Khammam

News November 12, 2024

ఖమ్మం మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం

image

ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. రామసహాయం రాధికను ఒహాయో రాష్ట్ర మైనార్టీ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ అడ్వైజరీ బోర్డు సలహాదారుగా ఆ రాష్ట్ర గవర్నర్ మైక్ డివైన్ నియమించారు. కైకొండాయిగూడెంకు చెందిన రామసహాయం నిర్మల, బుచ్చిరెడ్డి కూతురు రాధిక. వివాహం అనంతరం ఉద్యోగరీత్యా వారు అమెరికాలో స్థిరపడ్డారు. ఆమె చేసిన సేవాలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు.

News November 12, 2024

4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కృషి చేస్తున్నాం: మంత్రి

image

4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం చిన్న వెంకటగిరిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి పొంగులేటి పలువురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

News November 12, 2024

మహిళలు ఆర్థికంగా ముందుకు వెళ్లాలి: జిల్లా కలెక్టర్

image

మహిళలు నాణ్యత, నమ్మకమే బ్రాండ్‌గా వ్యాపారంలో రాణించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో ఉన్న ఇందిర మహిళా శక్తి క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సందర్శించారు. నలుగురు మహిళలు గ్రూప్‌గా క్యాంటీన్‌ని నిర్వహిస్తున్న నిర్వాహకురాలను పలుకరిస్తూ వ్యాపారం సాఫిగా సాగుతుందా? సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు.

News November 11, 2024

జిల్లాలో తొలి బయోమైనింగ్ కేంద్రం ప్రారంభం

image

ఇల్లెందు మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన బయోమైనింగ్ కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే కనకయ్య, మున్సిపల్ ఛైర్మన్ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. జిల్లాలోనే తొలి బయో మైనింగ్ కేంద్రం ఇల్లెందులో ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్లో డంపింగ్ చేసి గుట్టల గుట్టలుగా పెరిగిపోయిన చెత్తను రీసైక్లింగ్ చేసి కాలుష్యం కాకుండా పర్యావరణాన్ని కాపాడేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.

News November 11, 2024

కేటీఆర్ ఎవరి కాళ్లు మొక్కేందుకు ఢిల్లీ వెళ్లారు?: పొంగులేటి

image

KTR ఎవరి కాళ్లు మొక్కేందుకు ఢిల్లీ వెళ్లారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో కేంద్రం పెద్దలను ఒప్పించి తన చెల్లికి బెయిల్ ఇప్పించినట్లే తనను తాను కాపాడుకునేందుకు ఢిల్లీ పెద్దలను కలిసేందుకు వెళ్లారని విమర్శించారు. ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహణకు విదేశాల్లోని సంస్థలకు రూ.55 కోట్లను ఏ విధంగా మళ్లించారని ప్రశ్నించారు. తాను పేల్చబోయే బాంబేదో కేటీఆర్‌కు తెలుసని చెప్పారు. 

News November 11, 2024

KMM: ప్రేమ పేరుతో మోసం.. MLA వద్దకు యువతి

image

ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడిపై చర్యలు తీసుకోవాలని గార్ల మండలంలోని పెద్ద కిష్టాపురంకి చెందిన భూక్య సంగీత సోమవారం ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యను వేడుకుంది. ముల్కనూరులో సీసీ రోడ్డు పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన MLAను కలిసి వినతి పత్రం అందజేసింది. పెద్దకిష్టాపురానికి చెందిన శ్రీకాంత్ తనను మోసం చేసినట్లు పేర్కొంది. ఈ విషయమై PSలో ఫిర్యాదు చేశానని, న్యాయం చేయాలని MLAని కోరింది.

News November 11, 2024

ఖమ్మం జిల్లాలో ముమ్మరంగా కుటుంబ సర్వే

image

ఖమ్మం జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే ముమ్మరంగా జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా 5,71,240 లక్షల ఇళ్లు ఉండగా ఆదివారం నాటికి 30,616 ఇళ్లు మాత్రమే సర్వే చేశారు. జిల్లాలో 4,118 బ్లాక్‌లుగా విభజించగా ప్రస్తుతం 3,150 బ్లాక్‌లలో సర్వే జరుగుతుంది. 75 ప్రశ్నలతో కూడిన ఫామ్‌ను నింపడానికి దాదాపు 30 నిమిషాలు పడుతున్నట్లు తెలుస్తొంది.

News November 11, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శివాలయాల్లో ప్రత్యేక పూజలు ∆} వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News November 11, 2024

60 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో కాంగ్రెస్ కమిటీ ఎన్నిక

image

ఖమ్మంలోని తెల్దారుపల్లిలో దాదాపు 60ఏళ్లకు సీపీఎం నాయకత్వాన్ని కోల్పోయింది. తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2019తర్వాత సీపీఎంపై తిరుగుబాటు ఎగురవేసిన తమ్మినేని కృష్ణయ్య ఆయన భార్యను ఎంపీటీసీగా గెలిపించుకున్నారు. ఆ తర్వాత పరిణామాలతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కృష్ణయ్య కుమారుడు కాంగ్రెస్‌లో చేరారు. ఈ క్రమంలో పార్టీ గ్రామకమిటీని ఇటీవల ఎన్నుకున్నారు.

News November 11, 2024

పాల్వంచ: సర్వేను పగడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఎన్యూమరేటర్లను ఆదేశించారు. ఆదివారం జిల్లా కలెక్టర్ పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని బొల్లోరిగూడెం 11వ వార్డులో పర్యటించారు. సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేను పర్యవేక్షించి వివరాల సేకరణలో ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అని ఎన్యూమరేటర్లను అడిగి తెలుసుకున్నారు. ఇబ్బందులు ఉంటే సూపర్‌వైజర్లకు తెలపాలని అన్నారు.