India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఓటర్ సర్వే
∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} అశ్వాపురంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} భద్రాచలంలో ఎమ్మెల్యే వెంకట్రావు పర్యటన
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన

కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని జంగారెడ్డిగూడెం రహదారిలో మల్లికార్జునరావు ఇంట్లో తాచుపాము కలకలం సృష్టించింది. వంట గదిలో పాము ఉండటంతో ఇంట్లో వారు భయాందోళనకు గురయ్యారు. దాదాపు రెండు గంటల పాటు అది అక్కడే ఉండటంతో స్థానికులు అటవీశాఖ FBO సురేశ్కు సమాచారం ఇవ్వడంతో ఆయన పాములు పట్టే వ్యక్తి ప్రదీప్ను పిలిపించి దానిని బంధించి అటవీ ప్రాంతంలో వదిలేశారు.

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎరువుల పరిస్థితిపై అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో వానాకాలానికి అంచనా వేసిన ఎరువులు, అందుబాటులో ఉన్న ఎరువుల లభ్యతపై మంత్రికి అధికారులు వివరించారు. 10,41,000 టన్నుల యూరియా, 240 లక్షల టన్నుల DAP, 10 లక్షల టన్నుల కాంప్లెక్స్ 0.60 లక్షల టన్నుల MOP అవసరమవుతాయని అంచనా వేశారు. రైతులకు సక్రమంగా ఎరువులు అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి శనివారం హైదరాబాద్లోని రాజ్ భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. తన తండ్రి, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డితో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా.. ఆధ్యాత్మికం, పర్యాటకంగా ప్రసిద్ధి చెందిందని తెలిపారు. ఇటు ఖమ్మం ఖిల్లా, దక్షిణ ఆసియాలోనే పెద్దదైన బౌద్ధ స్తూపం గురించి వివరించారు.

ఖమ్మం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ను ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రితో డిప్యూటీ సీఎం చర్చించారు. అలాగే పలు అంశాలపై కేంద్రమంత్రితో డిప్యూటీ సీఎం సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని పేర్కొన్నారు.

పాల్వంచ నవభారత్ మైనింగ్ కళాశాల వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ముందు వెళ్తున్న ఓ లారీ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వస్తున్న ఓ లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అంగన్వాడి కేంద్రాల్లో దోపిడీ నిర్లక్ష్యం లాంటివి చేస్తే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే మట్ట రాగమయి అన్నారు. శనివారం కొండ్రుగట్లలో అంగన్వాడి కేంద్రాన్ని, పల్లె దవాఖానను ఎమ్మెల్యే సందర్శించి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు అంగన్వాడీ సిబ్బంది పౌష్టికాహారం అందించాలని సూచించారు. అలాగే పల్లె దవాఖానాలు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని వైద్యులను ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అందిస్తున్న ప్రగతి చక్ర అవార్డు కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి ఆర్టీసీ డిపోకి ఉత్తమ మొదటి డిపో అవార్డు దక్కింది. ఈరోజు హైదరాబాద్లో జరిగిన అవార్డ్స్ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ MD సజ్జనార్ చేతుల మీదుగా రూ.3 లక్షల క్యాష్ అవార్డును సత్తుపల్లి డిపో మేనేజర్ U.రాజ్యలక్ష్మీ ఈ అవార్డును అందుకున్నారు.

ఖమ్మం జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికలు వాయిదా పడతాయని భావిస్తున్న తరుణంలో పంచాయతీ ఓటర్ల ముసాయిదా షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో పల్లెల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ మద్దతుదారులతో పాటు వనరుల సమీకరణలో నిమగ్నమయ్యారు. ఖమ్మం జిల్లాలో 589 గ్రామ పంచాయతీల్లోని 5389 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది.

రెండు లక్షల లోపు రుణం ఉండి అన్ని వివరాలు సక్రమంగా ఉన్నా రుణమాఫీకి నోచుకోని రైతుల కోసం త్వరలో ఒక మొబైల్ యాప్ తీసుకొస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. రెండు లక్షల వరకు రుణం తీసుకున్నప్పటికీ మాఫీ కానీ 4,24,873 మంది రైతుల ఖాతాల వివరాలను సేకరించనున్నామని వీటిని మొబైల్ యాప్ లో అప్లోడ్ చేయనున్నట్లు మంత్రి తెలిపారు . వ్యవసాయ అధికారులు రైతుల వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తారు.
Sorry, no posts matched your criteria.