Khammam

News July 5, 2024

వేరుశనగ నూనె ట్యాంకర్ బోల్తా.. ఎగబడ్డ జనం

image

కాకినాడ నుంచి HYD నూనె లోడుతో వెళుతున్న ట్యాంకర్ దమ్మపేట మండలం మొద్దులగూడెం వద్ద బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోగా ఈ ప్రమాదం జరిగింది. నూనె కోసం జనాలు ఎగబడ్డారు. క్యాన్లలో నింపుకుని వెళ్లారు. కాగా ఈ ప్రమాదంలో డ్రైవర్‌, క్లీనర్‌కు గాయాలయ్యాయి.

News July 5, 2024

ఉద్యోగ నియామక పత్రాలు అందించిన మంత్రి తుమ్మల

image

టీజీపీఎస్సీ ద్వారా ఇటీవల రిక్రూట్ అయిన 18 మంది హార్టికల్చర్ ఆఫీసర్స్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నియామక పత్రాలు అందజేశారు. వ్యవసాయ రంగంలో మంచి మార్పులు తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 

News July 5, 2024

రేపు ఉమ్మడి జిల్లాస్థాయి స్విమ్మింగ్ ఎంపిక పోటీలు

image

కొత్తగూడెంలోని సీఈఆర్ క్లబ్లో ఈ నెల 6న ఉమ్మడి ఖమ్మం జిల్లాస్థాయి సబ్ జూనియర్, జూనియర్ బాలబాలికల స్విమ్మింగ్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు స్విమ్మింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జి.హన్మంతరాజు తెలిపారు. ఇక్కడ ఎంపిక చేసే జట్టును ఈ నెల 13, 14వ తేదీల్లో సికింద్రాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు.

News July 5, 2024

వేరుశనగ నూనె ట్యాంకర్ బోల్తా.. ఎగబడ్డ జనం

image

కాకినాడ నుంచి HYD నూనె లోడుతో వెళుతున్న ట్యాంకర్ దమ్మపేట మండలం మొద్దులగూడెం వద్ద బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోగా ఈ ప్రమాదం జరిగింది. నూనె కోసం జనాలు ఎగబడ్డారు. క్యాన్లలో నింపుకుని వెళ్లారు. కాగా ఈ ప్రమాదంలో డ్రైవర్‌, క్లీనర్‌కు గాయాలయ్యాయి.

News July 5, 2024

బదిలీలపై చర్చ

image

ఖమ్మం జిల్లాలో కలెక్టరేట్ సహా ఏ శాఖ కార్యాలయంలో చూసినా.. ఎక్కడ నలుగురు ఉద్యోగులు కలిసినా బదిలీలపైనే చర్చ జరుగుతుంది. జిల్లా, జోనల్, మల్టీ జోనల్గా మూడు కేటగిరీల్లో బదిలీలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయమై 2, 3 రోజుల్లో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. జిల్లాలోని 58 శాఖల్లో 7,053మంది అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక్కో కేటగిరీలో 40 శాతం మందికి బదిలీలు జరగనున్నాయి.

News July 5, 2024

జిల్లాలో కొత్త మండలాలు ఏర్పాటయ్యేనా !?

image

రాష్ట్ర విభజన అనంతరం పాలనా సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాలతోపాటు మండలాలు, రెవెన్యూ డివిజన్లను బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐతే కొంత కసరత్తు జరిగినా ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇటీవలే పొంగులేటి పాలేరు నియోజకవర్గంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ అంశంపై చర్చించగా.. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొత్త మండలాల ఏర్పాటుకు సానుకూలత ఉన్న ప్రాంతాలను పరిగణనలోకి తీసుకోవాలనే వినతులు వెల్లువెత్తుతున్నాయి.

News July 5, 2024

కోల్డ్ స్టోరేజీలలో పేరుకుపోతున్న నిల్వలు

image

ఖమ్మం జిల్లాలో 42 కోల్డ్ స్టోరేజీలు ఉండగా, సుమారు 45 లక్షల వరకు మిర్చి బస్తాలను నిల్వ చేసే సామర్థ్యం ఉంది. గత ఏడాది వానాకాలం సీజన్లో జిల్లావ్యాప్తంగా 92,273 ఎకరాల్లో మిర్చి సాగు చేసిన రైతులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేశారు. మధిరలోని 13కోల్డ్ స్టోరేజీల్లో సుమారు 12లక్షల బస్తాలు నిల్వ చేసినట్లు అంచనా. కనీసం రెండు లక్షల బస్తాలను కూడా విక్రయించకపోవడంతో 10 లక్షలకు పైగా బస్తాలు నిల్వ ఉన్నాయి.

News July 5, 2024

మధిరలో తెల్లవారుజామున రైలు కింద పడి మృతి

image

రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన ఇవాళ తెల్లవారుజామున మధిర రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. లోకో పైలట్ సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు పేర్కొన్నారు.

News July 5, 2024

ఏడుగురికి ఏఎస్ఐగా పదోన్నతి

image

ఖమ్మం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఏడుగురు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐగా పదోన్నతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో వెంకటేశ్వర్లు(698), పద్మ కుమార్ (1537), శైలజ (2247), బాలస్వామి (608), బసవ నారాయణ (1994), వెంకటకృష్ణ (428), సూర్యచంద్రరావు (384) ఉన్నారు. వీరికి ఒకటి రెండు రోజుల్లో పోస్టింగ్ కేటాయించే అవకాశం ఉంది.

News July 5, 2024

నాగపూర్-అమరావతి హైవేపై హైకోర్టు స్టే

image

నాగపూర్ నుంచి అమరావతి వరకు నిర్మిస్తున్న ఎక్స్ప్రెస్ హైవేపై హైకోర్టు గురువారం స్టే విధించిందని పిటిషన్ దాఖలు చేసిన రైతులు వెల్లడించారు. ఎన్హెచ్ 163-జీ పేరుతో నిర్మిస్తున్న ఈ హైవేకు సంబంధించి తీర్థాల నుంచి వి వెంకటాయ పాలెం సెక్షన్లో 29 మంది రైతులు, ప్లాట్ల యజమానులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు తమ భూములను స్వాధీనం చేసుకోవద్దని హైకోర్టు ఆదేశించిందని తెలిపారు.