India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో
వివిధ సబ్జెక్టులు బోధించే అధ్యాపకుల కొరత ఉండడంతో కాంట్రాక్ట్, గెస్ట్, పార్ట్ టైం, లెక్చరర్లను నియమిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్ట్ టైం, కాంట్రాక్ట్ లెక్చరర్లు ఈ ఏడాది కూడా బోధన ప్రారంభించగా, గెస్ట్ లెక్చరర్లను సైతం విధుల్లో చేరాలని అధికారులు సమాచారం ఇచ్చారు. కాగా, జిల్లాలోని 20 కళాశాలల్లో 58 గెస్ట్ లెక్చరర్లు, 8మంది పార్ట్ టైం, 29మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉన్నారు.

ఖమ్మం జిల్లాలో జూన్ నెలలో సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. ఈ నెల సాధారణ వర్షపాతం 124.6 మి.మీ.లు కాగా ఆదివారం రాత్రి వరకు 198.8 మి.మీ.గా నమోదైందని అధికారులు తెలిపారు. ఇందులో శనివారం కురిసిన వర్షమే ఎక్కువ. జిల్లాలోని 16 మండలాల్లో సాధారణానికి మించి, కారేపల్లి, కామేపలి , తల్లాడ, ఏన్కూరు, ఎర్రుపాలెం మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. గత ఏడాది జూన్లో కేవలం 49.5 మి.మీ.ల వర్షపాతమే నమోదైంది.

భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట SI శ్రీరాములు(34) MHBD జిల్లా కేంద్రంలో పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. WGL జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటకు చెందిన శ్రీను అశ్వారావుపేటలో 5 నెలలుగా SIగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఉదయం స్టేషన్ నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టగా విషయం బయటపడింది. వరంగల్ ఆస్పత్రికి తరలించగా.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలోని స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాలకు ఖమ్మం జిల్లాస్థాయిలో నిర్వహించిన ఎంపిక పోటీలకు సరైన స్పందన రాకపోవడంతో మరోమారు పోటీలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. నాలుగో తరగతిలో ప్రవేశాలకు గత శుక్ర, శనివారాల్లో నిర్వహించిన పోటీలకు జిల్లావ్యాప్తంగా కేవలం 51 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. దీంతో ఈనెల 2వ తేదీన కూడా ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో పోటీలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్లల్లో అదనంగా మరో రెండు జనరల్ బోగీలను పెంచనున్నట్లు కేంద్ర మంత్రి ఇటీవల ప్రకటించారు. దీని పల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 17 రైల్వే స్టేషన్ల నుంచి ప్రయాణిస్తున్న సుమారు 6 వేల మంది ప్రయాణికులకు ఊరట లభించనుంది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది విద్యార్థులు, వ్యాపారులు, రోజువారీ కార్మికులే ఉన్నారు. కాకతీయ, సింగరేణి, మణుగూరు, బెళగావి రైళ్లను రెండు బోగీలు తగిలించనున్నారు.

తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం చింతకాని, మధిర మండలంలోని పలు గ్రామాల్లో బీటీ రోడ్డు
పనులకు శంకుస్థాపనలు చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలను
తమ ప్రభుత్వం అమలు చేస్తుందని వివరించారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శలు చేశారు. కిషన్ రెడ్డి అబద్ధాలు చెప్పడంలో ప్రధాని మోదీని మించిపోయారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు తలమానికమైన సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్ సంస్థలకు విక్రయించడం సరికాదన్నారు. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి నేతృత్వంలోనే సింగరేణి బొగ్గు గనులు వేలం జరగడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఖమ్మం రూరల్ పెద్ద తండాకు చెందిన బానోతు వీరన్న-జ్యోతి పెద్ద కుమారుడు బానోత్ అమిత్ రాథోడ్ ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించాడు. HYDలో ఇంటిగ్రేటెడ్ సివిల్స్ అకాడమీలో డిగ్రీ పూర్తి చేసి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ-పీజీ)ను ఇటీవల రాశాడు. ఎస్టీ కేటగిరీలో ఆల్ ఇండియా 35వ ర్యాంకు సాధించి సీటు పొందాడు. అమిత్ రాథోడ్ను పలువురు అభినందించారు.

ఎంపీ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులు బ్యాంక్ అకౌంట్ వివరాలను వ్యయ పరిశీలకులకు అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు అరుణ్ ప్రసాద్ కృష్ణస్వామి, శంకర నంద్ మిశ్రాలతో కలిసి ఖమ్మం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు.

మధిర మండలం మర్లపాడులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. గతంలో అనర్హులు కూడా పథకాలు అందజేశారని, తాము అర్హులైన వారికి మాత్రమే పథకాలు అందజేస్తామని తెలిపారు.
Sorry, no posts matched your criteria.