Khammam

News July 9, 2024

బ్రెయిన్ డెడ్.. ఐదుగురికి అవయవదానం 

image

నేలకొండపల్లి మండలం మండ్రాజుపల్లికి చెందిన రైతు రంగారావు (53) జూన్ 28న ఇంట్లో ఉన్నట్టుండి కిందపడిపోయారు. కుటుంబీకులు అతడిని హైదారాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. అత్యవసర విభాగంలో పది రోజులపాటు వైద్యం అందించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. జీవన్ దాన్ వైద్య బృంద సభ్యులు అతడి భార్య రేణుక ఇతర కుటుంబ సభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించగా ఐదుగురికి అవయవాలు దానం చేశారు. 

News July 9, 2024

బదిలీలకు దరఖాస్తు చేసుకోండి: జిల్లా కలెక్టర్

image

సాధారణ బదిలీల్లో భాగంగా అన్ని శాఖల జిల్లా ఆఫీసర్లు తమ సిబ్బంది ట్రాన్స్ ఫర్స్ దరఖాస్తులను ఈ నెల 12 లోపు ఇవ్వాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశించారు. బదిలీ దరఖాస్తులను 13 నుంచి 18 వరకు పరిశీలించనున్నట్లు తెలిపారు. మరోవైపు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ లో ప్రజల వద్ద నుంచి ఆయన దరఖాస్తులు స్వీకరించారు. గ్రీవెన్స్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి ఆఫీసర్లు చొరవ చూపాలన్నారు.

News July 9, 2024

KTDM: గుండెపోటుతో స్టాఫ్ నర్స్ మృతి

image

భద్రాచలం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి స్టాఫ్ నర్సు పి.కల్యాణి(36) విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో సోమవారం మృతిచెందారు. రోజువారీ విధుల్లో భాగంగా రాత్రి 8 గంటలకు ఆమె తనకు కేటాయించిన కాన్పు వార్డుకు వెళ్లి విధులు నిర్వహిస్తూ ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. అప్రమత్తమైన వైద్యులు చికిత్స అందించినా పరిస్థితి విషమించి మృతి చెందినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ తెలిపారు.

News July 9, 2024

ప్రతిరోజు 2 లక్షల మందికి పైగా ప్రయాణం: RM KMM

image

ఖమ్మం రీజియన్లో ప్రతిరోజు 517 బస్సులు నడుపుతున్నామని RM సరి రామ్ తెలిపారు. ఆయా బస్సులలో రెండు లక్షల నుంచి 2.30 లక్షల మంది ప్రయాణిస్తున్నారని ఆయన తెలిపారు. మహిళా ప్రయాణికుల కోసం లక్కీ డ్రా నిర్వహిస్తున్నామని చెప్పారు. నెలవారి సీజన్ టికెట్ రిటర్న్, జర్నీ రాయితీ టికెట్, సూపర్ లగ్జరీ చార్జితో లహరి NON AC బస్సు లలో ప్రయాణం వంటి సదుపాయాలు అందిస్తున్నామని వివరించారు.

News July 9, 2024

యజమాని, కౌలుదారు ముందే మాట్లాడుకోవాలి: మంత్రి తుమ్మల

image

రైతుభరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక కామెంట్స్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఆగస్టు 15వ తేదీలోపు ముప్పై వేల కోట్లు రైతులకు ఇవ్వబోతున్నామన్నారు. రైతు భరోసాకు సంబంధించి రైతులు, కౌలు రైతులు మాట్లాడుకోవాలని, కౌలు తీసుకునే ముందు చర్చించుకోవాలన్నారు. పంట వేసే రైతులకే రైతు భరోసా ఇవ్వాలనేది సీఏం నిర్ణయమని స్పష్టం చేశారు.

News July 9, 2024

వైయస్సార్‌పై భట్టి కామెంట్స్

image

పాలకుడు ఎలా ఉండాలో వైయస్సార్ చూపించారని, ఆయన హయాంలో MLCగా పని చేయటం మర్చిపోలేనని డిప్యూటి సీఎం  భట్టి విక్రమార్క అన్నారు. వైయస్సార్ చివరి వరకు ప్రజల కోసమే పని చేశారని, సీఎంగా వైయస్సార్ తనదైన ముద్ర వేశారన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజ్ రీఎంబర్స్మెంట్, 108వంటి సేవలు దేశానికే ఆదర్శమని, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ వంటి పథకాలతో రైతుల సంక్షేమానికి పాటుపడ్డారని అన్నారు.

News July 9, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} ఉమ్మడి జిల్లాలో సీత్లా పండుగ
∆} భద్రాచలంలో ఎమ్మెల్యే వెంకట్రావు పర్యటన
∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} వివిధ శాఖల అధికారులతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల పర్యటన
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన

News July 9, 2024

జేఎల్ఎం అభ్యర్థులకు రేపు స్తంభం ఎక్కే పరీక్ష

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని జూనియర్ లైన్మెన్ల (జేఎల్ఎం) అభ్యర్థులకు బుధవారం ఎంపిక పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఖమ్మం ఎస్ఈ ఏ.సురేందర్ తెలిపారు. రెండు పోస్టుల భర్తీకి స్తంభం ఎక్కే పరీక్ష నిర్వహించడంతో పాటు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే అర్హులైన అభ్యర్థులకు సమాచారం ఇచ్చిన నేపథ్యాన వారు హాజరుకావాలని సూచించారు.

News July 9, 2024

ఖమ్మం: ఆశా కార్యకర్త సూసైడ్

image

బోనకల్ మండలంలోని ఓ ఆశా కార్యకర్త ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాపల్లికి చెందిన జీ.పుల్లమ్మ(38) ఆశా కార్యకర్తగా పనిచేస్తోంది. భర్త బ్రహ్మం మద్యానికి బానిసై ఆమెను వేధిస్తున్నాడు. ఆదివారం కూడా మద్యం తాగొచ్చాడు. ఆమెతో గొడవపడి రాత్రి ఇంటి నుంచి వెళ్లి పాఠశాలలో పడుకున్నాడు. సోమవారం ఉదయం ఇంటికి వెళ్లి చూడగా పుల్లమ్మ విగతజీవిగా ఉంది.

News July 9, 2024

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: డీఈవో

image

ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించి రూ.26 లక్షలు స్వాహా చేసిన ఘటనపై అధికారులు విచారణలో వేగం పెంచారు. ఉద్యోగి రామకృష్ణ వివిధ పాఠశాలకు సంబంధించిన నిధులను డ్రా చేసి ఉండొచ్చని అనుమానంతో అప్రమతమైన అధికారులు ఆ దిశగా పరిశీలిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మ తెలిపారు.