Khammam

News July 3, 2024

తలలో పెన్ను గుచ్చుకున్న బాలిక మృతి

image

<<13550256>>తలలో పెన్ను గుచ్చుకున్న<<>> నాలుగేళ్ల బాలిక మృతి చెందింది. సోమవారం భద్రాచలం సుభాష్ నగర్‌లో ప్రమాదవశాత్తు పెన్నుగుచ్చుకుంది. ఖమ్మం ఆసుపత్రికి తరలించగా చికిత్స చేసి వైద్యులు నిన్న పెన్ను తొలగించారు. పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం బాలిక మృతి చెందింది.

News July 3, 2024

ఖమ్మం: తలలో గుచ్చుకున్న పెన్ను.. చికిత్స సక్సెస్!

image

ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అరుదైన చికిత్స జరిగింది. భద్రాచలానికి చెందిన 5 ఏళ్ల చిన్నారి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు <<13550256>>తలలో పెన్ను గుచ్చుకొని <<>>కోమాలోకి వెళ్లింది. దీంతో హుటాహుటిన తల్లిదండ్రులు చిన్నారిని నగరంలోని ఓ ఆసుపత్రికి తరలించగా, సుమారు 4 గంటల పాటు వైద్యులు శ్రమించి తలలో గుచ్చుకున్న పెన్నును విజయవంతంగా తీశారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది.

News July 3, 2024

కొత్త చట్టాలతో బాధితులకు న్యాయం: సీపీ

image

దేశవ్యాప్తంగా జులై 1నుంచి అమల్లోకి వచ్చిన కొత్త చట్టాల ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని జిల్లా సీపీ సునీల్ దత్ వెల్లడించారు. బాధితుడు ఎస్‌ఎంఎస్, వాట్సాప్, ఈ – మెయిల్‌ ఇతర సామాజిక మాధ్యమాలు వేటి ద్వారానైనా ఫిర్యాదు చేయవచ్చన్నారు. బాధితులు కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజలు అపోహలకు తావివ్వకుండా కొత్త చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు.

News July 3, 2024

రైతు ఆత్మహత్య ఘటన.. పదిమందిపై కేసు నమోదు

image

తన పొలాన్ని ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ సోమవారం చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన <<13548972>>రైతు బోజడ్ల ప్రభాకర్‌ సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై మృతుడి తండ్రి వీరభద్రయ్య ఫిర్యాదు మేరకు ఖానాపురం హవేలి పోలీసు స్టేషన్‌లో పదిమందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్‌ భానుప్రకాశ్‌ వివరించారు.

News July 3, 2024

పదేళ్లలో BRS ప్రభుత్వం యువతకు ఏం చేసింది:పొంగులేటి

image

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో మార్పు రావాలని ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుని 6 నెలలు అయిందన్నారు. రైతులకు రుణమాఫీ కోసం శ్రీకారం చుట్టామని, ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఇచ్చిన మాటను ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు. యువతను ప్రతిపక్షం రెచ్చగొడుతుందని, పదేళ్ల BRS ప్రభుత్వం యువతకు ఏం చేసిందని ప్రశ్నించారు.

News July 2, 2024

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2024కు దరఖాస్తుల ఆహ్వానం

image

ఖమ్మం జిల్లాలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2024కు అర్హులైన ఉపాధ్యాయులు ఈనెల 15లోగా సంబంధిత వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి సోమ శేఖర శర్మ సోమవారం తెలిపారు. రెండు కాపీలను సంబంధిత మండల విద్యాశాఖ అధికారి ధ్రువీకరణతో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందించాలన్నారు.

News July 2, 2024

ఖమ్మం: నూతన చట్టం.. వన్ టౌన్‌లో మొదటి కేసు

image

నూతన చట్టాలు అమల్లోకి రాగా ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత) కింద చీటింగ్ కేసు నమోదైంది. నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతన్న దొడ్డా సాయి అనే వ్యక్తిపై 318, 62 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే గంధసిరి చెందిన షేక్ సలీమ్ (31) అనే ట్రాక్టర్ డ్రైవర్ మమతా రోడ్డులో ఇసుకను ఆన్ లోడింగ్ చేస్తూ గుండెపోటుతో మృతి చెందిన ఘటనపై సెక్షన్ 194 కింద కేసు నమోదైంది.

News July 2, 2024

ఖమ్మం: ముగిసిన ఉపాధ్యాయ బదిలీలు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. జిల్లాలోని 1,375 పోస్టులు ఖాళీగా ఉండగా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 1,105 మంది ఉపాధ్యాయులను బదిలీల ద్వారా భర్తీ చేశారు. మిగతా 270 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు బదిలీలతో మోక్షం లభించగా, విద్యార్థులకు న్యాయమైన బోధన అందే అవకాశం ఉందని విద్యాశాఖ చెబుతుంది.

News July 2, 2024

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు: మంత్రి పొంగులేటి

image

ఖమ్మం: ఇళ్లు లేని వారికి గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఆయన అన్నారు. సోమవారం గృహనిర్మాణాలపై సంబంధింత అధికారులతో నిర్వహించిన రివ్యూ సమావేశంలో మంత్రి మాట్లాడారు. 2024-2025 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇళ్లకు పెద్ద పీట వేస్తామని స్పష్టం చేశారు.

News July 2, 2024

చిన్నారులకు అభయహస్తం అందించాలి: సీపీ

image

ఖమ్మం: తల్లిదండ్రులకు దూరమైన చిన్నారులకు అభయహస్తం అందించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. అపరేషన్ ముస్కాన్-10 కార్యక్రమంలో భాగంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్లను పోలీస్ కమిషనర్ సోమవారం ప్రారంభించారు. నేటి నుంచి నెల పాటు జరిగే కార్యక్రమంలో బాల కార్మికులు, భిక్షాటన చేస్తున్న చిన్నారులను, ట్రాఫికింగ్ ద్వారా బందీలైన వారిని గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చాలన్నారు.