Khammam

News June 28, 2024

KMM: సర్వీస్‌ గన్‌తో కాల్చుకొని జవాన్ సూసైడ్ అటెంప్ట్!

image

చర్ల సరిహద్దు ప్రాంతమైన రామ్‌పురంలో 15వ CAF బెటాలియన్‌కు చెందిన మనోజ్ దినకర్ అనే జవాన్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. జవాన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న మనోజ్ తన సర్వీస్ గన్‌తో కాల్చుకున్నాడు. గమనించిన తోటి సిబ్బంది అతడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. జవాన్ పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు.

News June 28, 2024

జేబీ శౌరి ఇంటికి వెళ్లిన డిప్యూటీ సీఎం, మంత్రులు

image

టీపీసీసీ సభ్యులు, రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ జేబి శౌరి ఇంటికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి వెళ్లారు. వారికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, కూనంనేని సాంబశివరావు, టీసీసీసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల, నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

News June 27, 2024

జేబీ శౌరి ఇంటికి వెళ్లిన డిప్యూటీ సీఎం, మంత్రులు

image

టీపీసీసీ సభ్యులు, రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ జేబి శౌరి ఇంటికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి వెళ్లారు. వారికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, కూనంనేని సాంబశివరావు, టీసీసీసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల, నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

News June 27, 2024

వరదలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన మంత్రి పొంగులేటి

image

భద్రాచలం వరదలపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోవు వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు చేపట్టాలని బాధితులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెంకట్రావు, జారి ఆదినారాయణ పాల్గొన్నారు.

News June 27, 2024

ఖమ్మం: కత్తులతో బెదిరించి మెడలో బంగారం చోరీ

image

కత్తులతో బెదిరించి మెడలో గొలుసును లాక్కొని వెళ్లిన ఘటన తిరుమలాయపాలెంలో మధ్యాహ్నం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన బాబురావు తన పామ్ ఆయిల్ తోటకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఇద్దరు ఆగంతకులు కత్తులతో బెదిరించి అతని మెడలో ఉన్న 2 తులాల చైను, 6 గ్రాముల బంగారు ఉంగరం ఎత్తుకుపోయారు. బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

News June 27, 2024

మంత్రి పొంగులేటి తనయుడి ఇంట్లో కస్టమ్స్ అధికారుల తనిఖీ

image

మంత్రి పొంగులేటి తనయుడు హర్షారెడ్డి ఇంట్లో  కష్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. హర్షారెడ్డి రూ.1.7 కోట్ల విలువైన వాచీలను కొనుగోలు చేస్తూ స్మగ్లింగ్ కేసులో చిక్కుకున్న విషయం తెలిసిందే. దాదాపు 6 గంటలపాటు తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. ఈ వాచీలను మహమ్మద్‌ ఫహెర్దీన్‌ ముబీన్‌ అనే వ్యక్తి హాంకాంగ్‌ నుంచి సింగపూర్‌ మీదుగా భారత్‌లోకి తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు.

News June 27, 2024

మళ్ళీ పెరిగిన పత్తి ధర… ఎంతంటే!

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,00 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,250 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర స్థిరంగా కొనసాగుతుండగా, పత్తి ధర మాత్రం రూ.50 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్ కు వచ్చే రైతులు నిబంధనలు పాటించాలని సూచించారు.

News June 27, 2024

‌ఇన్‌స్టాగ్రామ్‌లో యువతి మార్ఫింగ్ ఫొటోలు

image

‌ఇన్‌స్టాగ్రామ్‌లో యువతి ఫొటోలను పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్న యువకుడిని కల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ ఫణీందర్ వివరాలు.. కల్లూరు మండలం వెన్నవల్లికి చెందిన వెంకటకృష్ణ అదే గ్రామానికి చెందిన ఓ యువతి పేరు మీద ‌ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతా ఓపెన్ చేశాడు. అందులో ఆ యువతి మార్ఫింగ్ ఫొటోలను అప్లోడ్ చేసి బెదిరిస్తున్నాడు. యువతి ఫిర్యాదు మేరకు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

News June 27, 2024

630 కిలో మీటర్ల రహదారులు ధ్వంసం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని ఆర్‌అండ్‌బీ రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. దెబ్బతిన్న రహదారులపై జిల్లాల వారీగా నివేదికలు ఇవ్వాలని మంత్రి కోమటి రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో మొత్తం 630 కిలో మీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నట్లు నివేదించారు. మరమ్మతులకు మొత్తం రూ.236 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. సత్వరం మరమ్మతులు పూర్తిచేయాల్సిన ప్రాధాన్యాన్ని వారు వివరించారు.

News June 27, 2024

కార్డులు లేక 10 ఏళ్లుగా ప’రేషన్’

image

ఖమ్మం: కొత్తరేషన్ కార్డుల కోసం పేదకుటుంబాలు కళ్ళల్లో వత్తులేసుకొని ఎదురుచూస్తున్నారు. ప్రజాపాలనసభల్లో అత్యధికంగా కార్డుల కోసమే దరఖాస్తులు అందజేశారు. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి రేషన్‌
కార్డులు ఇవ్వలేదు. అంతకుముందు జారీచేసిన కార్డుల ఆధారంగానే ఆన్‌లైన్‌లో
వివరాలు నమోదు చేశారు. 2021లో జిల్లాలో 12,216 మందికి కొత్త రేషన్‌ కార్డులను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ తర్వాత మళ్లీఊసేలేదు.