India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖమ్మం జిల్లాలో 2,46,683 ఇళ్లు ఉండగా వాటిని సర్వే చేస్తుంటే కొత్త గృహాలు లెక్కలోకి వస్తున్నాయి. కొత్త ఇళ్లను ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు. సోమవారం వరకు జిల్లాలో 64,621 పాత ఇళ్లను సర్వే చేయగా మరో 78,302 కొత్త ఇళ్లు గుర్తించి వాటి వివరాలు పొందుపరిచారు. వాస్తవ లెక్కల ప్రకారం ఇంకా 1,82,062 ఇళ్లు సర్వే చేయాల్సి ఉండగా కొత్త గృహాలను ఇంకెన్ని గుర్తిస్తారో తేలాల్సి ఉంది.
భద్రాద్రి జిల్లాలోని 481 గ్రామ పంచాయతీల్లో సుమారు 1,516 ఆవాసాల్లో 2,70,000 గృహాలకు ప్రస్తుతం మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు సరఫరా అవుతోంది. క్షేత్రస్థాయిలో సర్వేలో భాగంగా మంగళవారం వరకు 1,60,604 నివాసాల వివరాలు పొందుపరిచారు. పంచాయతీల్లో ఆన్లైన్లో ఇంటి నంబర్, పన్ను తదితర వివరాలతో నమోదైన ఇళ్లు 36,541 మాత్రమే. ఆన్లైన్లో నమోదుకాని పెండింగ్లోని నివాసాలు 1,82,615, కొత్త గృహాలు 1,24,063 ఉండటం గమనార్హం.
✓ వివిధ శాఖల అధికారులతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
✓పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన
✓ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
✓పాల్వంచలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
✓భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
వర్షాకాలంలో విషసర్పాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు, స్నేక్ రెస్క్యూ టీం సభ్యులు సూచిస్తున్నారు. కొత్తగూడెం పట్టణ పరిధి నెహ్రూబస్తీకి చెందిన రాజు ఇంట్లో పాము పిల్లలు కనిపించడంతో స్నేక్ రెస్క్యూ టీం మెంబర్ బలరాంకు సమాచారం అందించారు. దీంతో బలరాం, సహచరుడు పెద్దిరాజు కలిసి రాజు ఇంటికి వెళ్లి 30 వరకు తాచుపాము పిల్లలను పట్టుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి.పాటిల్ గోదావరి పరివాహకంలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించనున్నారు. ఈ మేరకు తహశీల్దార్ చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం 8.30 గంటలకు కలెక్టర్ పర్యటన ఉంటుందని మండల స్థాయి సిబ్బంది ఎంపీడీఓ, ఎంపీవో, మండల వ్యవసాయ అధికారి, విద్యాశాఖ అధికారి, వివిధ శాఖలకు చెందిన అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు.
తెలంగాణకు BRS నాయకత్వం అవసరమని కొత్తగూడె ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ బతికే ఉండాలని వ్యాఖ్యానించారు. యాదగిరిగుట్టలో నిర్వహించిన కార్యక్రమంలో కూనంనేని మాట్లాడుతూ.. అన్ని పార్టీల సహకారంతో సీఎం రేవంత్ రెడ్డి పాలన కొనసాగించాలన్నారు. ప్రభుత్వంలో భాగమైనా ఉద్యమాలు, పోరాటాలు ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య కళాశాలలో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి వేల్పుల విజేత మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను రేపటి నుంచి 25 తేదీ వరకు పాల్వంచ కలెక్టరేట్లోని జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు. దరఖాస్తులను https://kothagudem.telangana.gov.in/ వెబ్ సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి సీపీఐ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావును కలిశారు. ఆయన పువ్వాడ ఇంటికి వెళ్లి పువ్వాడ నాగేశ్వరరావు, విజయలక్ష్మి దంపతులను కలిసి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు ఇతరత్రా వ్యవహారాలపై కొద్దిసేపు ముచ్చటించారు.
భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో గోత్ర ప్రవర వివాదం పరిష్కరించాలంటూ హైకోర్టును కొందరు రామ భక్తులు ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో వివాద పరిష్కారానికి ఐదుగురు సభ్యులతో కమిటీని హైకోర్టు నియమించింది. భద్రాచలం దేవస్థానంలో మూడు రోజులు పాటు కమిటీ విచారణ చేపట్టనుంది.
తిరుమల తిరుపతి శ్రీవారిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకున్నారు. తెలుగు ప్రజల కష్టాలు తీర్చే శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించానని అన్నారు. తెలుగుజాతి ఔన్నత్యాన్ని, కీర్తిని కాపాడుకోవాలని, ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకోవాలన్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడటం మంచిది కాదని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.