Khammam

News November 4, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్య అంశాలు

image

∆} ఖమ్మం:వారికి రెండో ప్రాధాన్యతలో ఇల్లు ఇస్తాం: మంత్రి పొంగులేటి ∆}భద్రాచలం: పవిత్ర గోదావరి నదిలో భక్తుల పుణ్యస్నానాలు∆}ఖమ్మం: కారు- బైక్ ఢీకొని యువకుడు మృతి∆} దమ్మపేట:వ్యవసాయ క్షేత్రంలో మంత్రి తుమ్మల∆}భద్రాచలం: రూ. 3 కోట్ల గంజాయి దహనం చేసిన అధికారులు∆}కొత్తగూడెం: క్లినిక్ సీజ్ చేసిన వైద్యాధికారులు∆}గిరిజన సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: మంత్రి సీతక్క

News November 4, 2024

రేపటి బిసి కమీషన్ బహిరంగ విచారణ వాయిదా: కలెక్టర్

image

ఖమ్మం కలెక్టరేట్లో మంగళవారం తెలంగాణ బిసి కమీషన్ నిర్వహించనున్న ఉమ్మడి జిల్లాల బహిరంగ విచారణ అనివార్య పరిస్థితుల కారణంగా ప్రభుత్వం వాయిదా పడిందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఈ విషయాన్ని తెలియజేయడం జరిగిందని చెప్పారు. ఈ విషయాన్ని ఉమ్మడి జిల్లాలోని ప్రజలు గమనించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

News November 4, 2024

రేపటి బిసి కమీషన్ బహిరంగ విచారణ వాయిదా: కలెక్టర్

image

ఖమ్మం కలెక్టరేట్లో మంగళవారం తెలంగాణ బిసి కమీషన్ నిర్వహించనున్న ఉమ్మడి జిల్లాల బహిరంగ విచారణ అనివార్య పరిస్థితుల కారణంగా ప్రభుత్వం వాయిదా పడిందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఈ విషయాన్ని తెలియజేయడం జరిగిందని చెప్పారు. ఈ విషయాన్ని ఉమ్మడి జిల్లాలోని ప్రజలు గమనించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

News November 4, 2024

వ్యవసాయ క్షేత్రంలో మంత్రి తుమ్మల

image

పాలన, పార్టీ కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉండే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన స్వగ్రామమైన దమ్మపేట మండలం గండుగులపల్లిలోని తమ వ్యవసాయ క్షేత్రంలో సోమవారం ఉదయం కాసేపు గడిపారు. పచ్చని పంట పొల్లాల్లో కలియ తిరుగుతూ ప్రకృతిని ఆస్వాదించారు. ఆయిల్‌ పామ్‌ సాగులో ఇంకా తీసుకోవాల్సిన చర్యలు, సస్య రక్షణ పద్ధతుల గురించి కూలీలతో చర్చించారు.

News November 4, 2024

రెండు రోజుల్లో ఇంద్రిరమ్మ ఇళ్ల ప్రక్రియ ప్రారంభం: పొంగులేటి

image

మరో రెండు రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ మొదలవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీలకు, కులాలకు అతీతంగా గ్రామ సభలు పెట్టి అర్హులైన పేదలకు ఇళ్లు నిర్మించే కార్యక్రమం చేపడతామని చెప్పారు. గత BRS ప్రభుత్వంలో పింక్ కలర్ చొక్కా వేసుకున్న వాళ్లకే స్కీములు ఇచ్చారని అన్నారు. అర్హులైన వారు ఏ పార్టీలో ఉన్నా ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.

News November 4, 2024

ఖమ్మం: కారు-బైక్ ఢీకొని యువకుడు మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఖమ్మం రూరల్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాచిరాజుగూడెంకు చెందిన సాయి(22) తన బైక్‌పై ఆదివారం రాత్రి ఖమ్మం నుంచి ఇంటికి వస్తుండగా ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో సాయికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన సాయిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. సాయి మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News November 4, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి వార్త సమాచారం

image

☆ ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టరేట్లో నేడు ప్రజావాణి కార్యక్రమం ☆ ఖమ్మంలో నేడు మంత్రి తుమ్మల పర్యటన ☆ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నేడు పునః ప్రారంభం ☆ తిరుమలాయపాలెం కాంగ్రెస్ నేతలతో నేడు మంత్రి పొంగులేటి సమావేశం ☆ కారేపల్లిలో నేడు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ☆ భద్రాచలం ఐటిడిఏలో నేడు గిరిజన దర్బార్ కార్యక్రమం ☆ ఉమ్మడి జిల్లాలో నేడు కార్తీక మాసం మొదటి సోమవారం వేడుకలు

News November 4, 2024

నేడు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పునః ప్రారంభం

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం నుంచి క్రయవిక్రయాలు పునః ప్రారంభం కానున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. వరుసగా నాలుగు రోజుల సెలవులు అనంతరం సోమవారం మార్కెట్ ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ విషయాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగ సోదరులు గమనించి తమ పంటలను మార్కెట్‌కు తీసుకువచ్చి అమ్మకాలు జరపాలని అధికారులు పేర్కొన్నారు.

News November 3, 2024

భద్రాద్రి రామయ్యకు సువర్ణ పుష్పార్చన

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో ఆదివారం స్వామివారికి అర్చకులు సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. ఉదయం 4 గంటలకే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.

News November 3, 2024

ప్రభుత్వాల తలరాత మార్చే శక్తి ఉద్యోగులకు, ఉద్యోగ సంఘాలకు ఉంది: తుమ్మల

image

ప్రభుత్వాల తలరాత మార్చే శక్తి ఉద్యోగులకు, ఉద్యోగ సంఘాలకు ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఖమ్మం నగరంలో ఉద్యోగుల జేఏసీ సెక్రటరీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన వన సమారాధన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ప్రజా ప్రభుత్వంలో ఉద్యోగులు భాగస్వాములు కావాలని కోరారు. రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులదే కీలకపాత్ర అని పేర్కొన్నారు.