Khammam

News May 31, 2024

సీతారామ ప్రాజెక్టు కాలువలో పడి వృద్ధురాలు మృతి

image

అశ్వాపురం మండలం సీతారామ ప్రాజెక్టు కాలువలో పడి వృద్ధురాలు మృతి చెందింది. మృతదేహాన్ని గమనించిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. వారు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలు అమెర్డ కాలనీకి చెందిన షేక్ ఖాద్రి (80)గా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

News May 31, 2024

ఖమ్మం: పంచాయతీ ఎన్నికలు.. వారు మళ్లీ పోటీ చేయొచ్చు!

image

2019లో పంచాయతీ ఎన్నికలు జరగ్గా రూల్స్ పాటించని కారణంగా 98 మంది వార్డు సభ్యులపై అనర్హత విధించారు. ఫలితాలు ప్రకటించిన 45 రోజుల్లోగా అభ్యర్థులు ఆదాయ, వ్యయ వివరాలను అధికారులకు సమర్పించాలి. కొందరు వార్డు సభ్యులు నిరక్షరాస్యత, అవగాహన లోపంతో ఆ వివరాలను అందజేయలేదు. 2021లో మూడేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేశారు. జూన్‌తో నిషేధం ముగియడంతో వారికి మళ్లీ పోటీ చేసే ఛాన్స్ లభించింది.

News May 31, 2024

గోల్కొండ, శాతవాహన రైళ్లు రద్దు

image

ఖమ్మం మీదుగా వెళ్లే గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ రైళ్లను నిర్ణీత తేదీల్లో రద్దు చేస్తున్నట్లు ఖమ్మం రైల్వే కమర్షియల్ ట్యాక్స్ అధికారి ఎండీ జాఫర్ గురువారం తెలిపారు. గుంటూరు నుంచి సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్లే గోల్కొండ ఎక్స్ప్రెస్ జూన్ 1, 2, 5, 6, 8, 9 తేదీల్లో, విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్లే శాతవాహన ఎక్స్ప్రెస్(12713), పై తేదీల్లో రద్దు చేసినట్లు వివరించారు.

News May 31, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} అధికారులతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ ప్రియాంక సమీక్షా సమావేశం
∆} తిరుమలాయపాలెం మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} మణుగూరులో విద్యుత్ సరఫరాల అంతరాయం
∆} వైరా మండలంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} ఖమ్మంలో పవర కట్

News May 31, 2024

ఖమ్మం జిల్లాలో జూన్ 3 నుంచి బడిబాట కార్యక్రమం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జూన్ 3 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. జూన్ 1 నుంచే ఈ కార్యక్రమం ప్రారంభం అవనుండగా.. తాజాగా షెడ్యూల్‌ను మార్చింది. రోజూ ఉ.7 నుంచి ఉ.11 వరకు స్కూల్ టీచర్లు తమ పరిధిలోని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. చదువుకు దూరంగా ఉంటున్న పిల్లల్ని టీచర్లు ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించేలా చర్యలు తీసుకోనున్నారు.

News May 31, 2024

విత్తనాలు అందించే బాధ్యత కలెక్టర్లదే : మంత్రి తుమ్మల

image

ఎరువులు, విత్తనాలు రైతులకు అందించే బాధ్యత కలెక్టర్లదేనని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. సెక్రటేరియట్లో పత్తి, పచ్చిరొట్ట విత్తనాల పంపిణీపై మంత్రి సమీక్ష చేపట్టారు. ఈ మేరకు నకిలీ విత్తనాల విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విత్తనాల సరఫరాలో లోపాలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. జిల్లాలకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందిస్తున్నామన్నారు.

News May 31, 2024

నేటి నుంచి తెరుచుకోనున్న సినిమా థియేటర్లు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పది రోజులకు పైగా మూతబడి ఉన్న
థియేటర్లు శుక్రవారం తెరుచుకోనున్నాయి. ఈనెల 17 నుంచి సినిమా హాళ్లను మూసి ఉంచుతున్నట్లు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. నాటి నుంచి మూతబడిన హాళ్లను తిరిగి తెరవాలని అసోసియేషన్ గురువారం నిర్ణయించడంతో నేటి నుంచి ఉమ్మడి జిల్లాలోని 30 థియేటర్లలో సినిమాలు ప్రదర్శించనున్నారు.

News May 31, 2024

నానో యూరియా వినియోగం అంతంత మాత్రమే!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతులు నానో ఎరువు 2, 3 శాతం కూడా వినియోగించడం లేదని తెలుస్తోంది. సాధారణ యూరియా బస్తా వేస్తే 30 శాతం పంటకు అందుతుండగా, నానో యూరియా వినియోగిస్తే 80 శాతం అందుతుందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. అరలీటర్ సీసాలో లభించే నానో యూరియా 45 కిలోల యూరియా బస్తాతో సమానం. రాయితీ పోను యూరియా బస్తా ధర రూ.266 ఉండగా, నానో యూరియా రూ.240కే లభ్యమవుతుంది.

News May 31, 2024

ఖమ్మం ఎంపీ ఎవరో.. ! తేలేందుకు 4 రోజులే

image

మరో నాలుగు రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం ఎంపీ అభ్యర్థుల భవిష్యత్తు ఏంటో తేలిపోనుంది. జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందుతారని ఆ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే బీఆర్ఎస్, బీజేపీ నాయకులు సైతం తమ అభ్యర్థి గెలుస్తారనే ధీమాతో ఉన్నారు. మరి ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి!

News May 31, 2024

ఖమ్మం: భూగర్భ జలాలు పెరిగాయి..

image

ఉపరితల ఆవర్తనం, ద్రోణి కారణంగా ఇటీవల కొన్ని మండలాల్లో వర్షాలు కురిశాయి. దీంతో ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏప్రిల్‌తో పోలిస్తే మేలో భూగర్భజలాలు పెరిగాయి. బోనకల్ మండలంలో 0.34, ముదిగొండ 0.25, కొణిజర్ల 0.71, సింగరేణి 1.88, కామేపల్లి 0.06, ఎర్రుపాలెం 1.83, రఘునాథపాలెం 0.46, సత్తుపల్లి 1.26, వేంసూరులో 1.11 మీటర్ల మేర నీటి మట్టం పెరిగింది. జిల్లాలో సగటున 0.26 మీటర్ల భూగర్భ జలాలు పెరిగాయి.