India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 52 అడుగులకు చేరింది. మూడో ప్రమాద హెచ్చరికకు వరద నీరు దగ్గరగా రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే భద్రాచలంలోని పలు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. భద్రాచలంలోని నన్నపనేని హైస్కూల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మళ్లీ ఎన్నికల కోలాహలం మొదలుకానుంది. ఆగస్టులో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో ఆశావహుల్లో సందడి నెలకొంది. బీసీ రిజర్వేషన్లపై కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలని సూచించారు. పాత రిజర్వేషన్లు మార్చొద్దని చెప్పడంతో, కొత్తగా ఎలా చేర్చుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 1,054 గ్రామ పంచాయతీలున్నాయి.

గుండెపోటుతో ఏఎస్ఐ మృతి చెందిన ఘటన శనివారం ఇల్లెందులో జరిగింది. చంద్రుగొండ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసరావు శనివారం తెల్లవారుజామున ఛాతీ నొప్పితో కుప్పకూలిపోయారు. వెంటనే అతనిని కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. శ్రీనివాసరావు మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.

విద్యుత్ షాక్తో చిన్నారి మృతిచెందిన ఘటన చింతకాని మండలంలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మత్కేపల్లి నామవరం గ్రామానికి చెందిన కటికరాల రామకృష్ణ కూతురు అంజలి శుక్రవారం మొబైల్ ఛార్జింగ్ పెడుతుండగా ఒక్కసారిగా కరెంట్ షాక్కు గురైంది. అక్కడికక్కడే చనిపోయింది. ఘటనపై కేసు నమోదైంది. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

2024-25 విద్యా సంవత్సరానికి సంబందించి దూర విద్యా విధానంలో పదో తరగతి, ఇంటర్మీడియట్లో చేరేందుకు షెడ్యూల్ ను ఆగస్టు 8 నుంచి ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభిస్తున్నట్లు డీఈవో సోమశేఖర శర్మ తెలిపారు. ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 10 వరకు ఫీజు చెల్లించవచ్చునని తెలిపారు. వివరాలకు 8008403522 నెంబర్ను సంప్రదించాలని తెలిపారు.

కేయూ పీజీ (MA/M.Com/M.Sc) రెండో సెమిస్టర్ పరీక్షా టైం టేబుల్ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్.నరసింహచారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ బీఎస్ఎల్. సౌజన్య విడుదల చేశారు. ఆగస్టు 7న మొదటి పేపర్, 9న రెండో పేపర్, 12న మూడో పేపర్, 14న నాల్గో పేపర్, 16న ఐదో పేపర్, 19న ఆరో పేపర్ పరీక్ష ఉన్నట్లు పేర్కొన్నారు. పరీక్షలు మధ్యాహ్నం 2 – 5 గంటల వరకు జరుగుతాయన్నారు.

రైలు నుంచి జారి పడి యువకుడు మృతి చెందిన ఘటనపై శుక్రవారం కేసు నమోదైంది. రైల్వే జీఆర్పీ ఎస్ఐ భాస్కరరావు వివరాల ప్రకారం.. బిహార్ మధుబని మండలం బైరాకి చెందిన లలిత్ సదయ్ (22) బంధువులతో కలిసి ఈనెల 24న ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో రామన్నపేట రైల్వే గేట్ వద్ద కాలు జారి పడిపోయి మృతిచెందగా పోలీసులు శుక్రవారం మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్కు అప్పగించారు.

∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్కి సెలవు
∆} వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} తల్లాడ మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} సత్తుపల్లిలో జిల్లా కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ పర్యటన

వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుడడంతో వెంకటాపురం మండలంలో గోదావరి వరద పెరుగుతోంది. శుక్రవారం రాత్రి మండల పరిధిలోని బోధాపురం బ్రిడ్జి పైకి, వీరభద్రవరం గ్రామ సమీపంలోని కుక్కతోగు వాగు వద్ద గోదావరి వరద నీరు రోడ్లపైకి చేరాయి. దీంతో చర్ల, వెంకటాపురం మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయినట్లు స్థానికులు తెలిపారు.

ఖమ్మం: సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్లు గుర్తించి గంటలో ఫిర్యాదు చేయడం వల్ల బాధితులకు మరింత మేలు జరుగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఖమ్మం నగరానికి చెందిన ఓ యువతి సైబర్ నేరగాళ్ల బారినపడి లక్షల రూపాయల నగదును పోగొట్టుకుందని చెప్పారు. వెంటనే యువతి 1930 కు కాల్ చేయడంతో గంటల వ్యవధిలోనే ఆ నగదును ఫ్రీజ్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. సైబర్ నేరస్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
Sorry, no posts matched your criteria.