India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం పెరుగుతోంది. బుధవారం 12 అడుగులు ఉన్న నీటిమట్టం గురువారం సాయంత్రం 4 గంటల వరకు 13 8 అడుగులకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు మరో 0.7 అడుగులు పెరిగి 14.5 అడుగులకు చేరుకోనున్నట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.
మధిర: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం ఒడిశా బయలుదేరారు. కాగా 2015లో ఒడిస్సా రాష్ట్రంలోని అంగుల్ జిల్లాలోని నైని బొగ్గు గని సింగరేణికి కేటాయించారు. ఈ బొగ్గు గని ప్రారంభం సజావుగా నిర్వహణకు సహకరించాల్సిందిగా కోరేందుకు డిప్యూటీ సీఎం ఒడిశా వెళ్లారు. మరికొద్ది సేపట్లో ఒడిశా సీఎం మోహన్ చరణ్తో డిప్యూటీ సీఎం భేటీ అయి బొగ్గు గని ప్రారంభంపై చర్చించనున్నారు.
ఇల్లందు మండల పరిధిలోని లచ్చగూడెం పంచాయతీకి చెందిన ఓ మహిళ గురువారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కోడెం అనసూయ (51) కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. బాధ భరించలేక గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగింది. ఆలస్యంగా గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. పరీక్షించిన రైతులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఖమ్మం పోలీస్ కమిషనరేట్లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ రాంబాబు రాసలీలలు బయటపడ్డాయి. ఏడాది క్రితం కోర్టు విషయంలో త్రివేణి అనే మహిళ కానిస్టేబుల్కు పరిచమైంది. చెల్లి అంటూ సదరు మహిళతో కానిస్టేబుల్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇటీవల త్రివేణిపై అనుమానం వచ్చిన భర్త నిలదీయడంతో విషయం బయటపడింది. దీంతో త్రివేణి భర్త పోలీసులను ఆశ్రయించారు. కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని కోరాడు.
ఖమ్మం: మహిళలను ఆర్థికంగా శక్తివంతులను చేయడమే మహిళా శక్తి పథకం ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మహిళా శక్తి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళల సామాజిక భద్రత కోణంలో సంఘాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.
ఖమ్మం: జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ 2023-2024 సంవత్సర జిల్లా గణాంకాల హ్యాండ్ బుక్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఓ శ్రీనివాస్, డిఆర్డీవో సన్యాసయ్య, జడ్పి సిఇఓ ఎస్. వినోద్, సింగరేణి మండల మహిళా సమైఖ్య అధ్యక్షురాలు సుహాసిని, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం: రైతుల అభిప్రాయాలకు అనుగుణంగానే రైతు భరోసా ఖరారు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో భట్టి మాట్లాడారు. తమ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల్లో కీలకమైన రైతు భరోసా పథకాన్ని ప్రజాక్షేత్రంలో రైతుల అభిప్రాయాలకు, అనుగుణంగా పకడ్బందీగా అమలు చేసి తీరుతుందన్నారు.
టీజీ ఎన్పీడీసీఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో జూనియర్ లైన్మెన్ నియామకానికి అభ్యర్థులకు స్తంభం ఎక్కే సామర్థ్య పరీక్ష బుధవారం నిర్వహించారు. ఖమ్మం సర్కిల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఇద్దరు అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపించగా ఒక్కరు మాత్రమే హాజరయ్యారు. అభ్యర్థి విజయవంతంగా స్తంభం ఎక్కడంతో అతని ధ్రువీకరణ పత్రాలు పరిశీలనకు వరంగల్ హెడ్ ఆఫీస్కు పంపిస్తున్నట్లు ఎస్ఈ సురేందర్ తెలిపారు.
ఉమ్మడి ఖమ్మం రీజియన్ TGSRTC వైద్యాధికారి డాక్టర్ గిరి సింహారావు బదిలీ అయ్యారు. సుదీర్ఘకాలంగా ఇక్కడ పని చేస్తున్న ఆయన మహబూబ్నగర్కు వెళ్లారు. ఉన్నతాధికారులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడంతో బుధవారం ఆయన విధుల నుంచి రిలీవ్ అయ్యారు. గత 25 సంవత్సరాల పైగా ఖమ్మం రీజియన్లో ఆయన సేవలో అందించారు.
భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. భద్రాచలంలో 11.5 అడుగుల మేర ప్రవహిస్తోంది. ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు, రిజర్వాయర్ల నుంచి నీరు దిగువకు వస్తోంది. ఎగువన వాజేడు మండలం పేరూరు వద్ద కూడా నీటి మట్టం పెరుగుతోంది. కాగా కొత్త నీటితో గోదావరి కళకళలాడుతోంది. గోదావరి ప్రవాహం పెరుగుతుందని, గోదారి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Sorry, no posts matched your criteria.