India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇటీవల భారీ వర్షాలు కురవడంతో పంటలను సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. రేపటి నుంచి రోహిణి కార్తీ రానుంది. ఈ నేపథ్యంలో కార్తి వచ్చిన వెంటనే పంటలు సాగు చేసేందుకు ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాలలో రైతులు దుక్కులు దున్ని సిద్ధం చేసి ఉంచారు. సకాలంలో వర్షాలు కురుస్తుండడం వల్ల రైతులు పెద్ద ఎత్తున మెట్ట పంటల సాగుకు సిద్ధమవుతున్నారు.
ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం సీఎం రేవంత్ రెడ్డి చేశారు. బుధవారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన జూమ్ సమావేశంలో అభ్యర్థి తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్), మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్ ఇంచార్జీలు, అసెంబ్లీ నియోజక వర్గ ఇంఛార్జీలు, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
పత్తి విత్తనాలపై ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖతో పాటు టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. గతంలో అనేకసార్లు జిల్లాలో రైతులు నకిలీ విత్తనాలను కొని మోసపోయి దిగుబడి రాక నష్టాల పాలైన ఘటనలు ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ప్రస్తుత సీజన్లో నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. విత్తనాల శాంపిల్స్ను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించనున్నారు.
ఖమ్మం జిల్లాలోని పాఠశాలల్లో కనీస మౌలిక వసతులైన టాయిలెట్ల నిర్మాణం, తాగునీరు, విద్యుత్ సౌకర్యాల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈమేరకు ప్రణాళిక సిద్ధం చేసి పనులు చేపడుతుండగా.. అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఇందులో ఇప్పటికే 217పాఠశాలల్లో పనులు పూర్తి కావడంతో కళకళలాడుతున్నాయి. మిగతా పాఠశాలల్లో కూడా విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికి పూర్తిచేయాలనే లక్ష్యంతో అధికారులు ఉన్నారు.
రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్ హెచ్చరించారు. నకిలీలను అరికట్టేందుకు 21 టాస్క్ ఫోర్స్ పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేయొద్దన్నారు. అక్రమరవాణను అడ్డుకునేందుకు సరిహద్దు ప్రాంతాలలో చెక్ పోస్ట్ లను ఉంచామని పేర్కొన్నారు. తరుచూ నకిలీ విత్తనాలు అమ్మి పట్టుబడితే పీడీయాక్ట్ నమోదు చేస్తామన్నారు.
NLG -KMM-WGL పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక హీటెక్కిస్తోంది. ఈ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం హోరెత్తుతోంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని BRS, ఈసారి ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్ పట్టుదలతో వ్యవహరిస్తున్నాయి. ఈ ఎన్నికల్లోనూ బలమైన ఓట్లు సాధించాలని BJP భావిస్తోంది. ప్రచారానికి ఇంకా మూడు రోజులే గడువు ఉండడంతో అభ్యర్థుల తరఫున కీలక నేతలను రంగంలోకి దింపారు.
కారులో ఆడుకుంటూ చిన్నారి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం కొండయిగూడెంకి చెందిన చిన్నారి కల్నిషా (3) ఇంటి ముందు ఆడుకుంటూ ఇంటి పక్కనే నిలిపి ఉన్న కారులోకి వెళ్లింది.డోర్ ఆటోమేటిక్గా లాక్ అయి ఊపిరాడక మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. చిన్నారి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
పట్టభద్రులను బ్లాక్మెయిల్ చేస్తున్న కాంగ్రెస్ పట్టభద్రుల MLC అభ్యర్థి తీన్మార్ మల్లన్నను పోటీ నుంచి తప్పించాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని MLC స్వతంత్ర అభ్యర్థి బక్క జడ్సన్ నల్గొండ కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రచారం సందర్భంగా తీన్మార్ మల్లన్న శాసన మండలికి పంపుతారా.. లేకుంటే శ్మశానానికి పంపుతారా అని బ్లాక్మెయిల్ చేశాడన్నారు.
ఇన్స్టాలో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి ఫొటోలు మార్ఫింగ్ చేసి వేధిస్తున్నారంటూ ఓ డిగ్రీ విద్యార్థిని సీపీ సునీత్ దత్కు ఫిర్యాదు చేసింది. గతంలోనూ చాలా సార్లు వేధించారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఇన్స్టాలో అసభ్యంగా కామెంట్స్ చేస్తున్నారని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీని కోరింది.
∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ సమీక్ష సమావేశం
∆} సత్తుపల్లిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం
∆} వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} వివిధ శాఖలపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} మణుగూరు మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} అశ్వరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే పర్యటన
Sorry, no posts matched your criteria.