India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

హైదరాబాద్ పంజాగుట్టలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మణుగూరు బీటీపీఎస్కు చెందిన ఎస్పీఎఫ్ ఎస్సై శంకర్ రావు కూతురు ప్రసన్న మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్సై శంకర్ రావు తన కూతురు ప్రసన్నతో కలిసి బైక్పై వెళ్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎస్సై శంకర్రావు గాయాలతో బయటపడగా, ప్రసన్నకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. గత ఫిబ్రవరి నెలలో సర్పంచుల పదవీకాలం ముగియగా, నాటి నుంచి గ్రామ సచివాలయాల పరిపాలన ప్రత్యేక అధికారుల చేతిలోకి వెళ్ళింది. లోకసభ ఎన్నికలు పూర్తికాగానే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతుందని అందరూ ఊహించారు. అయితే బిసి జనాభా బీసీ గణన పూర్తయిన తర్వాతే ఎన్నికల నిర్వహిస్తారని సంకేతాలు రావడంతో ఆశావాహుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.

హైదరాబాదులో చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఏర్పాటు చేసిన “హైడ్రా” మంచిదేనని, అయితే పేద ప్రజల జోలికి వెళ్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. అక్రమార్కులపై కొరడా ఝళిపించాలన్నారు. ఆ భూములను ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలన్నారు.

∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} కొత్తగూడెంలో ఎమ్మెల్యే సాంబశివరావు పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు
∆} అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే పర్యటన
∆} అన్నపురెడ్డిపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అనేక మార్పులు జరగనున్నాయి. కొత్తగా మధిర డివిజన్ ఏర్పాటుతో పాటు పలు స్టేషన్ల డివిజన్లను మార్చనున్నారు. ఖమ్మం గ్రామీణంలోని పెద్దతండా పంచాయతీ కేంద్రంగా మున్సిపాలిటీ ఏర్పాటుకు ప్రతిపాదనకు రంగం సిద్ధమైంది. దీనికి అనుగుణంగా ఎం. వెంకటాయపాలెం, తిరుమలాయపాలెం మండలం సుబ్లేడులో ఇన్ స్పెక్టర్ స్థాయి కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ గ్లోబల్ లీడర్ అని ఆయన అవలంభిస్తున్న విధానాల పట్ల అగ్ర దేశాలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నాయని బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఖమ్మంలోని ఓ హోటల్లో ఆదివారం ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ హాజరయ్యారు.

రిజిస్ట్రేషన్ శాఖకు శాశ్వత భవనాలను త్వరలోనే ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రిజిస్ట్రేషన్ & స్టాంపింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులు పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. రెండేళ్లలో శాశ్వత భవనాలలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు జరుగుతాయని తెలిపారు.

HYDలో ఆదివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎన్ఎండీసీ మారథాన్లో మద్దులపల్లికి చెందిన కానిస్టేబుళ్లు రేగళ్ల గోపీ, బీరెల్లి లక్ష్మీ దంపతులు గోల్డ్ మెడల్ సాధించారు. గోపీ 42.2 కిలోమీటర్ల పరుగు పందెంలో 4.17 ని.ల్లో విజయం సాధించగా, లక్ష్మీ 21.1 కి.మీ రేంజ్లో 2.38 ని.ల సమయంలో గమ్యం చేరుకుని విజయం సాధించారు. గోపీ గన్ మెన్గా, లక్ష్మీ తిరుమలాయపాలెం PSలో రిసెప్షనిస్ట్గా పని చేస్తున్నారు.

ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఖమ్మం జిల్లాల్లో పక్కదారి పట్టినట్లు సీఐడీ తెలిపింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని పలు ప్రైవేటు ఆసుపత్రుల పేరిట నకిలీ బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసినట్లు సీఐడీ గుర్తించింది. ఈ నెల 23న ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. త్వరలోనే కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు సిఐడి అధికారులు తెలిపారు.

సీతారాం ప్రాజెక్టు కాలువలో పడి ఇద్దరు మృతి చెందిన ఘటన ఆదివారం బూర్గంపాడు మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. జింకలగూడెం సీతారాం ప్రాజెక్టు కాలువలో ఇద్దరు గల్లంతయ్యారని సమాచారం అందుకున్న ఎస్సై రాజేశ్ గజ ఈతగాళ్లతో గాలించి మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరు ప్రమాదవశాత్తు పడిపోయారా? లేక ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.