Khammam

News July 7, 2024

నిధుల్లేక గ్రామ పంచాయతీల పరేషాన్!

image

ఖమ్మం జిల్లాలో 589, కొత్తగూడెం జిల్లాలో 481 జీపీలు ఉన్నాయి. ఐతే పారిశుద్ధ్యం నిర్వహణకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్లు నేడు పంచాయతీ కార్యదర్శులకు భారంగా మారాయి. డబ్బులు లేక ట్రాక్టర్లు కార్యాలయంలోనే ఉంచుతున్నారు. బయటకు తీస్తే డిజీల్ కు డబ్బులు కావాలి. పెట్టుబడులు పెట్టే వారు లేరు. ఇప్పటికే అందినకాడికల్లా అప్పులు తెచ్చి పెట్టిన పంచాయతీ కార్యదర్శులు ప్రస్తుతం చేతులేత్తేశారు.

News July 7, 2024

ఖమ్మం: త్వరలో కొత్త రేషన్ కార్డులు!

image

కొత్త రేషన్ కార్డులు జారీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. త్వరలో కొత్త కార్డులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఆశావహుల్లో హర్షం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వం నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత మీ-సేవా పోర్టల్ ఓపెన్ చేసి కొత్త దరఖాస్తులు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి.

News July 7, 2024

కొత్తగూడెం: తల్లి మందలించిందని యువతి ఆత్మహత్య

image

తల్లి మందలించిందని మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బట్టీల గుంపు గ్రామ పంచాయతీలోని పాయం జానకిరామ్ గుంపునకు చెందిన కోరం కృష్ణవేణి (23) అనే యువతి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటుంది. పొలంలో పనికి రాకపోవడంతో తల్లి మందలించింది. మనస్తాపానికి గురైన యువతి శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

News July 7, 2024

సింగరేణి కొలువులకు రాతపరీక్షలు

image

సింగరేణి సంస్థ మొత్తం 10 కేటగిరీల్లో 272 పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ వెలువరించింది. ఇందులో భాగంగా ఈ నెల 20, 21 తేదీల్లో హైదరాబాద్ ఏర్పాటు చేయనున్న కేంద్రాల్లో రాత పరీక్షలను నిర్వహించనున్నట్లు యాజమాన్యం శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. హాజరయ్యే అభ్యర్థులు సింగరేణి వెబ్సైట్ నుంచి హాల్ టికెట్‌లు డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరింది.

News July 7, 2024

ఖమ్మం: తల్లీకూతురిని కరిచిన పాము

image

తల్లీకూతురును పాము కరిచిన ఘటన నేలకొండపల్లి మండలంలో శనివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. సుర్దేపల్లికి చెందిన రాధ(27), ఆమె కూతురు దీవెన (5) శుక్రవారం రాత్రి వరండాలో నేలపై నిద్రించారు. అర్ధరాత్రి సమయంలో కట్ల పాము తొలుత కూతురు దీవెనను, తర్వాత రాధను కరించింది. చుట్టుపక్కల వారు వచ్చి పామును చంపారు. అనంతరం వారిని ఆస్పత్రికి తరలించారు.

News July 7, 2024

ఉమ్మడి జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో పత్తి పంట సాగు

image

ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటివరకు పత్తి పంట ఒక్కటే అత్యధిక విస్తీర్ణంలో సాగైంది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన తొలినాళ్లలోనే పత్తి పంట సాగుకు రైతులు ఉపక్రమించారు. జూన్ మాసాంతానికి ఖమ్మం జిల్లాలో 1,81,723 ఎకరాలు, భద్రాద్రి జిల్లాలో 1,88,263 ఎకరాల్లో పత్తి పంట సాగైంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఈపంట సాగైందని వ్యవసాయశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

News July 7, 2024

గడిచిన పదేళ్లలో కుంటుపడిన అభివృద్ధి!

image

రాష్ట్ర విభజన తర్వాత ఎక్కువగా నష్టపోయింది భద్రాచలం పుణ్యక్షేత్రం. తెలంగాణ ఏర్పడ్డాక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు, కూనవరం, వరరామచంద్రాపురం , చింతూరు పూర్తిగా ఏపీలో కలిశాయి. భద్రాచలం మండలంలోని రెవెన్యూ గ్రామం మినహా మిగతా గ్రామాలు, బూర్గంపాడు మండలంలో కొన్ని గ్రామాలను ఏపీలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో గడిచిన పదేళ్లలో భద్రాచలం అభివృద్ధి కుంటుపడింది.

News July 7, 2024

డిగ్రీ ఆరో సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో నిర్వహించిన డిగ్రీ ఆరో సెమిస్టర్ పరీక్ష ఫలితాలు శనివారం సాయంత్రం పరీక్షల నియంత్రణ అధికారి నరసింహ చారి విడుదల చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 11,809 మంది విద్యార్థులు పరీక్ష రాయగా అందులో 6,352 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పరీక్షల ఫలితాలు సంబంధిత వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

News July 7, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లా విజృంభిస్తున్న విషజ్వరాలు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. విషజ్వరాలతో జనం మంచం బారిన పడుతున్నారు. వర్షాకాలానికి తోడు వాతావరణ మార్పులతో అంటు వ్యాధులు వ్యాపిస్తున్నాయి. రోగులతో ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ నిండిపోతున్నాయి. అయితే ఈ సమయంలో జనం ఇష్టం వచ్చినట్లు సొంత వైద్యం చేసుకోకుండా క్వాలిఫైడ్ డాక్టర్ల దగ్గరికి వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు.

News July 7, 2024

ఆర్టీసీ కార్మికులపై మోయలేని భారం!

image

సురక్షిత ప్రయాణానికి మారుపేరైన ఆర్టీసీ అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే కార్మికులపై మోయలేని భారం పడుతోంది. చాలీచాలని వేతనాలు, అధికారుల వేధింపులు, పాత బస్సులు, డబుల్ డ్యూటీలు, పని ఒత్తిడితో అలసటకు గురవుతున్న కార్మికులు అనారోగ్యం బారిన పడుతున్నారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రోడ్డుపై ఎప్పుడే ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి ఎదురవుతోంది.