Khammam

News June 25, 2024

కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీలు..!

image

ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ లు సోమవారం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు పలు సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీలు పేర్కొన్నారు.

News June 24, 2024

భద్రాద్రి: మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. సారపాక గాంధీనగర్‌లో మూడేళ్ల చిన్నారిపై ఓ దుండగుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 24, 2024

సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు.. కరెక్టింగ్ మాస్టర్: మంత్రి

image

సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు.. కరెక్టింగ్ మాస్టర్ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తమ ప్రభుత్వం దుబారా ఖర్చులకు దూరంగా ఉంటూ సంక్షేమ పథకాలను అమలుచేస్తుందన్నారు. కష్టాల్లో ఉన్న రైతాంగానికి భరోసా ఇచ్చి వారి పురోగతికి తోడ్పడటమే కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.

News June 24, 2024

ఖమ్మం: ఇంటర్ సెకండియర్‌ సప్లిమెంటరీ ఫలితాలిలా..

image

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. సెకండియర్‌లో ఖమ్మం జిల్లాలో 653మంది హాజరవగా319 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 48.85గా ఉంది. భద్రాద్రి జిల్లాలో 494మంది పరీక్ష రాయగా 230మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 46.56గా ఉంది.

News June 24, 2024

ఖమ్మం: ఇంటర్ సెకండియర్‌ సప్లిమెంటరీ ఫలితాలిలా..

image

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. సెకండియర్‌లో ఖమ్మం జిల్లాలో 653మంది హాజరవగా319 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 48.85గా ఉంది. భద్రాద్రి జిల్లాలో 494మంది పరీక్ష రాయగా 230మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 46.56గా ఉంది.

News June 24, 2024

ఖమ్మం : ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలిలా..

image

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్టియర్ లో ఖమ్మం జిల్లాలో 9,950 మంది హాజరవగా 6,679 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 67.13గా ఉంది. భద్రాద్రి జిల్లాలో 4,716 మంది పరీక్ష రాయగా 3,027 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 59.41గా ఉంది.

News June 24, 2024

ఖమ్మం కార్పొరేషన్ నూతన కమిషనర్‌గా అభిషేక్ అగస్త్య

image

ఖమ్మం కార్పొరేషన్ నూతన కమిషనర్ గా అభిషేక్ అగస్త్య(IAS)ను నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 సివిల్స్ బ్యాచ్‌‌‌కు చెందిన అభిషేక్ అగస్త్య 38 ర్యాంకుతో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. అభిషేక్ అగస్త్య స్వస్థలం జమ్మూకశ్మీర్. ప్రస్తుతం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అడిషనల్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తూ బదిలీపై ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ గా రానున్నారు.

News June 24, 2024

మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ తలదించుకునే అంశం: భట్టి

image

నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన చెంచు గిరిజన మహిళ ఈశ్వరమ్మపై జరిగిన అత్యాచారం ఘటన అమానవీయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం ఉదయం నిమ్స్ ఆస్పత్రిలో బాధితురాలు ఈశ్వరమ్మను, కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మంత్రి జూపల్లితో కలిసి మాట్లాడారు. ఘటనలో పూర్తి సమాచారం సేకరించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

News June 24, 2024

వ్యవసాయ పనుల్లో నిమగ్నం

image

రుతు పవనాలకు తోడు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆలస్యంగా కురుస్తున్న వర్షాలతో ఖరీఫ్ పనులు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే పొలాల దుక్కులు చదును చేసి విత్తనం నాటేందుకు సిద్ధంగా ఉన్న రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే 1,18,286 ఎకరాల్లో పత్తి విత్తనాలు వేయగా, నీటి వసతులు ఉన్న చోట్ల 8,512 ఎకరాల్లో వరి నాట్లు వేశారు.

News June 24, 2024

రామప్ప ఆలయాన్ని సందర్శించిన కిడాంబి శ్రీకాంత్

image

వెంకటాపురంలో ప్రపంచ ప్రసిద్ధి పొందిన రామప్ప ఆలయాన్ని అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ ఆదివారం సందర్శించారు. ఆలయ విశేషాలను గురించి అక్కడి టూరిజం గైడ్ గోరంట్ల విజయకుమార్ ద్వారా తెలుసుకున్నారు. అనంతరం ఆలయ చారిత్రక కట్టడం గురించి ప్రశంసించారు.