India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖానాపురం హవేలి PSలో ఓ వివాహిత శనివారం హల్చల్ చేసింది. AR కానిస్టేబుల్తో తన భార్యకు సంబంధం ఉందని ఆమె భర్త ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా యువతిని స్టేషన్కు పిలిపించి నోటీసు ఇచ్చేందుకు ప్రయత్నించగా, నోటీసులు తీసుకోవడానికి నిరాకరించింది. కానిస్టేబుల్తో ఉన్న ఫొటోలు తనవి కావని, మార్ఫింగ్ చేశారంటూ గొడవకు దిగింది. పెట్రోలు పట్టుకుని వచ్చి బెదిరించింది.
> పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన
> కొత్తగూడెంలో ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి పర్యటన
> వెంకటాపురంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
> సత్తుపల్లి సింగరేణి ఏరియాల్లో ఉచిత వైద్య శిబిరం
> నేలకొండపల్లిలో సీపీఎం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
> బయ్యారంలో ఎంపీ పోరిక బలరాం నాయక్ ఆత్మీయ సమ్మేళనం
> మధిరలో సీపీఎం పార్టీ జిల్లా శిక్షణ తరగతులు
> అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే పర్యటన
ఖమ్మం: బీఆర్ఎస్ని బీజేపీ పార్టీలో విలీనం చేస్తున్నారని వస్తున్న వార్తలు అవాస్తవమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా వస్తున్న ఇటువంటి వార్తలను తాను ఖండిస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీలో కలుస్తుందన్న వార్తలు ఊహాజనితమైనవన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్పై బురద జల్లుతున్నాయని మండిపడ్డారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీలు నిధుల లేమితో తలడిల్లుతున్నాయి. ఏడాదిగా రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు, ఆరు నెలలుగా 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడం లేదు. పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసిన వెంటనే ఫిబ్రవరి నుండి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతూ ఉంది. నిధుల కొరతతో పల్లెల బాగోగులు ప్రత్యేక అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.
ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో అక్రమంగా డబల్ పెన్షన్లు తీసుకుంటున్న వారిని అధికారులు గుర్తించారు. ఇటీవల చేపట్టిన సర్వేలో డబల్ పెన్షన్ తీసుకుంటున్న 427 మందిని అధికారులు గుర్తించి నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ ఖజానాను గండి కొడుతూ అక్రమంగా డబల్ పెన్షన్లు తీసుకున్న వారు నగదును తిరిగి చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే అనర్హుల జాబితాను అధికారులు ప్రభుత్వానికి పంపించారు.
స్టాఫ్ నర్స్ నిర్లక్ష్యంతో ఓ గర్భిణి పురిటిలో శిశుమృతి చెందిన ఘటన శనివారం తల్లాడ మండలంలో జరిగింది. మల్లారంకి చెందిన గర్భిణి లావణ్యకు పురిటి నొప్పులు రావడంతో శుక్రవారం PHCకి భర్త తీసుకెళ్లాడు. వైద్యాధికారి అందుబాటులో లేకపోవడంతో స్టాఫ్ నర్స్ను డెలివరీ చేయాలని భర్త కోరారు. దీంతో నర్సు సెల్ ఫోన్లో రీల్స్ చూస్తూ నిర్లక్ష్యం వహించింది. శిశువు కడుపులో ఉమ్మ నీరుతాగి మరణించింది.
భద్రాచలం వద్ద గోదావరి నదిపై నిర్మించిన పాత వంతెన నేటితో 59 సంవత్సరాల కాలం పూర్తి చేసుకొని 60వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. ఈ వంతెనను 1965 జులై 13న ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రారంభించారు. డాక్టర్ నీలం సంజీవరెడ్డి 1959లో శంకుస్థాపన చేయగా రూ.70 లక్షల వ్యయంతో ముంబైకి చెందిన పటేల్ ఇంజినీరింగ్ కంపెనీ 1965లో పూర్తి చేసింది. నేటికీ చెక్కుచెదరకుండా ఉంది.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో శనివారం స్వామివారికి సువర్ణ తులసి అర్చన నిర్వహించారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.
నెహ్రూనగర్కు చెందిన దుర్గారావు జీవనోపాధి వెతుక్కుంటూ ఇరవై ఏళ్ల క్రితం చర్ల మండల కేంద్రానికి వెళ్లారు. సతీమణి మాధవి గతేడాది అనారోగ్యంతో మృతిచెందింది. తన జీవిత భాగస్వామి ఎంతో ఇష్టంగా పెంచుకునే శునకాలను అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. ఒక్క క్షణమైనా వాటిని వీడి ఉండొద్దన్న తలంపుతో ఎటు వెళ్లినా తన వెంటే తీసుకెళ్తున్నారు. అందుకోసం ద్విచక్రవాహనానికి ఇరువైపు రెండు ఇనుప తొట్లు ఏర్పాటు చేశారు.
ఆధార్ కార్డు అప్డేట్ చేస్తానని నగదు దోచుకెళ్లిన ఘటన చింతకాని మండలంలో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతకాని మండలం రామకృష్ణాపురం గ్రామంలో ఓ వ్యక్తి ఆధార్ కార్డు అప్డేట్ చేస్తానని వేలిముద్రలు ద్వారా తమ బ్యాంక్ అకౌంట్లో నగదును స్వాహా చేశాడని ఆలస్యంగా గ్రహించి బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Sorry, no posts matched your criteria.