువకుడు మృతి

image

ఎలుకల మందు తాగి చికిత్స పొందుతూ యువకుడు మరణించిన ఘటన ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంలో చోటుచేసుకుంది. బత్తిని నిఖిల్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. పెళ్లికి ఆ యువకి ససేమిరా అనడంతో మనస్తాపంతో వారం క్రితం ఎలుకల మందు తాగాడు. దీంతో తల్లిదండ్రులు ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లో నిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఈ ఉదయం మరణించాడు.

News March 22, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్య అంశాలు

image

∆} మ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల పర్యటన
∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాల అంతరాయం
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
∆} సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన

News March 22, 2024

ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిపై ఉత్కంఠ!

image

కాంగ్రెస్ పార్టీ నిన్న ప్రకటించిన రెండో జాబితాలో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి పేరు లేకపోవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న ఆశావహులు, ఎవరికి వారు టికెట్ తమకే అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. కాగా, కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News March 22, 2024

KMM: ఓటర్ కార్డుల పంపిణీ షురూ..

image

ఖమ్మం జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్ కార్డుల పంపిణీ ప్రక్రియను తపాలాశాఖ మొదలు పెట్టింది. ఐదు నియోజకవర్గాలలో మొత్తం 37 వేల కార్డులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఖమ్మం ప్రధాన తపాలా కార్యాలయానికి చేరిన కార్డులను స్పీడ్ పోస్ట్ ద్వారా అందించే కసరత్తును పోస్టల్ శాఖ ప్రారంభించింది.