India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర విభజన నేపథ్యంలో భద్రాచలం నుంచి విడిపోయి ముంపు గ్రామాల పేరుతో ఆంధ్రలో విలీనమైన 5 పంచాయతీలు తిరిగి భద్రాచలంలో కలపాల్సిందే అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. కన్నాయిగూడెం, పిచ్చుకులపాడు , ఎటపాక, పురుషోత్తమ పట్నం, గుండాల పంచాయతీలు ముంపునకు గురి కావన్నారు. అయినా పోలవరం ముంపు పేరుతో ఆంధ్రాలో విలీనం చేశారని, ఆ పంచాయతీలను ఎప్పటికైనా భద్రాచలంలో కలపాల్సిందేనని స్పష్టం చేశారు.
TGSRTC ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజనల్ వ్యాప్తంగా ఈరోజు 13 మంది పదవీ విరమణ పొందారు. కండక్టర్, డ్రైవర్, ADC, DCగా ఆర్టీసీకి సేవ చేసినందుకు రీజనల్ మేనేజర్ వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. రిటైర్మెంట్ తర్వాత జీవితాన్ని సంతోషంగా గడపాలని వారందరికీ పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు.
చింతూరు మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలోని సీలేరు నదిలో శుక్రవారం సాయంత్రం ఓ బాలుడు గల్లంతైన విషయం తెలిసిందే. కాగా శనివారం మృతదేహం లభ్యమైంది. గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చిన సింకు(7) శుక్రవారం సీలేరు నదికి తోటి పిల్లలతో కలిసి వెళ్లి గల్లంతయ్యాడు. మృతదేహాన్ని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
వర్షాకాలం వ్యాధులు వ్యాపించే సమయం ఆసన్నమైందని , జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు ప్రణాళికలు తయారుచేసి అమలు చేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.మాలతి తెలిపారు. ఇప్పటికే జిల్లాలో రాఫిడ్ యాక్షన్ టీమ్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో మందుల కొరత లేదని అన్నారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
నేర విచారణలో జాప్యం వహిస్తే సహించేది లేదని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో నిర్వహించిన నెలవారీ సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. జులై ఒకటో తేదీ నుంచి అమలు కానున్న మూడు కొత్త క్రిమినల్ చట్టాల పట్ల పోలీసు శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
జూలూరుపాడు, ఏన్కూర్ మండలంలో సీతారామ ప్రాజెక్టుకు వ్యవసాయ భూములను కోల్పోయిన రైతులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. రైతు కుటుంబాల్లో నిరుద్యోగ యువతకు ప్రైవేట్ ఉద్యోగం వచ్చే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు.
ఖమ్మంలోని మయూరి లాడ్జిలో ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. మహబూబాబాద్ జిల్లా మర్రిపేటకు చెందిన ఎర్రసాని శ్రీనివాస్ రెడ్డి లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాస్ రెడ్డి ఫోటో గ్రాఫర్గా పనిచేస్తున్నాడు. సామాజిక కార్యకర్త అన్నం శ్రీనివాసరావు మృతదేహాన్ని ఖమ్మం ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
గుండెపోటుతో మరణించిన కాంగ్రెస్ సీనియర్ లీడర్ ధర్మపురి శ్రీనివాస్ పార్థివదేహానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం డీఎస్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదేవిధంగా డీఎస్ సేవలను డిప్యూటీ సీఎం కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు.
ఇల్లెందు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, వైస్ ఛైర్మన్ జానీ పాషా కొట్లాటకు దిగారు. పరస్పరం ఇరువురు నేతలు వ్యక్తిగత దూషణలకు దిగారు. దీంతో ఛైర్మన్ వర్సెస్ వైస్ ఛైర్మన్ వర్గాలుగా కౌన్సిలర్లు విడిపోయారు. కాగా ఈ ఘటన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సమక్షంలోనే జరిగింది. ఛైర్మన్, వైస్ ఛైర్మన్లను ఎమ్మెల్యే సముదాయించడంతో ఇరువురు శాంతించారు.
నేలకొండపల్లి మండల పరిధిలోని భైరవునిపల్లి సమీపంలోని వ్యవసాయ బావిలో విద్యుత్ మోటర్ను ట్రాక్టర్తో కట్టి లాగుతుండగా ప్రమాదవశాత్తు బావిలో పడింది. ట్రాక్టర్తో పాటు భార్యభర్తలు మాధవి, బాబు ఒక్కసారిగా బావిలో పడ్డారు. భర్త బాబు కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వారు అక్కడకు చేరుకొని వారిని బయటకు తీశారు. ఈ ఘటనలో భర్త క్షేమంగా బయటపడగా భార్య మాధవికి తీవ్రగాయాలయ్యాయి.
Sorry, no posts matched your criteria.