Khammam

News May 24, 2024

KMM: నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

image

ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షల నిర్వాహణకు అధికారులు జిల్లాలో 42కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు 14,984 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 10,352మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 4,632 ఉన్నారు. ఫస్ట్ ఇయర్ ఉదయం 9నుంచి మధ్యహ్నం 12గంటల వరకు సెకండ్ ఇయర్ మధ్యహ్నం 2:30 నుంచి 5:30వరకు నిర్వహిస్తారు. జూన్1న పరీక్షలు ముగియనున్నాయి.

News May 24, 2024

ఖమ్మం: రైస్ మిల్లును తనీఖీ చేసిన కలెక్టర్

image

సిఎంఆర్ రైస్ దిగుమతి లక్ష్యం త్వరితగతిన పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ గౌతమ్ అన్నారు. నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురంలోని అరుణాచల శివ రైస్ అండ్ ఫుడ్ ఇండస్ట్రీస్ ని క్షేత్ర స్థాయిలో కలెక్టర్ తనిఖీలు చేశారు. మిల్లు సామర్థ్యం, రోజుకు ఎంత మేర ధాన్యం పట్టేది, ఎంత ధాన్యం నిల్వ ఉన్నవి, హమాలీలు ఎంత మంది ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. ఖరీఫ్ లో వచ్చే పంటపై వివరాలు సేకరించారు.

News May 23, 2024

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భద్రాద్రి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పారామెడికల్ విద్యార్థిని మృతి చెందింది. దీంతో మృతిరాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 23, 2024

ACBకి చిక్కిన చర్ల డిప్యూటీ తహశీల్దార్

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం డిప్యూటీ తహశీల్దార్ భరణిబాబు ఏసీబీకి చిక్కాడు. పాసుపుస్తకం ఇచ్చేందుకు ఓ రైతును లంచం అడిగాడు. రైతు ఏసీబీకి సమాచారం అందించగా రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

News May 23, 2024

ఖమ్మం: ఆస్తి కోసం తండ్రిని చంపిన కూతురు..!

image

ఆస్తి కోసం కన్న కూతురే తండ్రిని చంపిన ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో చోటుచేసుకుంది. గోరిలపాడుతండాకు చెందిన తేజవత్ బిచ్చు(60)కు కూతురు సక్కుకు ఆస్తి పంపకాల నేపథ్యంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో సక్కు, మనుమరాలు నగ్మ కలిసి అతడిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 23, 2024

ఖమ్మం: జిల్లాకు ముగ్గురు ఏఎంవీఐలు

image

ఖమ్మం జిల్లాకు కొత్తగా ముగ్గురు ఏఎంవీఐ (అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్)లను కేటాయిస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో స్వర్ణలతను ఖమ్మంలోని జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి, కల్లూరు చెక్ పోస్ట్‌కు సాయిచరణ్, విజయశాంతిని కేటాయించగా గురువారం వారు విధుల్లో చేరారు. అయితే, వీరి కేటాయింపు తాత్కాలికమేనని ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం నియమించిందని రవాణా శాఖ వర్గాల ద్వారా తెలిసింది.

News May 23, 2024

ఖమ్మం: యథావిధిగా నడవనున్న రైళ్లు

image

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొంతకాలంగా మూడో లైన్ నిర్మాణ పనులతో నిలిచిపోయిన రైళ్లు గురువారం నుంచి యథావిధిగా నడుస్తాయని ఖమ్మం రైల్వే కమర్షియల్ అధికారి ఎండీ. జాఫర్ తెలిపారు. ఖమ్మం మీదుగా వచ్చివెళ్లే శాతవాహన, గోల్కొండ, కృష్ణ, ఇంటర్ సిటీ, మచిలీపట్నం, గౌతమి తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిర్ణీత సమయంలో రాకపోకలు సాగిస్తాయని వెల్లడించారు.

News May 23, 2024

భద్రాద్రి జిల్లాకు కొత్త రైల్వే లైన్

image

రామగుండం- మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైల్వే కోర్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే. ఈ మేరకు 207.80 కి.మీ మేర ఈ నడవా విస్తరించిన ప్రాంతాల్లో నూతనంగా బ్రాడ్ గేజ్ నిర్మించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భూ సేకరణ చేపట్టాలని SCR అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో 142 కి.మీ. దూరం తగ్గనుంది.

News May 23, 2024

ఖమ్మం: పెళ్లికి నిరాకరించిన వ్యక్తిపై కేసు నమోదు

image

ప్రేమించి పెళ్లికి నిరాకరించిన వ్యక్తిపై ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం కేసు నమోదైంది. పోలీసుల వివరాలు.. ఖమ్మం రూరల్ మండలంలో ఓ గ్రామానికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన సంజయ్ అనే యువకుడు ప్రేమ పేరుతో శారీరకంగా లోబర్చుకున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని యువతి కొద్ది రోజుల క్రితం నిలదీయగా, అతను నిరాకరించాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామారావు తెలిపారు.

News May 23, 2024

పంటల సాగుకు సిద్ధమవుతున్న ఖమ్మం జిల్లా రైతులు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇటీవల భారీ వర్షాలు కురవడంతో పంటలను సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. రేపటి నుంచి రోహిణి కార్తీ రానుంది. ఈ నేపథ్యంలో కార్తి వచ్చిన వెంటనే పంటలు సాగు చేసేందుకు ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాలలో రైతులు దుక్కులు దున్ని సిద్ధం చేసి ఉంచారు. సకాలంలో వర్షాలు కురుస్తుండడం వల్ల రైతులు పెద్ద ఎత్తున మెట్ట పంటల సాగుకు సిద్ధమవుతున్నారు.