India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం జిల్లాలో మెడికల్ కాలేజీకి భూమిని కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రఘునాథపాలెంలో 35ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించడం జరిగిందన్నారు. అధునాతన సౌకర్యాలతో అన్ని భవన నిర్మాణాలు సత్వరమే చేపట్టి, వచ్చే విద్యాసంవత్సరం నాటికి అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు.

ఖమ్మం: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను శుక్రవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శాలువలతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. సుదీర్ఘ కాలంగా వివిధ విభాగాలలో భాద్యతయుతమైన విధులు నిర్వహించి పోలీస్ శాఖకు ఎనలేని సేవలతో మన్ననలు పొందారని కొనియాడారు. రిటైర్మెంట్ తన వృత్తికే, కాని తన వ్యక్తిత్వానికి కాదని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.

∆}ధరణితో దగా చేశారు: మంత్రి పొంగులేటి
∆} ఆశ్రమ పాఠశాలలో అపరిశుభ్రతపై సిబ్బందిపై ఫైర్ అయిన ఐటీడీఏ పీవో
∆}భద్రాచలంలో రేపు, ఎల్లుండి మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్
∆}పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు: ఎమ్మెల్యే కూనంనేని
∆}సత్తుపల్లి: ఘోర రోడ్డు ప్రమాదం.. సీసీ ఫుటేజ్
∆}భద్రాద్రి:22 మంది బాల కార్మికులకు విముక్తి: ఎస్పీ రోహిత్

ధరణి పోర్టల్ ద్వారా మాజీ సీఎం కేసీఆర్ దగా చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో అన్నారు. ధరణితో రైతులు తీవ్రంగా నష్టపోయారని, ధరణి సమస్యలపై వేల అప్లికేషన్లు తమ దృష్టికి వచ్చాయని మండిపడ్డారు. ధరణి వచ్చాక ప్రతి గ్రామంలోనూ సమస్యలు ఏర్పడ్డాయని, వాటి పరిష్కారానికై రైతులు చెప్పులరిగేలా ఆఫీసర్ల చుట్టూ తిరిగారని విమర్శించారు.

ఈ నెల 18 నుంచి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి భద్రాచలం రోడ్ వరకు ఎక్స్ప్రెస్ రైలు సేవలు ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. 18న సికింద్రాబాద్ స్టేషన్ నుంచి సాయంత్రం 6.50 గంటలకు బయలుదేరి భద్రాచలం రోడ్డుకు ఉదయం 3.30 గంటలకు చేరుకోనుందన్నారు. పాత ప్యాసింజర్ స్థానంలో ఈ ఎక్స్ప్రెస్ నడుస్తుందని వెల్లడించారు.

DOST ద్వారా డిగ్రీలో ప్రవేశాలు పొందేందుకు స్పెషల్ ఫేజ్ షెడ్యూల్ విడుదలైంది. అయితే స్పెషల్ విడత ద్వారా రిజిస్ట్రేషన్కు గడువు నేటితో ముగియనుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు ఆగస్టు 3 వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని SR&BJNR ప్రిన్సిపల్ మహమ్మద్ జాకీరుల్లా తెలిపారు. ఈనెల 6న సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. సీట్ అలాట్ అయిన వారు ఆగస్టు 7 నుంచి 9 వరకు సెల్ఫ్ రిపోర్ట్ ఇవ్వడానికి అవకాశం కల్పించారు.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పత్తి, మిర్చి ధరలు క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.19,500 జండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,300 జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. మార్కెట్కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు. కాగా నిన్నటి కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర స్థిరంగా ఉండగా, పత్తి ధర మాత్రం 75 రూపాయలు పెరిగినట్లు తెలిపారు.

నాగార్జునసాగర్ జలాశయానికి 3.69 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 182.65 టీఎంసీలుగా ఉంది. ప్రవాహం పెరుగుతున్నందున ఇవాళ సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్ నుంచి మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, తుమ్మల, కోమటిరెడ్డి నీరు విడుదల చేయనున్నారు.

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మూత్రపిండ వ్యాధిగ్రస్థుల పరిస్థితి దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్టు తయారైంది. వేలాది మంది డయాలసిస్ బాధితులు ఉంటే.. ప్రభుత్వా ఆసుపత్రుల్లో పదుల సంఖ్యలో మాత్రమే పడకలు దర్శనమిస్తున్నాయి. రక్తం శుద్ధి చేసుకునేందుకు రోగులు నిరీక్షిస్తున్నారు. సర్కారు దవాఖానాల్లో మరిన్ని డయాలసిస్ పడకలు అందుబాటులోకి తీసుకురావాలని బాధితులు కోరుతున్నారు.

విద్యార్థులు శిక్షణను సద్వినియోగం
చేసుకుంటూ నైపుణ్యం మెరుగుపర్చుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. నగరంలోని ఐటీ హబ్ను సందర్శించిన ఆయన కంపెనీల కార్యకలాపాలపై ఆరా తీశారు. అనంతరం తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్, లెర్నెట్ స్కిల్స్ జనరేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఫుడ్ అండ్ బేవరేజ్(స్టీవార్డ్) నైపుణ్య శిక్షణ వివరాలు తెలుసుకున్నారు.
Sorry, no posts matched your criteria.