India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మణుగూరు సింగరేణి ఏరియా ఓసి 3 నందు డంపర్ సెక్షన్లో విధులు నిర్వర్తిస్తున్న నరేష్ (41) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతదేహాన్ని సింగరేణి మార్చరీకి తరలించారు. విషయం తెలుసుకున్న టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు నాగేల్లి సందర్శించి మృతి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజియన్, ఖమ్మం, మధిర, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు పరిధిలో ఉన్న కమర్షియల్ షాప్లకు ఆన్లైన్ విధానంలో టెండర్ల ను ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి ఖమ్మం Dy.RM(O) G.N పవిత్ర తెలిపారు. ఆసక్తి గలవారు ఈనెల 23 నుంచి ఆగస్టు 8 వరకు అధికారిక వెబ్ సైట్ https://tender.telangana.gov.in (tender) లో టెండర్ వేయవచ్చని మరిన్ని వివరాలకు , 9963507506 సంప్రదించాలని సూచించారు.

గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన ఘటన ములకలపల్లి మండలంలో బుధవారం వెలుగు చూసింది. స్థానికుల వివరాల ప్రకారం.. నరసాపురం గ్రామ శివారులోని కాకతీయుల కాలంనాటి పురాతన ఆలయం వద్ద గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగినట్లు స్థానిక రైతులు బుధవారం గుర్తించారు. గుప్తనిధుల కోసం తవ్వకాలు జరపడం పరిపాటిగా మారిందని, అధికారులు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

పాము కరిచిందనే కంగారులో బైక్పై ఆస్పత్రికి వెళ్తుండగా అదుపు తప్పడంతో ఇద్దరు మృతిచెందారు. వివరాలిలా.. కారేపల్లి మండలం మేకలతండాకి చెందిన జే.సైదులు(32) మినీ డెయిరీ ఫామ్ నిర్వహిస్తున్నాడు. బుధవారం షెడ్డులో మరో కూలీతో పాటు పనిచేస్తుండగా సైదులును పాము కరిచింది. ఆస్పత్రికి వెళ్లే క్రమంలో బైక్ అదుపుతప్పడంతో సైదులుతో పాటు మరో వ్యక్తి చనిపోయాడు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ప్రవేశాల కోసం ఈనెల 26, 27వ తేదీల్లో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్ గ్రూప్లతో పాటు ఒకేషనల్ గ్రూప్లో మిగిలిన సీట్ల భర్తీకి కోసం ప్రభుత్వం అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. బాలికలకు 26వ తేదీన టేకులపల్లి గురుకులంలో, బాలురకు 27వ తేదీన తిరుమలయపాలెంలో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన రుణమాఫీని రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వర్లు సూచించారు. టేకులపల్లి మండలం బేతంపూడి పీఏసీఎస్, ఇల్లెందు, గుండాలలోని పీఏసీఎస్, డీసీసీబీ బ్రాంచితో పాటు కామేపల్లి మండలం తాళ్లగూడెం, కారేపల్లిలోని డీసీసీబీ బ్రాంచ్ను బుధవారం ఆయన సందర్శించారు. డీసీసీబీ పరిధిలో 37,625 రైతులకు రూ.121,63,40,360 రుణమాఫీ జరుగుతోందని తెలిపారు

> ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో మోస్తారు వర్షాలు
> తగ్గుముఖం పడుతున్న గోదావరి
> లోతట్టు ప్రాంతాలకు ముంపు ముప్పు నుండి విముక్తి
> నేడు భద్రాద్రి రామయ్య, పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయాల్లో ప్రత్యేక పూజలు
> నేడు ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్న ఇరు జిల్లాల కలెక్టర్లు
> భద్రాద్రి జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు
> నేడు వైరా నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు

చింతూరు, రంపచోడవరం డివిజన్లో అన్ని పాఠశాలలకు ఈరోజు జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ సెలవు ప్రకటించారు. ఏజెన్సీలో భారీ వర్షాలతో వాగులు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులను బయటకు పంపకుండా ఇళ్ల వద్దే ఉంచాలని కోరారు. ప్రైవేట్ విద్యాలయాలు కూడా సెలవు ఇవ్వాలన్నారు.

ఖమ్మం: కొత్త నేర చట్టాలను సవరించాలని కోరుతూ బుధవారం కేంద్ర న్యాయ శాఖ మంత్రికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న సెంట్రల్ నోటరీల నియామకాలను వెంటనే చేపట్టాలన్నారు. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లును అమలు జరపాలని కేంద్ర మంత్రిని కోరారు. అదేవిధంగా పలు సమస్యలను కేంద్ర మంత్రికి ఎంపీ వివరించారు.

ఖమ్మం: ప్రభుత్వం మహిళా శక్తి కింద చేపట్టిన వివిధ కార్యక్రమాలకు లబ్ధిదారుల ఎంపిక పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని అధికారులతో మహిళా శక్తి కార్యక్రమ యూనిట్లపై సమీక్ష నిర్వహించారు. మండల వారిగా మహిళా శక్తి కార్యక్రమ కార్యాచరణ చేయాలన్నారు. ఇందులో భాగంగా ఆయా ప్రాంతంలో ఉన్న డిమాండ్ ను బట్టి యూనిట్ల ఎంపిక చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.