India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మణుగూరులోని శివాజీనగర్కు చెందిన ఏలేంద్ర (53)కు నాలుగు నెలల కిందట బ్రెయిన్ స్ట్రోక్ రాగా చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. కోమాలోకి వెళ్లిన ఆమెను వివిధ ఆస్పత్రుల్లో చూపించినా ఫలితం రాలేదు. బ్రెయిన్ డెడ్ అయినందున అవయవాలు దానం చేయాలని జీవన్దాన్ ప్రతినిధులు సూచించారు. కుటుంబసభ్యుల అంగీకారం మేరకు ఏలేంద్ర కళ్లు, లివర్, గుండె, కిడ్నీలు సేకరించారు.

>వివిధ శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
>అశ్వరావుపేట నియోజకవర్గం లో ఎమ్మెల్యే జారే పర్యటన
>సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
>సీఎం సభ ఏర్పాట్లపై వైరా ఎమ్మెల్యే సమీక్ష సమావేశం
>పాల్వంచ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
>ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
>ఇల్లందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన

ఎవరి పని వారు చేసుకుంటూ పోతే ఎవరిని మందలించనని, ఏదైనా పనికోసం ప్రజలు అధికారుల వద్దకు వచ్చినప్పుడు నిర్లక్ష్యంగా వహిస్తే వారిని టార్గెట్ చేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆయా గ్రామ పంచాయతీ పరిధిలో వికలాంగుల, వృద్ధాప్య, వితంతు పెన్షన్కు అర్హులైన వారిని గుర్తించాలని, అనర్హులకు ఒకరికి కూడా పెన్షన్ ఇవ్వొద్దని చెప్పారు. త్వరలోనే గ్రామాల్లో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేస్తానన్నారు.

నిద్రలేచింది మొదలు.. పనిలో అధికారులు నిమగ్నం అవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఏ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆ గ్రామంలోనే నివాసం ఉండి పనిచేయాలని సోమవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో చెప్పారు. వ్యవసాయ శాఖ ఏఈవోలు కూడా వారు పనిచేసే క్లస్టర్ పరిధిలోనే నివాసం ఉండాలని సూచించారు. అలాగే గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గ్రామ కార్యదర్శులను అడిగి మంత్రి తెలుసుకున్నారు.

>ఖమ్మం: అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన
>కొత్తగూడెం: బాధితులకు సత్వర న్యాయం చేయాలి: ఎస్పీ
> కార్మికుల ప్రాణాలు విలువైనవి: సింగరేణి సీఎండీ
>కిన్నెరసాని అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: డిప్యూటీ సీఎం
>బూర్గంపహాడ్: ఆలయాన్ని అభివృద్ధి చేయాలని మంత్రికి వినతి
>ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
>ఖమ్మం: రోడ్డు ప్రమాదంలో ఎస్సైకు తీవ్రగాయాలు

సీతారామ ప్రాజెక్ట్ క్రెడిట్ తీసుకునేందుకు కాంగ్రెస్ మంత్రులు పోటీ పడుతున్నారని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. 30 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి హడావుడి చేసినట్టు సీతారామ ప్రాజెక్టు విషయంలో అదే జరుగుతుందన్నారు. కేసీఆర్ కలల ప్రాజెక్టు సీతారామ అని గుర్తు చేశారు.

చర్ల సరిహద్దులోని చత్తీశ్ గఢ్(S) కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధి దుబ్బమార్క వద్ద నక్సలైట్లు అమర్చిన ఐఈడి బాంబు పేలి ఓ ఆదివాసి మహిళ మృతి చెందింది. కవాసి సుక్కీ అనే ఆదివాసీ మహిళా రోజు మాదిరిగానే తన పశువులను మేపడానికి తన గ్రామం నుంచి, బయటకు వచ్చిన కొద్ది సేపటికే ఐఈడి పై కాలు వేయడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనపై కిష్టారం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

TGSRTC ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజినల్ మేనేజర్ సరి రామ్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉచిత బస్ పాస్ మేళ కొనసాగుతుందని డిపో ఆధికారులు తెలియజేశారు.. అన్ని డిపోల పరిధిలో ఉన్న మండలాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి బస్సు పాసులు జారీ చేస్తున్నారు. ఈనెల ఇప్పటివరకు 471 వికలాంగుల పాసులు, 291 ఉచిత స్టూడెంట్స్ పాసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

పాల్వంచ మండలంలో మూడు నెలల బాలుడికి తల్లిదండ్రులు పసరు మందు పోయడంతో చనిపోయాడు. బాధితుల కథనం ప్రకారం.. పాల్వంచ మండలం కోయగట్టుకి చెందిన పద్దం వీరభద్రం, పమ్మిడీలకు మూడు నెలల చిన్నారికి తీవ్రంగా ఆయాసం రావడంతో పసరు మందు తాగించారు. కొద్దిసేపటికి అతడి పరిస్థితి విషమించింది. దీంతో 108లో పాల్వంచ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అయితే, అప్పటికే చిన్నారి చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు.

నేలకొండపల్లి బౌద్ధ స్తూపం అభివృద్ధికి సంబంధించి జిల్లా అధికారులు సమగ్ర రిపోర్ట్ తయారు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బౌద్ధ స్తూపాన్ని బెస్ట్ ప్లేస్ కింద అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పారు. అభివృద్ధికి కావలసిన నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. నేలకొండపల్లి భక్తరామదాసు జన్మించిన స్థలం అని, మ్యూజియంగా భక్తరామదాసు మందిరం అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.