India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏజెన్సీలో నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో అధికారులు 4గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక, ములుగు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ ముగిసింది. నక్సల్స్ ప్రభావం లేని ఖమ్మం సెగ్మెంట్లో 6గంటల వరకు పోలింగ్ సాగనుంది. క్యూలో ఉన్నవారు మాత్రం ఓటేయనున్నారు.
ఖమ్మం పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఓవరాల్గా 63.67%శాతం నమోదైంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతమిలా. ఖమ్మం – 51.18, పాలేరు -67.95, మధిర -68.83, వైరా-67.79, సత్తుపల్లి-67.44, కొత్తగూడెం -60.92, అశ్వారావుపేట- 68.88
ఖమ్మంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పట్టణంలోని రాజేంద్రనగర్ జెడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ట్రాన్స్జెండర్స్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరూ ఒకేసారి క్యూలైన్లో వచ్చి ఓటు వేశారు. తమను కూడా ప్రతి ఒక్కరూ గౌరవించాలని వారు కోరారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి ప్రభుత్వం కల్పిస్తున్న ఓటు హక్కును వినియోగించుకుని మంచి ప్రభుత్వాన్ని ఎంచుకోవాలని ట్రాన్స్జెండర్లు సూచించారు.
ఖమ్మం పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంటల వరకు ఓవరాల్గా 50.63%శాతం నమోదైంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతమిలా. ఖమ్మం – 41.67, పాలేరు -53.70, మధిర -55.38, వైరా-53.72, సత్తుపల్లి-53.87, కొత్తగూడెం -47.60, అశ్వారావుపేట- 53.63
హార్ట్ ఎటాక్తో ఎలక్షన్ డ్యూటీ ఆఫీసర్ మృతి చెందిన ఘటన అశ్వారావుపేట మండలంలో చోటు చేసుకుంది. పేరాయిగూడెం బూత్ నెంబర్ 165లో ఓటింగ్ విధులకు అధికారి గుండె నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. స్థానికులు అతణ్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం లచ్చగూడెంలో గ్రామస్థులు పోలింగ్ను బహిష్కరించారు. గ్రామ సమస్యలు పరిష్కరించలేదని.. ఓటు వేసేది లేదని వారు చెబుతున్నారు. సాగు, తాగు నీరు లేక ఇబ్బంది పడుతున్నట్లు అవేదన వ్యక్తం చేశారు.
ఖమ్మం పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు ఓవరాల్గా 31.56%శాతం నమోదైంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతమిలా.
ఖమ్మం – 26.38,
పాలేరు -32.52,
మధిర -39.87,
వైరా-32.90,
సత్తుపల్లి-35.08,
కొత్తగూడెం -29.60,
అశ్వారావుపేట- 32.01
ఖమ్మం పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు ఓవరాల్గా 12.24శాతం నమోదైంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతమిలా..
ఖమ్మం – 11.08,
పాలేరు -11.65,
మధిర -13.79,
వైరా-11.65,
సత్తుపల్లి-15.61,
కొత్తగూడెం-10.75,
అశ్వారావుపేట- 11.16.
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాయమాదారంలో గ్రామస్థులు పోలింగ్ను బహిష్కరించారు. ఎన్ఎస్పీ కాలువపై బ్రిడ్జి నిర్మించలేదని.. ఓటు వేసేది లేదని వారు చెబుతున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం తెచ్చిన సీ-విజిల్ మొబైల్ యాప్లో ఓటర్లను ప్రలోభ పెట్టే అంశాలపై ఫిర్యాదు చేయోచ్చని, వీడియోలు, ఫొటోలతో యాప్లో ఫిర్యాదు ఇస్తే 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు తెలిపారు. తనిఖీ బృందాలు, ఎన్నికల పరిశీలకులు, ఇతర నిఘా బృందాలు నిరంతరం ఫిర్యాదులను పర్యవేక్షిస్తుంటాయి. అనధికార ప్రచారాలు, ఓటర్లను భయపెట్టడం, దాడులపై ఫిర్యాదు చేయోచ్చని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.