India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఏరియా ఆసుపత్రులు-3, సీహెచ్సీలు -11, పీహెచ్సీలు-59, ప్రైవేటు ఆసుపత్రులు సుమారు 600 వరకు ఉన్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో శనివారం అత్యవసర సేవలు మాత్రమే అందిస్తామని చెప్పటంతో ఆ ప్రభావం ప్రభుత్వ దవాఖానాలపై పడనుంది. జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీకి ముందు లేదా ఓపీ తర్వాత ఒక గంటపాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

*వివిధ శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం
*చింతూరు డివిజన్ ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్ ఎన్నికలు
*అన్నపురెడ్డిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
*ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
*ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు
*వైరాలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పర్యటన
*సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన

ఖమ్మం వ్యవసాయం మార్కెట్కు ఇవాల్టి నుంచి మూడు రోజులు సెలవులు ఉంటాయని ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్ కుమార్ తెలిపారు. శని, ఆదివారాలు వారాంతపు సెలవు దినాలు కాగా, సోమవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా సెలవు ప్రకటించనట్లు పేర్కొన్నారు. తిరిగి మంగళవారం నుంచి కొనుగోళ్లు మొదలవుతాయని రైతులు గమనించాలన్నారు.

కొత్తగూడెం: గంజాయి రవాణాను అరికట్టడంలో జిల్లా పోలీసుల పనితీరు భేష్ అని మల్టిజోన్-1 ఐజీపి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో జిల్లా పోలీసు అధికారులతో మల్టీ జోన్-1 ఐజిపి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసుల పనితీరును, నిషేధిత మావోయిస్టుల కదలికల పట్ల ప్రస్తుత స్థితిగతులను ఎస్పీ ఐజీపీకి వివరించారు.

* సహచరుడిని హతమార్చిన మావోయిస్టులు
*ఎస్పీకి రాఖీ కట్టిన మంత్రి సీతక్క
*రైతు రుణమాఫీ చేశామని సీఎం చెప్పడం పచ్చి అబద్ధం: ఎమ్మెల్సీ
*భద్రాద్రి రామాలయంలో వరలక్ష్మీ వ్రతం పూజలు
*మణుగూరులో కత్తితో మహిళపై దాడి
*గంజాయి అరికట్టడంలో జిల్లా పోలీసుల పనితీరు భేష్
*కేటీఆర్ తన నోటిని అదుపులో ఉంచుకోవాలి: ఎమ్మెల్యే రాగమయి

డెంగ్యూ జ్వరంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం ఖమ్మం రూరల్ మండలంలో చోటు చేసుకుంది. తీర్థాలకు చెందిన మాచర్ల మధు(30) గత మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. కాగా ఖమ్మంలోని ఓ ఆసుపత్రిలో చూపించగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో డెంగ్యూ నిర్ధారణ అయింది. అటు అతని లివర్లకు కూడా ఇన్ఫెక్షన్ కావడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో మరణించాడు.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు మూడు రోజులు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శని, ఆదివారం వారాంతపు సెలవులు, సోమవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా సెలవు ప్రకటించినట్లు తెలిపారు. తిరిగి మంగళవారం నుండి మార్కెట్లో పంట క్రయవిక్రయాలు జరుగుతాయని చెప్పారు. కావున జిల్లా రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో పలు విభాగాల్లో ఫొటోగ్రఫీ పోటీలను నిర్వహించారు. ఖమ్మంకి చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ చావా సంపత్ కుమార్ తీసిన చిత్రాలకు నేచర్ వైల్డ్ లైఫ్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభా పురస్కారం లభించింది. ఈ ఫొటోగ్రఫీ పోటీల్లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు ఫొటోగ్రాఫర్స్ పాల్గొన్నారు. ఈనెల 19న అవార్డు అందుకోనున్నారు.

ఖమ్మం జిల్లాలో మూడో విడత రైతు రుణమాఫీ లిస్టును జిల్లా అధికారులు శుక్రవారం విడుదల చేశారు. మూడో విడతలో మొత్తం 23,828 మంది రైతులకు రూ.లక్షన్నర నుంచి 2 లక్షల వరకు ప్రభుత్వం రుణమాఫీ చేయనుంది. అటు మొదటి, రెండు విడతల్లో వివిధ కారణాలతో రుణమాఫీ కానీ రైతులు స్థానిక కలెక్టరేట్ నందు ఏర్పాటుచేసిన, రైతు రుణమాఫీ ప్రత్యేక కౌంటర్ నందు సంప్రదించాలని జిల్లా అధికారులు పేర్కొన్నారు.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.19,500 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,275 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. (బుధవారం) కంటే ఈరోజు పత్తి ధర రూ.26 తగ్గగా, ఏసీ మిర్చి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్థులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.