India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

దోస్తానా అంటే ఖమ్మం వాసులు ప్రాణమిస్తారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు వీడని బంధాలు నగరంలో కోకొల్లలు. ఆటపాటలతో పాటు ఆపదలోనూ తోడుంటూ కొండంత అండగా ఉంటారు. ఇక స్కూల్ దోస్తుల జ్ఞాపకాలు లైఫ్లాంగ్ గుర్తుండిపోతాయి. ఫెయిర్వెల్ పార్టీలో కన్నీరు కార్చిన మిత్రులెందరో. అటువంటి మిత్రుల కోసమే నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నారు. మరి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు..? Happy Friendship Day

BRS ఓటమికి ప్రధాన కారణం ధరణి పోర్టలేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. రైతులను నిలువునా ముంచిన ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామన్నారు. నాటి ముఖ్యమంత్రి KCR, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ మాత్రమే కూర్చొని ధరణి చట్టాన్ని అమల్లోకి తెచ్చి సంస్కరణలు తెచ్చామంటూ లక్షలాది మంది రైతులను ఇబ్బంది పెట్టారని విమర్శించారు. తాము అలా చేయబోమని, తమది రైతు ప్రభుత్వమని చెప్పారు.

>సీఎం పర్యటనలోపు పనులను పూర్తి చేయాలి: మంత్రి తుమ్మల
>వికలాంగుడి సమస్యను పరిష్కరించిన జిల్లా కలెక్టర్
>అటవీ శాఖ అభివృద్ధికి చిత్తశుద్ధితో పని
చేయాలి: పొదెం
>అభివృద్ధి పనులపై డిప్యూటీ సీఎం సమీక్ష
>రక్తంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిత్రం
>డ్రగ్స్, గంజాయిపై సమాచారం ఇవ్వండి: ఏఎస్పీ
>పాలేరు పాతకాలవకు నీళ్లు విడుదల చేసిన మంత్రి పొంగులేటి

ఆషాఢమాసం ముగిసి శ్రావణమాసం రానున్న తరుణంలో ఈ నెల 5 నుంచి పెళ్లిబాజాలు మోగనున్నాయి. దాదాపు 3 నెలల విరామం తర్వాత పెళ్లిళ్ల కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కళ్యాణ మండపాలను సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 5 నుంచి 31 వరకు వివాహాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. సెప్టెంబర్ నెల భాద్రపద మాసంలో ముహూర్తాలు లేవని, మళ్లీ అశ్వయుజ, కార్తీక, మార్గశిర మాసంలో ముహూర్తాలు ఉన్నాయని చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్ చిత్రాన్ని తన రక్తంతో గీసి ఓ వ్యక్తి అభిమానాన్ని చాటుకున్నాడు. ముదిగొండ మండలానికి చెందిన మాణిక్యం అఖిల్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కి వీరాభిమాని. ఈ చిత్రాన్ని గీయడానికి తనకు ఐదు గంటల సమయం పట్టిందని చెప్పారు. 5ML తన రక్తం అవసరమైందన్నారు. తన అభిమానాన్ని విభిన్నంగా తెలియజేయడానికి మాత్రమే ఇలా చిత్రం గీశానని ఆయన తెలిపారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో 1,070 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు ఐదుగురి చొప్పున మాస్టర్ ట్రైనర్లుగా ఆపరేటర్ల జాబితా తయారు చేసి పంచాయతీ అధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించారు. వీరు శిక్షణ పొందిన అనంతరం పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బందికి ఓటరు జాబితాపై అవగాహన కల్పిస్తారు.

ఖమ్మం జిల్లాలో పలు మార్కెట్లకు నూతన పాలకవర్గాన్ని నియమించడం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సత్తుపల్లి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్గా ఆనంద్ బాబు, వైస్ ఛైర్మన్ గా వెంకటప్ప రెడ్డి నియమితులయ్యారు. అటు కల్లూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్గా నీరజ, వైస్ ఛైర్మన్గా కోటేశ్వరరావుతో పాటు కమిటీ సభ్యులను నియమించినట్లు మంత్రి చెప్పారు. నూతన పాలకవర్గానికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

ఖమ్మం జిల్లాలో పలు మండలాలకు చెందిన సీడీపీఓలను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం రూరల్(M)(1)లో పనిచేస్తున్న శివమ్మ అదే మండలానికి, అటు ఖమ్మం రూరల్(M) (2) జయలక్ష్మి మణుగూరుకు, ఖమ్మం అర్బన్ కవిత మధిరకు, చండ్రుగొండ(M) నిర్మల జ్యోతి కల్లూరుకు, అశ్వారావుపేట(M) సరస్వతి తిరుమలాయపాలెంకు, బూర్గంపాడు(M) సలోమి చండ్రుగొండకు, తిరుమలాయపాలెం (M) కనకదుర్గ సత్తుపల్లికి బదిలీ అయ్యారు.

విద్యుత్ షాక్ గురై ఓ మహిళ మృతి చెందిన ఘటన ఖమ్మంలో శుక్రవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఖమ్మంకి చెందిన గోటం నాగలక్ష్మి ఓ కోచింగ్ సెంటర్లో ఆయాగా పనిచేస్తోంది. శుక్రవారం తన వద్ద తాళం చెవిని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్లో ఉన్న వారికి ఇచ్చేందుకు తాళాలు విసరగా అవి విద్యుత్ తీగలపై పడ్డాయి. వాటిని ఆమె ఇనుప రాడ్ ద్వారా తీస్తుండగా షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు రెండు రోజులు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. 27, 28న (శని, ఆదివారాలు) వారంతపు సెలవుల కారణంగా రెండు రోజులు మార్కెట్ బంద్ ఉంటుందన్నారు. తిరిగి సోమవారం నుంచి మార్కెట్లో పంట క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని ప్రకటించారు. రైతులు గమనించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.