Khammam

News August 2, 2024

అంతర్జాతీయ ప్రమాణాలతో గురుకుల విద్యాలయం నిర్మాణం

image

రఘునాథఫాలెం మండలంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్వామి నారాయణ ట్రస్టు ఆధ్వర్యంలో గురుకుల విద్యాలయాన్ని నిర్మించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మండలంలో 13.07 ఎకరాల విస్తీర్ణంలో కేజీ నుంచి 12వ తరగతి వరకు గురుకుల విద్యాలయం నెలకొల్పడానికి మార్కెట్ ధరకు భూమిని కేటాయించినందుకు గాను సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. టెండర్లను పూర్తి చేసి త్వరలోనే పనులను ప్రారంభిస్తామన్నారు.

News August 2, 2024

సైబర్ బాధితులు గంటల వ్యవధిలోనే ఫిర్యాదు చేయాలి: సీపీ

image

ఖమ్మం: సైబర్ నేరాల ద్వారా సొమ్ము పోగొట్టుకున్న బాధితులు (గోల్డెన్ అవర్‌) గంట వ్యవధిలో 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. గురువారం పోలీస్ కాన్ఫరెన్స్ హల్లో పోలీస్ అధికారులతో జరిగిన నేర సమీక్ష సమావేశంలో సీపీ మాట్లాడారు. 1930 లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయడం ద్వారా దొంగిలించిన మొత్తాన్ని స్తంభింపజేసే అవకాశాలను గణనీయంగా పెంచుతుందని పేర్కొన్నారు.

News August 1, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ రోజు ముఖ్యాంశాలు

image

* సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన భద్రాద్రి జిల్లా ఎమ్మెల్యేలు
*గంజాయి అమ్మే వారికి ఖమ్మం జిల్లా కలెక్టర్ స్ట్రాంగ్ వార్నింగ్
*సత్తుపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
*భద్రాద్రి జిల్లాలో ముగ్గురు మావోయిస్టులు అరెస్ట్
*సుప్రీంకోర్టు తీర్పుతో జిల్లా వ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ నాయకులు సంబరాలు
*ఖమ్మం నగరంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

News August 1, 2024

రేపు సాయంత్రం 4గంటలకు నాగార్జున సాగర్ నీరు విడుదల

image

నాగార్జునసాగర్ జలాశయానికి 2.82 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. సాగర్​ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 532.5 అడుగులుగా ఉంది. నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటినిల్వ 172.87 టీఎంసీలుగా ఉంది. ప్రవాహం పెరుగుతున్నందున శుక్రవారం సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్ నుంచి మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, తుమ్మల, కోమటిరెడ్డి నీరు విడుదల చేయనున్నారు.

News August 1, 2024

సత్తుపల్లి రోడ్డు ప్రమాదం.. మృతులు వీరే

image

సత్తుపల్లి మండలం గంగారం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురు బైక్‌పై వెళ్తూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు రామగోవిందాపురానికి చెందిన బేతి సురేశ్(25), ముత్తిన వేణు (18), కరీముల్లా (12)గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News August 1, 2024

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

image

సత్తుపల్లి మండలం గంగారం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. ముగ్గురు వ్యక్తులు బైక్ పై వెళ్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 1, 2024

గోదావరిలో కొట్టుకు వచ్చిన గుర్తుతెలియని మృతదేహం

image

అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి సమీపంలోని గోదావరిలో గురువారం ఓ గుర్తు తెలియని మృతదేహం కొట్టుకు వచ్చిందని స్థానికులు తెలిపారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. అనంతరం మృతదేహాన్ని ఖననం చేశారు.

News August 1, 2024

అనారోగ్యంతో బయ్యారం ఎంపీడీవో మృతి

image

అనారోగ్యంతో మండల పరిషత్ అభివృద్ధి అధికారి మృతి చెందిన ఘటన గురువారం బయ్యారం మండలంలో చోటు చేసుకుంది. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న బెక్కంటి శ్రీనివాసరావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఎంపీడీవో మృతి పట్ల పలువురు ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు సంతాపం తెలిపారు.

News August 1, 2024

ఖమ్మం: రోడ్డు పక్కకు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

image

కారేపల్లి మండలం రావుజితండా గ్రామ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం. ప్రయాణికులతో వెళ్తున్న RTC బస్సు మూలమలుపు వద్ద, ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. లేకుంటే బోల్తా పడి ఉండేదని స్థానికులు చెప్పారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

News August 1, 2024

సూర్యాపేట హైవే వద్ద వంతెన మంజూరు

image

ఖమ్మం-సూర్యాపేట హైవే ఎంట్రీ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం మంజూరైనట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు టేకుమట్ల వద్ద సూర్యపేట వైపు కొద్ది దూరం వెళ్లి తిరిగి రావాల్సి వస్తుందని పేర్కొన్నారు. దీంతో సంభవిస్తున్న ప్రమాదాలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ ద్వారా తెలియజేయగా బ్లాక్ స్పాట్‌గా గుర్తించి ఫ్లైఓవర్ మంజూరుకు అనుమతి ఇచ్చారని పేర్కొన్నారు.