Khammam

News August 12, 2024

పాల్వంచ: పసరుమందు చిన్నారి ప్రాణం తీసింది

image

పాల్వంచ మండలంలో మూడు నెలల బాలుడికి తల్లిదండ్రులు పసరు మందు పోయడంతో చనిపోయాడు. బాధితుల కథనం ప్రకారం.. పాల్వంచ మండలం కోయగట్టుకి చెందిన పద్దం వీరభద్రం, పమ్మిడీలకు మూడు నెలల చిన్నారికి తీవ్రంగా ఆయాసం రావడంతో పసరు మందు తాగించారు. కొద్దిసేపటికి అతడి పరిస్థితి విషమించింది. దీంతో 108లో పాల్వంచ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అయితే, అప్పటికే చిన్నారి చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు.

News August 12, 2024

బౌద్ధ స్తూపం అభివృద్ధికి రిపోర్ట్ తయారు చేయాలి: పొంగులేటి

image

నేలకొండపల్లి బౌద్ధ స్తూపం అభివృద్ధికి సంబంధించి జిల్లా అధికారులు సమగ్ర రిపోర్ట్ తయారు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బౌద్ధ స్తూపాన్ని బెస్ట్ ప్లేస్ కింద అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పారు. అభివృద్ధికి కావలసిన నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. నేలకొండపల్లి భక్తరామదాసు జన్మించిన స్థలం అని, మ్యూజియంగా భక్తరామదాసు మందిరం అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

News August 12, 2024

నేలకొండపల్లి బౌద్ధ స్తూపాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం మంత్రులు

image

నేలకొండపల్లి మండలంలోని బౌద్ధ స్తూపాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు జూపల్లి కృష్ణారావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు ఉదయం సందర్శించారు. ముందుగా మండలంలోని కాంగ్రెస్ కార్యకర్తలు డిప్యూటీ సీఎం మంత్రులకు ఘనస్వాగతం పలికారు. బౌద్ధ స్తూపాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రులు ఆదేశించారు.

News August 12, 2024

KTDM: మృతదేహం ఆమెదేనా!

image

 గొల్లగూడెం గోదారి రేవు వద్ద ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం కొట్టుకు వచ్చి చెట్టుకు వేలాడుతోందని స్థానికులు తెలిపారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కాగా ఇటీవల బూర్గంపాడు(M) సారపాక మేడే కాలనీకి చెందిన శైలజ(20) గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఇప్పటివరకు ఆమె మృతదేహం లభ్యం కాలేదు. ఈ మృతదేహం ఆమెదా ? కాదా? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News August 12, 2024

సీజనల్ వ్యాధుల వేళ ఆర్ఎంపీల దందా

image

ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీనిని క్యాష్ చేసుకొని కొందరు RMPలు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యంతో ఒప్పందాలు కుదుర్చుకొని, పేదలను దోపిడీ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. RMPతో కలిసి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే చికిత్స చిన్నదైనా భయం పెట్టి అడ్మిట్ చేయించుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.5 వేలు అయ్యే బిల్లును రూ.10 వేలు చేస్తున్నారని పేర్కొన్నారు.

News August 12, 2024

ఖిల్లా, బౌద్ధారామం అభివృద్ధికి ప్రతిపాదనలు

image

అభివృద్ధిలో జిల్లాను రాష్ట్రంలోనే ముందంజలో నిలిపేలా కృషిచేస్తున్నట్లు తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మం ఖిల్లాకు పూర్వవైభవం వచ్చేలా పనులు చేపడుతామని తెలిపారు. విద్యుద్దీపాలతో అలంకరించడంతో పాటు రోప్ వే, వ్యూ పాయింట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని చెప్పారు. అంతేకాక నేలకొండపల్లి మండలంలోని బౌద్ధారామం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్షేత్రం సుందరీకరణకు కృషి జరుగుతోందని అన్నారు.

News August 12, 2024

రూ.2 లక్షల రుణమాఫీపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

image

రెండు లక్షల రుణమాఫీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈనెల 15వ తేదీన కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెంలోని సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. అదే రోజు రూ.2 లక్షల రుణమాఫీ చేయబోతున్నట్లు ప్రకటించారు.

News August 12, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ప్రారంభం.. పెరిగిన మిర్చి ధర

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రెండు రోజుల సెలవు అనంతరం సోమవారం తిరిగి ప్రారంభమైంది. అయితే ఈరోజు మిర్చి మార్కెట్లో క్వింటా ఏసీ మిర్చి ధర రూ.19,600 ఉన్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. గతవారం (శుక్రవారం) కంటే ఈరోజు 100 రూపాయలు పెరిగినట్లు మార్కెట్ వ్యాపారస్థులు పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో మార్కెట్‌కు సరుకులు తీసుకువచ్చే రైతులు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.

News August 12, 2024

ఖమ్మం: ఫోన్ మాట్లాడుతూ హీటర్ ఆన్ చేశాడు..

image

ఫోన్ మాట్లాడుతూ చంకలో హీటర్ పెట్టుకుని స్విచ్ ఆన్ చేసిన ఘటన ఖమ్మంలో జరిగింది. దీంతో మహేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల వివరాలిలా.. కాల్వొడ్డులో మహేశ్ (40)ది కొబ్బరికాయల వ్యాపారం. ఆదివారం ఉదయం ఫోన్ మాట్లాడుతూ వాటర్ హీటర్ ఆన్ చేశాడు. హీటర్ అతని చంకలో ఉంది. దీంతో కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పాయాడు. ఈ ఘటనపై త్రీటౌన్ సీఐ రమేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News August 12, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

* ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
* ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రులు పొంగులేటి జూపల్లి తుమ్మల పర్యటన
* భద్రాద్రి జిల్లాలో ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి పర్యటన
* ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
* అన్నపురెడ్డిపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు
*మణుగూరు మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం